వెంకయ్యనాయుడి సేవలు ఆదర్శనీయం
‘వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, మాతృభూమికి సేవ చేయడంలో అంకితభావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికి మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరగని ఉత్సాహం నేటి యువతకు ఆదర్శనీయం...’ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు.
ఆయన్ను చూసే స్ఫూర్తి పొందాను
ఆత్మీయ అభినందనోత్సవంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా
నిజాయతీపరులతోనే ప్రజాస్వామ్యం పటిష్ఠం: వెంకయ్యనాయుడు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: వెంకటాచలం, న్యూస్టుడే: ‘వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, మాతృభూమికి సేవ చేయడంలో అంకితభావం, ప్రజా జీవితంలో వారి సుదీర్ఘ ప్రస్థానం, అన్నింటికి మించి పేద, అణగారిన వర్గాలకు సేవ చేయాలన్న వారి అలుపెరగని ఉత్సాహం నేటి యువతకు ఆదర్శనీయం...’ అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కొనియాడారు. అంత్యోదయ మార్గంలో గ్రామీణులు, యువత, అణగారినవర్గాలకు స్వర్ణభారత్ ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సోమవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు, నెల్లూరు కస్తూర్బా గార్డెన్స్లో జరిగిన వెంకయ్యనాయుడు ఆత్మీయ అభినందనోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘వెంకయ్యనాయుడును విద్యార్థి దశ నుంచి చూస్తూ పార్టీలో ఎదిగాను. ఈ తరానికి స్ఫూర్తిని పంచే నాయకుల్లో ఆయన ప్రథమ స్థానంలో ఉంటారు. దశాబ్దాలుగా వేలాది మంది కార్యకర్తల జీవితాలను ప్రభావితం చేయడం.. రాజకీయంగా వారిలో ఉన్నత విలువలు పెంపొందించేలా తీర్చిదిద్దిన నాయకుల్లో ఒకరు. పదవీవిరమణ చేసినా.. తమదైన విలక్షణ మార్గంలో ప్రజలకు నిత్యం దగ్గరగానే ఉన్నారు...’ అని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
‘రాజకీయ నాయకుల్లో ఓర్పు, నేర్పు, కూర్పు ఉండాలి. ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదు. గౌరవించాలి. ప్రజాప్రతినిధుల్లో నీతి, రీతి బాగుంటేనే ప్రజాస్వామ్యం పటిష్ఠంగా ఉంటుంది. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. నేను ఎవరినీ శత్రువులుగా చూడలేదు. అందుకే శాంతియుతంగా, సంతృప్తిగా జీవిస్తున్నా...’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ‘సమాజం నేర్పిన వ్యక్తిత్వం, ఆర్ఎస్ఎస్ నేర్పిన సంస్కారం, ఏబీవీపీ మార్గదర్శకం, భాజపా అందించిన ప్రోత్సాహం, నెల్లూరు ప్రజల అభిమానంతోనే ఈ స్థాయికి ఎదిగాను. ఇప్పటివరకు నాకు అప్పగించిన ప్రతి బాధ్యతను పూర్తి చేసే సంతృప్తిగా నెల్లూరుకు చేరుకున్నాను. పార్టీలకు దూరంగా ఉంటాను. కానీ రాజకీయాలపై మాట్లాడతాను...’ అని పేర్కొన్నారు. రోజూ నిద్రించే ముందు తాను చేసిన పనులు ఒకసారి గుర్తు చేసుకుని.. మరుసటి రోజు దాన్ని సరిచేసుకున్నప్పుడే రాజకీయాల్లో రాణిస్తారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. సేవకు తావు లేని జీవితం, రుచిలేని భోజనం లాంటిదన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన అభినందనోత్సవంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, స్వర్ణభారత్ ట్రస్ట్ ఛైర్మన్ కామినేని శ్రీనివాస్, ట్రస్టీ దీపా వెంకట్, ముప్పవరపు ఫౌండేషన్ ఛైర్మన్ హర్షవర్ధన్, గంగాధర్శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?