ఏటా 3 నెలలు భూసార పరీక్షలు
ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది రబీ ధాన్యం ఏప్రిల్ 15 నుంచి సేకరించాలి
వ్యవసాయ, ఉద్యానశాఖల సమీక్షలో సీఎం జగన్
ఈనాడు, అమరావతి: ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆ ఫలితాల ఆధారంగా జూన్ నాటికి రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం వ్యవసాయ, ఉద్యానశాఖలపై సీఎం సమీక్షించారు. ‘ఫ్యామిలీ డాక్టర్ తరహాలోనే ప్లాంట్ డాక్టర్ విధానాన్ని త్వరగా అందుబాటులోకి తేవాలి. భూసార పరీక్షలకు నమూనాల సేకరణ, పరీక్షలు, అవగాహన కల్పించడంపై సమర్ధమంతమైన ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) రూపొందించుకోవాలి’ అని నిర్దేశించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల విస్తీర్ణ గణన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించగా.. నష్టపోయిన రైతుల జాబితాను ఏప్రిల్ రెండో వారానికి విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. రబీ ధాన్యం ఏప్రిల్ 15 నుంచి సేకరించాలని సీఎం ఆదేశించారు. ‘ఆర్బీకేల్లో కియోస్క్ సేవలు పూర్తిస్థాయిలో అందేలా ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఉద్యాన పంటల మార్కెటింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.
శిక్షణలతో దిగుబడులు పెరిగాయి
పొలంబడి శిక్షణలతో సత్ఫలితాలు వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ‘శిక్షణ ఫలితంగా వరి, వేరుసెనగలో 15%, పత్తిలో 12%, మొక్కజొన్నలో 5% పెట్టుబడి ఖర్చులు తగ్గాయి. పత్తిలో 16%, మొక్కజొన్నలో 15%, వేరుసెనగలో 12% వరిలో 9% దిగుబడులు పెరిగాయి. పూర్తి సేంద్రియ సాగు పద్ధతుల దిశగా అడుగేయడానికి ఇది తొలిమెట్టు. 26 రైతు ఉత్పత్తి సంఘాలకుజీఏపీ(గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్) ధ్రువపత్రాలను ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎగుమతికి అవకాశమున్న వరి రకాల సాగును ప్రోత్సహిస్తున్నాం. 10 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున చిరుధాన్యాల క్లస్టర్లను ఏర్పాటు చేశాం. 3 ఆర్గానిక్ క్లస్టర్లూ ఉన్నాయి’ అని వివరించారు.
జులైలో టార్పాలిన్లు, స్ప్రేయర్లు
జులైలో టార్పాలిన్లు, జులై-డిసెంబరు మధ్య స్ప్రేయర్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ‘జులైలో 500, డిసెంబరు నాటికి మరో 1,500 డ్రోన్లు అందిస్తారు. ఏప్రిల్లో యంత్రాల పంపిణీ జరుగుతుంది’ అని అధికారులు వివరించారు. ఈ మేరకు రూపొందించిన షెడ్యూల్కు సీఎం ఆమోదం తెలిపారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, అగ్రి మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు తిరుపాల్రెడ్డి, ఉద్యానశాఖ సలహాదారు శివప్రసాద్రెడ్డి, ఏపీ ఆగ్రోస్ ఛైర్మన్ నవీన్ నిశ్చల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్