వివేకా హత్య కేసు దర్యాప్తునకు కొత్త సిట్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు కొత్త అధికారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటుచేసిన సీబీఐ
విస్తృత కుట్రకోణంపై ఏప్రిల్ 30లోపు తదుపరి దర్యాప్తు పూర్తికి హామీ
ఇప్పటివరకు ఉన్న అధికారి రామ్సింగ్ తొలగింపు
ఆయన కొనసాగింపునకు న్యాయమూర్తి అభ్యంతరం
ఈనాడు - దిల్లీ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులోని విస్తృత కుట్రకోణంపై దర్యాప్తును వేగంగా పూర్తి చేసేందుకు కొత్త అధికారిని నియమించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసింది. ఈ విషయాన్ని బుధవారం జస్టిస్ ఎంఆర్షా, జస్టిస్ సీటీ రవికుమార్తో కూడిన ధర్మాసనానికి తెలిపింది. కేసు విచారణ వేగంగా సాగడం లేదని, దర్యాప్తు అధికారులను మార్చాలని హత్య కేసులో నిందితుడిగా ఉన్న డి.శివశంకర్రెడ్డి సతీమణి తులసమ్మ వేసిన రిట్ పిటిషన్పై విచారించిన ధర్మాసనం సూచనల మేరకు సీబీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్సింగ్ను తొలగించారు. కొత్తగా ఏర్పాటుచేసిన సిట్ను డీఐజీ కేశవ్రామ్ చౌరాసియా పర్యవేక్షిస్తారు. ఎస్పీ స్థాయి అధికారి వికాస్కుమార్, అదనపు ఎస్పీ ముఖేష్శర్మ, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పునియా, సబ్ఇన్స్పెక్టర్ అంకిత్యాదవ్లను సిట్లో నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను బుధవారం సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ సమర్పించారు. దానికి జస్టిస్ ఎంఆర్షా ఆమోదం తెలిపారు. గత సోమవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ఏళ్లుగా సాగుతున్నా దర్యాప్తు పూర్తి కాలేదంటూ జస్టిస్ ఎంఆర్షా దర్యాప్తు అధికారిని మార్చాలని సీబీఐకి నిర్దేశించారు. దర్యాప్తును ఏప్రిల్ 30లోపు పూర్తి చేస్తామని సీబీఐ చెబుతున్న సమయంలో అధికారిని మారిస్తే కొనసాగింపు దెబ్బతినడంతోపాటు దర్యాప్తు జాప్యమయ్యే అవకాశముందని వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్షా కొత్త అధికారిని నియమించండి.. ప్రస్తుత అధికారినీ కొనసాగనివ్వండంటూ దీనిపై తదుపరి అభిప్రాయాన్ని బుధవారంకల్లా చెప్పాలని సీబీఐని ఆదేశించారు. దాన్ని అనుసరించి సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్ బుధవారం రామ్సింగ్ పేరునూ ఉంచి కొత్త దర్యాప్తు బృందం కూర్పును కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన జస్టిస్ ఎంఆర్షా అందులో రామ్సింగ్ పేరుపై అభ్యంతరం తెలిపారు. దర్యాప్తు బృందంలో ఆయన భాగంగానే ఉంటారని సీబీఐ న్యాయవాది బదులివ్వగా, న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఇంతవరకు ఏమీ చేయని ఆ ఏఎస్పీని ఎందుకు కొనసాగించాలి? అనవసరంగా కోర్టు ద్వారా ఎందుకు చెప్పించుకుంటారని ప్రశ్నించారు. కొత్త ఆర్డర్తో మధ్యాహ్నం రెండింటికల్లా కోర్టు ముందుకు రావాలని ఆదేశించారు. జస్టిస్ ఎంఆర్షా ఆదేశాల మేరకు మధ్యాహ్నం రెండింటికి సీబీఐ తరఫు న్యాయవాది నటరాజన్ కొత్త ఉత్తర్వులను ధర్మాసనానికి సమర్పించారు. దాన్ని పరిశీలించి న్యాయమూర్తి ఆమోదముద్ర వేశారు. ట్రయల్ను వేగంగా పూర్తి చేయాలని కింది కోర్టును ఆదేశిస్తామన్నారు. ఎప్పటిలోగా దర్యాప్తు పూర్తి చేస్తారని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గరిష్ఠంగా ఏప్రిల్ చివరిలోపు అని సీబీఐ న్యాయవాది బదులిచ్చారు.
తులసమ్మ భర్తకు బెయిల్ దరఖాస్తుకు నిరాకరణ
2022 జనవరిలో అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ తులసమ్మ భర్త 15 నెలలుగా జైల్లో ఉన్నారని, ఆయన బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛనివ్వాలని ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వి.వి.గిరి కోర్టుకు విన్నవించారు. దీనికి జస్టిస్ ఎంఆర్షా నిరాకరించారు. మీరు సమర్పించిన బెయిల్ దరఖాస్తును ఇటీవలే ఈ కోర్టు డిస్మిస్ చేసిందని గుర్తు చేశారు. ఇది జరిగి 4 నెలలైందని న్యాయవాది గిరి గుర్తుచేయగా, ఏడాదయ్యాక చూద్దామని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశాకైనా బెయిల్ దరఖాస్తు దాఖలుకు అవకాశమివ్వాలని కోరగా.. తదుపరి దర్యాప్తు విస్తృత కుట్రకోణానికి సంబంధించిదని జస్టిస్ ఎంఆర్షా గుర్తుచేశారు. మీపై ఛార్జిషీట్ దాఖలైందని పేర్కొన్నారు. ఛార్జిషీట్ దాఖలై 13 నెలలైందని, ఏప్రిల్ 30 తర్వాతనైనా బెయిల్ దరఖాస్తుకు స్వేచ్ఛనివ్వాలని న్యాయవాది గిరి పదేపదే విన్నవించారు. ఈ వాదనలతో జస్టిస్ ఎంఆర్షా విభేదించారు. సీబీఐ తాజాగా సమర్పించిన సిట్ను, ఏప్రిల్ 30లోపు దర్యాప్తును పూర్తి చేస్తామన్న హామీని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణను హైదరాబాద్ ట్రయల్ కోర్టు వేగంగా చేపట్టాలని నిర్దేశించారు. ఒకవేళ నిందితులకు సంబంధం లేని ఏదైనా కారణంగా ఈరోజు నుంచి 6 నెలల్లోపు ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇందులో ఏ5 (శివశంకర్రెడ్డి) రెగ్యులర్ బెయిల్ కోసం హైదరాబాద్ ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొన్నారు. దాన్ని చట్టప్రకారం కేసులోని మెరిట్స్ ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించారు. ప్రస్తుత రిట్ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించారు.
సిట్ పర్యవేక్షణాధికారి కేశవ్రామ్ చౌరాసియా 2003 జమ్మూకశ్మీర్ కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డిప్యుటేషన్పై సీబీఐలో డీఐజీ హోదాలో సేవలందిస్తున్నారు. సిట్లోని వికాస్కుమార్.. 2013 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం డిప్యుటేషన్పై సీబీఐలో ఎస్పీ హోదాలో ఉన్నారు.
ఒక్కోసారి ఒక్కో న్యాయవాదా?
పిటిషనర్ తులసమ్మ తరఫున ప్రతి విచారణ సమయంలో ఒక్కో కొత్త న్యాయవాది హాజరవడంపై జస్టిస్ ఎంఆర్షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదివరకు నీరజ్ కిషన్కౌల్, నిన్న అనుపంలాల్ దాస్, నేడు వి.వి.గిరి వచ్చారని గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
గతంలో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుల దొడ్డిదారి బదిలీలకు.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఆమోదిస్తూ(ర్యాటిఫై) పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్లు విడివిడిగా మెమోలు జారీ చేశారు. -
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
తితిదే మాజీ ప్రధానార్చకులు ఏవీ రమణదీక్షితులుపై నమోదు చేసిన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
కార్టూన్
-
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం