విద్యుత్తు తీగల శిక్ష.. పరిష్కారం సమీక్షా?
విద్యుత్తు ప్రమాదం సంభవించినప్పుడల్లా ఆ శాఖ మంత్రి సమీక్షిస్తారు.
ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టదా
సమావేశాలతో సరిపెడుతున్న మంత్రి
ఆదేశాలు పాటించని అధికారులు
ఈనాడు, అమరావతి: విద్యుత్తు ప్రమాదం సంభవించినప్పుడల్లా ఆ శాఖ మంత్రి సమీక్షిస్తారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు హుకుం జారీ చేస్తారు... అంతటితో సరి. ఆ ఆదేశాలేవీ క్షేత్ర స్థాయిలో అమలు కావట్లేదు. నెల వ్యవధిలోనే అనంతపురం, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు విద్యుత్తు ప్రమాదాలు సంభవించాయి. విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా స్పందించే అధికారులే కరవయ్యారు. ప్రమాదాలు జరిగాక కొందరికి పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తప్పించి... నివారణకు డిస్కంలు చేపట్టిన చర్యల్లేవు. 2019-20, 2020-21లో రాష్ట్రంలో సంభవించిన విద్యుత్తు ప్రమాదాల్లో 675 మంది మరణించారు.
ఇళ్లపై నుంచే విద్యుత్తు తీగలు
రాష్ట్రంలో ఇప్పటికీ చాలాచోట్ల ఇళ్లపై నుంచి, చేతికి అందేంత ఎత్తులో తీగలు వెళ్తున్నాయి. ఎప్పుడో ఏళ్ల కిందట సబ్స్టేషన్లకు విద్యుత్తు సరఫరా కోసం ఏర్పాటు చేసిన తీగలు... పట్టణ, నగర పరిధులు విస్తరించడంతో ఇళ్ల మధ్య నుంచే వెళ్తున్నాయి. కొన్నిచోట్ల మనుషుల్ని తాకేలా ఉన్నా... అధికారులు వాటి ఎత్తు పెంచడం.. మరోచోటుకు మార్చడం వంటి పనుల్ని చేపట్టడం లేదు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్టలో దర్శిత్కు జరిగిన ప్రమాదమే అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. మూడేళ్ల బాలుడు ఎంత ఎత్తు ఉంటాడు? ఆ బాలుడినే తాకేంత ఎత్తులో తీగలు ఉన్నాయంటే ప్రమాదమే కదా? ఈ తీగలను మార్చాలని పదేళ్లుగా... అధికారులకు పదేపదే వినతిపత్రాలు పంపినా పట్టించుకోలేదు. అప్పుడే స్పందించి ఉంటే మూడేళ్ల బాలుడి ప్రాణం నిలిచేది. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందగానే స్పందించాలని మంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడం అంటే ఇదేనా?
* అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో పెళ్లయిన 8 నెలలకే వివాహిత విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. పొలంలో మోటారు స్విచ్వేసే సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇదే తరహాలో గత నెల కడప జిల్లాలో ముగ్గురు రైతులు చనిపోయారు.
* అనంతపురం జిల్లా దర్గాహొన్నూరులోనే విద్యుత్తు తీగలు తెగిపడి ఐదుగురు కూలీలు మృతి చెందిన దుర్ఘటన ఇటీవల చోటు చేసుకుంది. మళ్లీ కొన్నిరోజుల తర్వాత అదే చోటులో విద్యుత్తు తీగ తెగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?