Andhra News: గుర్రమెక్కి.. గడప గడపకూ

స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల శివారు లోసంగి గ్రామానికి రహదారి సదుపాయం లేదు.

Updated : 25 Dec 2022 09:22 IST

విప్‌ ధర్మశ్రీతోపాటు అధికారుల పయనం

రోలుగుంట, న్యూస్‌టుడే: స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల శివారు లోసంగి గ్రామానికి రహదారి సదుపాయం లేదు. రోడ్డే లేదంటే ఇతర మౌలిక వసతులెలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఉప్పు కావాలన్నా కొండలెక్కి, గుట్టలు దాటాల్సిందే. ‘గడపగడపకూ ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శనివారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ కొంతదూరం ద్విచక్రవాహనంపై, మరికొంత దూరం గుర్రంపై ప్రయాణించి లోసంగి చేరుకున్నారు. గిరిజనుల సమస్యలు తెలుసుకున్నారు. వారితో కలిసి థింసా నృత్యం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని