రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి ప్రకటించారు.
2019 నాటికి రూ. 2,64,451 కోట్ల రుణభారం
సగటున యేటా రూ.44,497.75 కోట్ల అప్పు
రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్ అప్పులు 2022-23 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం రూ.4,42,442 కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్చౌధరి ప్రకటించారు. మంగళవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2019 మార్చి నాటికి రూ.2,64,451 కోట్లమేర ఉన్న ఏపీ అప్పులు రాష్ట్రం ఇచ్చిన లెక్కల ప్రకారం 2023 మార్చి నాటికి రూ.4,42,442 కోట్లకు చేరినట్లు వివరించారు. రాష్ట్రప్రభుత్వం 2019 మార్చి తర్వాత యేటా సగటున రూ.44,497.75 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.1,77,991 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రమంత్రి సమాధానం ద్వారా వెల్లడైంది. బడ్జెటేతర మార్గంలో 2021-22లో రూ.6,287.74 కోట్లు, 2022-23లో (అంచనా) రూ.1,300.80 కోట్ల రుణం తీసుకున్నట్లు సీపీఎం సభ్యుడు జాన్బ్రిటాస్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్రమంత్రి పంకజ్చౌధరి బదులిచ్చారు. రాష్ట్రప్రభుత్వం ఈ రుణాలను కంపెనీలు, కార్పొరేషన్లు, స్పెషల్ పర్పస్ వెహికిల్స్ ద్వారా తీసుకొని వాటి అసలు, వడ్డీని బడ్జెట్ ద్వారా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర రుణ పరిమితులను నిర్ణయించే సమయంలో వీటిని పరిగణనలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్, అస్సాం, తెలంగాణ, కేరళ, సిక్కిం రాష్ట్రాలు కోరినట్లు తెలిపారు. ఇలా బడ్జెటేతర మార్గాల నుంచి రుణాలు తీసుకొని వాటిని రాష్ట్రబడ్జెట్ నుంచి చెల్లిస్తున్నా, రాష్ట్రప్రభుత్వానికి వచ్చే పన్నులు, సుంకాలు, ఇతర ఆదాయాన్ని అందుకు కేటాయించినా వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(3) కింద రాష్ట్రప్రభుత్వం చేసిన అప్పులుగానే పరిగణించనున్నట్లు కేంద్రమంత్రి పంకజ్ చౌధరి స్పష్టం చేశారు.
కేంద్ర పన్నుల్లో వాటా కింద నాలుగేళ్లలో రూ.1,39,361 కోట్లు
కేంద్ర పన్నుల్లో వాటా కింద ఆంధ్రప్రదేశ్కు గత నాలుగేళ్లలో రూ.1,39,361.18 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె మంగళవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 15వ ఆర్థికసంఘం సిఫార్సుల మేరకు ఆంధ్రప్రదేశ్కు 4.047% వాటా చొప్పున 2020-21లో రూ.24,460.59 కోట్లు, 2021-22లో రూ.35,385.83 కోట్లు, 2022-23లో రూ.38,176.74 కోట్లు అందించినట్లు చెప్పారు. 2023-24లో రూ.41,338.02 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
వివిధ మార్గాల్లో అయిదేళ్లలో ఏపీకి రూ.2.10 లక్షల కోట్లు
కేంద్రపన్నుల్లో వాటా, ఆర్థికసంఘం నిధులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ప్రత్యేకసాయం, మూలధన వ్యయం కింద ఆంధ్రప్రదేశ్కు 2017-18 నుంచి 2021-22 మధ్య అయిదేళ్లలో రూ.2,10,308 కోట్లను కేంద్రం ఇచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధరి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇందులో కేంద్రపన్నుల్లో వాటా కింద రూ. రూ.1,49,877.09 కోట్లు, ఆర్థికసంఘం నిధుల రూపంలో రూ.53,555 కోట్లు, విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ.8.64 కోట్లు, ప్రత్యేకసాయం కింద రూ.3,501.2 కోట్లు, మూలధన వ్యయం కింద గత మూడేళ్లలో రూ.3,366.54 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.
ఏపీలో ప్రభుత్వ సంస్థల విద్యుత్తు బకాయిలు రూ.12,294 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వం నుంచి విద్యుత్తు సంస్థలకు రూ.12,294.3 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నట్లు కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.