సంక్షిప్త వార్తలు (6)
ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 5 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ మరో 66,154 క్యూసెక్కుల వరదను నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయ 5 గేట్లు ఎత్తివేత
సున్నిపెంట సర్కిల్, న్యూస్టుడే: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం 5 రేడియల్ క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా 1,39,915 క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ మరో 66,154 క్యూసెక్కుల వరదను నాగార్జునసాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 1,16,516 క్యూసెక్కుల వరద వస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటినిల్వ 214.8450 టీఎంసీలుగా నమోదైంది.
గ్రూపు-1 ప్రిలిమినరీ డిసెంబరు 18న
ఈనాడు, అమరావతి: గ్రూపు-1 పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో డిసెంబరు 18న నిర్వహించనున్నట్లు ప్రాథమికంగా వెల్లడించింది. ప్రధాన రాత పరీక్షను వచ్చే ఏడాది మార్చి 15 తర్వాత నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రిలిమినరీకి ప్రధాన పరీక్షకు మధ్య ఎక్కువ సమయం లేదని, దీన్ని పెంచాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు.. పైపు లైన్తో నీటి సరఫరా
రూ.288 కోట్ల పనులకు త్వరలో శంకుస్థాపన
ఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కుకు నీటి సరఫరా కోసం మొదటి దశలో రూ.288 కోట్లతో పైపు లైను పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చేపట్టనుంది. ఈ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్కు చెందిన కేఎల్ఆర్ఎస్ సంస్థ పనులను టెండరు విధానంలో దక్కించుకుంది. ఈ పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల అవసరాల కోసం ముచ్చుమర్రి నుంచి 1.41 టీఎంసీల నీటిని తీసుకోవడానికి వీలుగా పైపులైను పనులను ఏపీఐఐసీ ప్రతిపాదించింది. ఈ నీటిని శ్రీశైలం వరద జలాల నుంచి ఏడాదిలో 100 రోజుల పాటు తీసుకునేలా అధికారులు ప్రతిపాదన రూపొందించారు. జలాశయాలు, ఇన్టేక్ వెల్, పైపు లైను, మోటార్ల ఏర్పాటుకు మొత్తం రూ.452 కోట్లతో పనులను ప్రతిపాదించారు.
రాష్ట్రం సుసంపన్నంగా వెలగాలి: గవర్నర్
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ‘కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలి, జగన్మాత అనుగ్రహం, కరుణా కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా, సుసంపన్నమై వెలగాలి’ అని ఆయన ఆకాంక్షించారు.
దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి: చంద్రబాబు
ఈనాడు, అమరావతి: దుర్గమ్మ ఆశీస్సులతో సకల జనులకు మంచి జరగాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆకాంక్షించారు. దసరా సందర్భంగా తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కనకదుర్గమ్మ కరుణాకటాక్షాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉండాలని, ఆ తల్లి చల్లని చూపులతో రాష్ట్రం సుభిక్షమై, సుసంపన్నమై వెలిగే రోజులు రావాలని కోరుకుంటున్నానని చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రాక్షసపాలనను అంతమొందించాలని ప్రార్థిస్తున్నా: పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి: ‘‘విజయ దశమి అంటే రాక్షస పాలనకు చరమాంకం. రాక్షస పాలన ఉన్న చోట ప్రజలను ఆ పరమేశ్వరి కాపాడాలని, అటువంటి పాలనను అంతమొందించాలని ప్రార్థిస్తున్నా. ఈ విజయదశమి ప్రజలందరికీ ఆరోగ్య, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా’’ అని జనసేన అధినేత పవన్కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?