ఉల్లి రైతుకు వెన్నుపోటు
కర్నూలులో ఉల్లికి ధర రాక పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.. నా పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశా.
సాగుదారులను ఆదుకోని వైకాపా ప్రభుత్వం
గతం కన్నా మద్దతు ధర తగ్గింపుతో కోలుకోలేని దెబ్బ
నష్టాలు భరించలేక పంట సాగుకు కర్షకుల స్వస్తి
వీరిని ఆదుకుంటామని హామీలిచ్చి చేతులెత్తేసిన జగన్
కర్నూలులో ఉల్లికి ధర రాక పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి చూస్తున్నాం.. నా పాదయాత్రలో అతి దగ్గర నుంచి మీరు పడుతున్న కష్టాలు చూశా. బాధలు విన్నాను కాబట్టి నేను ఉన్నాను అని హామీ ఇస్తున్నా..
ఆదోనిలో 2019 మార్చి 25న జగన్మోహన్రెడ్డి మాటలివి..
వర్షాలతో దిగుబడులు తగ్గి మద్దతు ధర దక్కక ఏటికేడు నష్టాలు పెరుగుతుండటంతో రాష్ట్రంలో ఉల్లి సాగు తగ్గిపోతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది 79 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. ఇప్పటికి 31 వేల ఎకరాల్లో సాగు చేశారు. గత ఏడాది ఆగస్టులో 4,290 టన్నుల ఉత్పత్తి కర్నూలు మార్కెట్కు రాగా.. ఈ సంవత్సరం ఆగస్టులో 379 టన్నులు మాత్రమే రావడం ఉత్పత్తిలో క్షీణతకు అద్దం పడుతోంది. పంట లేకపోవడంతో వ్యాపారులు మహారాష్ట్ర, పుణేే నుంచి ఉల్లిని తెప్పిస్తున్నారు. అయినా ప్రభుత్వం పరిస్థితి తీవ్రతను గుర్తెరగడం లేదు. రైతులకు అండగా నిలిచే ఆలోచన చేయడం లేదు. మీ కష్టాలు విన్నానని, నేను ఉన్నానని ఎన్నికల ముందు చెప్పిన జగన్కు ఉల్లి రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదు.
పెట్టుబడులు సైతం రాక సాగుకు స్వస్తి
రాష్ట్రంలో సగటున ఏటా 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేస్తారు. సుమారు 9.80 లక్షల టన్నుల ఉత్పత్తి లభిస్తుంది. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉల్లి సాగు అధికం. వైఎస్సార్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 79 వేల ఎకరాల సాధారణ విస్తీర్ణం ఉండగా.. 31 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఉల్లి సాగుకు ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చవుతోంది. నాలుగేళ్లుగా పెట్టుబడులు కూడా రావడం లేదు. ఎకరాకు సగటున రూ.30 వేల వరకు నష్టపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. కొంతమంది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అధిక వర్షాలు, వర్షాభావం, తెగుళ్లతో గత ఏడాది ఖరీఫ్లోనూ దిగుబడులు తగ్గాయి.
తెదేపా ప్రభుత్వ హయాంలో రైతులకు దన్ను
తెదేపా ప్రభుత్వ హయాంలో ఉల్లి రైతుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. ఉల్లి నిల్వ సౌకర్యాలకు రాయితీపై నిధులు ఇచ్చింది. 2018-19లో ఉల్లి రైతులకు ధరల మద్దతు పథకం కింద కిలోకు రూ.6 చొప్పున అదనపు ధర కల్పించడం ద్వారా మొత్తం రూ.6.45 కోట్లు అందించింది. 2014-15 నుంచి 2018-19 వరకు రైతుల నుంచి 3.10 లక్షల టన్నుల ఉల్లిని సేకరించింది. క్వింటాలు ఉల్లిని రూ.800 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా కిలో రూ.10 నుంచి రూ.11 చొప్పున విక్రయించేలా చేసింది.
- వైకాపా అధికారంలోకి వచ్చాక క్వింటాలుకు రూ.770 చొప్పున మద్దతు ధరగా నిర్ణయించింది. అంటే గత ప్రభుత్వ హయాంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధర కంటే తక్కువే. అదీ సరిగా సేకరించిన సందర్భమే లేదు. రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో వేచి చూడాల్సి వచ్చింది. కొందరు మార్కెట్కు తెచ్చి నష్టపోవడం ఎందుకని పంటను పొలాల్లోనే వదిలేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో ధరల స్థిరీకరణ నిధి కింద 3,193 టన్నులు సేకరించారు.
కొరవడిన ప్రోత్సాహం
గతంలో ఉల్లి రైతులకు విత్తనాలను రాయితీపై ఇవ్వగా.. నాలుగేళ్లుగా నామమాత్రంగా కొందరికి ఇచ్చి మమ అనిపిస్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు రైతులకు ఉచితంగా, రాయితీపై మేలు రకం విత్తనాలు పంపిణీ చేస్తున్నాయి. గిట్టుబాటు ధరలు రాని సమయంలో మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నాయి. ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలో రైతులు గోదాముల్లో నిల్వ ఉంచుకుని ధరలు పెరిగినప్పుడు రైతులు విక్రయించుకునే సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన ప్రోత్సాహం లేదు. కర్నూలు జిల్లాలో సాగయ్యే ఉల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం లేదు. దీంతో వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలను అందించడంతో పాటు మద్దతు ధరను క్వింటాలుకు రూ.1,000 పైన నిర్ణయించి కొనుగోలు చేస్తేనే ఉల్లి రైతులకు ఊరట కలుగుతుంది.
కర్నూలు వ్యవసాయం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
జూన్ తొలి వారంలో రాష్ట్రానికి ‘నైరుతి’
నైరుతి రుతుపవనాలు జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 31 నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. -
సెకితో ‘మిగులు’ భారం రూ.8,291 కోట్లు!
సెకి నుంచి విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై భారం పడదు. ఆ విద్యుత్తు వ్యవసాయం కోసమే. దీని ఖర్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. -
ఫాగింగ్ దూరం.. జ్వరాల జోరు
గ్రామాల్లో దోమల బెడద తీవ్రమై ఏటా ప్రజలు పెద్ద సంఖ్యలో జ్వరాల బారిన పడుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 13,716 మలేరియా జ్వరాల కేసులు నమోదయ్యాయి. -
మెరుగుపడని పట్టణ వైద్యం!
రాష్ట్రంలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తున్నట్లు చెబుతున్నా.. మధ్యాహ్నం తరువాత చాలాచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటంలేదు. -
జగన్మాత సేవలో హైకోర్టు న్యాయమూర్తి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. -
సీసీఎల్ఏలో అవినీతి ఆరోపణలున్న అధికారులకు అప్రాధాన్య పోస్టులు
రాష్ట్ర భూ పరిపాలనశాఖ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఉన్న పలువురు అధికారులను అప్రాధాన్య పోస్టులకు మార్చారు. -
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కార్యాచరణ ప్రణాళిక!
‘వాతావరణంలో మార్పులు.. ప్రజల ఆరోగ్యం’పై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇటీవల వాతావరణంలో వస్తున్న మార్పులు.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. -
బీసీ నేతల్ని వైకాపా అణగదొక్కే ప్రయత్నం
జరిగిన ఎన్నికల్లో బీసీలు వైకాపాకు ఓటేయలేదనే అనుమానంతోనే కక్షతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారని.. ఇది బీసీ నేతల్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఇన్ఛార్జి నూకానమ్మ మండిపడ్డారు. -
24న డీఈడీ ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని డీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షను ఈనెల 24న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. -
రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరా అని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకూ పలుకూ లేదు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
అక్రమ తవ్వకాలు నిజం
ఎన్జీటీ తీర్పునకు విరుద్ధంగా ఆంధప్రదేశ్లో యంత్రాలతో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. -
మీడియాపై బెదిరింపులు తగవు
మీడియాలో వచ్చే వార్తలపై అభ్యంతరాలుంటే ఖండిచవచ్చని, పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించాయని భావిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని.. ఈ విషయాలు విస్మరించి పాత్రికేయుల పేర్లు చెప్పి మరీ తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం తగదని ప్రజాసంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం విఫలం
ఎన్నికల అనంతరం రాష్ట్రంలోని చంద్రగిరి, మాచర్ల, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అల్లర్లను నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ(సీఎఫ్డీ) సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. -
రామతీర్థంలో అతిసారం.. యువతి మృతి
నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. -
మన చరిత్రేంటో లోకమంతా చూసింది
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపామని హైకోర్టు వ్యాఖ్యానించింది. -
కొనకళ్లకు స్వల్ప గుండెపోటు
మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా