ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
మోదీ స్టేజీ నుంచి పూర్తిగా వెళ్లకుండానే వేదికపైకి వచ్చిన జనం
తోపులాటలు జరుగుతున్నా ఎస్పీలు సరిగా స్పందించలేదన్న విమర్శలు
అడుగడుగునా ప్రస్ఫుటంగా కనపడిన పోలీసు వైఫల్యం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట: తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సాక్షాత్తూ ప్రధాని హాజరైన సభలో కీలకమైన డి-గ్యాలరీ సమీపంలో తోపులాటలు చోటుచేసుకోవడం, వాటర్ బాటిళ్లు విసురుకోవటం వంటివి చేస్తున్నా పోలీసులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన వేదికకు సమీపంగా ఉండే గ్యాలరీల్లోకి వీవీఐపీ, వీఐపీ పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించాలి. పోలీసు ఉన్నతాధికారులు పాసుల్లేని వారిని కూడా అనుమతించేయడంతో గ్యాలరీల్లోకి లెక్కకు మించి జనాలు చేరడం కూడా తోపులాటకు కారణమైంది. ఈ గ్యాలరీల వద్ద గుంటూరు రేంజ్లో పని చేసే ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ పరిధిలోని మరో ఎస్పీని విధి నిర్వహణకు కేటాయించారు. అయితే వారెవరూ తోపులాటల సమయంలో అక్కడ అందుబాటులో లేరు. ఒకవైపు రభస చోటుచేసుకుని మైకుల స్టాండ్ల పైకి ప్రమాదకరంగా ఎక్కుతున్న వ్యక్తుల్ని గుర్తించి వారి ప్రాణాల్ని కాపాడాలని ప్రధానమంత్రే విజ్ఞప్తి చేసినా పోలీసులు పట్టించుకోలేదు. రోప్ వేసి అడ్డుకోవడం లేదా మైకుల స్టాండు చుట్టూ రక్షణగా నిలబడటం వంటి చర్యలు చేపట్టకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉండాల్సిన ఎస్పీ కారులో కూర్చొన్నారని సహచర పోలీసులే అంటున్నారు. మరో ఎస్పీకి ఇక్కడ చోటుచేసుకుంటున్న తోపులాటల్ని తెలియజేద్దామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ అందుబాటులోకి రాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో తమకు సరైన ఆదేశాలు లేకుండా ఏం చేయగలమని కొందరు పోలీసులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు, డీఎస్పీలు వంటివారు దూరంగా ఉండటంతో గ్యాలరీల్లో ఏం జరుగుతోందో తెలియకుండా పోయింది.
ప్రణాళిక అమలు ఏదీ?
పీఎంవో అధికారులు దిల్లీ నుంచి తీసుకొచ్చిన హైఎండ్ మైకులు, ఇతర భద్రత పరికరాలను తిరిగి తీసుకెళ్లేటప్పుడు కూడా ప్రధాన వేదిక వద్ద పోలీసు బందోబస్తు లేకుండా పోయింది. ఆ సమయంలో పెద్దసంఖ్యలో కార్యకర్తలు వేదిక మీదకు చేరుకుని సెల్ఫీలు దిగుతూ వారికి అంతరాయం కలిగించారు. ప్రధానమంత్రి పర్యటన, సభా ప్రాంగణం వద్ద భద్రతా విధులు పర్యవేక్షించే ఉన్నతాధికారి.. వేదిక, వీఐపీల గ్యాలరీల భద్రత పర్యవేక్షణను ముగ్గురు ఎస్పీలకు అప్పగించారు. మైకులకు సంబంధించిన డీ గ్యాలరీ ఓ ఎస్పీ పర్యవేక్షణలో ఉంది. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఎలా ఉండాలి, వచ్చిపోయే వారి కోసం ఎన్ని మార్గాలు ఉండాలి? ఎవరిని ఏ వైపు నుంచి అనుమతించాలి వంటివి ముందుగానే కూటమి నేతలతో చర్చించి వారికి సూచనలు చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించారు.
కొరవడిన పోలీసుల సహకారం
ప్రధాని రాకకు ముందే కార్యకర్తలు, ప్రజలు సభా ప్రాంగణంలోకి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని పోలీసులే పార్టీ నేతలకు సూచించాలి. ఆయన వేదిక మీదకు వచ్చిన తర్వాత రాకపోకలు సాగకూడదని ముందుగానే పార్టీ నాయకులకు చెప్పి ఉంటే ఆలోపే శ్రేణులకు దిశానిర్దేశం చేసుకుని ఉండేవాళ్లమని, కానీ పోలీసుల నుంచి తమకు పూర్తి సహాయ నిరాకరణ ఎదురైందని తెదేపా వర్గాలు పేర్కొన్నాయి. పెద్దసంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశామని, రాష్ట్రం నలుమూలల నుంచి అధికారుల్ని పిలిపించామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నా.. వారిలో అప్పగించిన విధుల్ని ఎంతమంది పక్కాగా నిర్వహించారనేది గుర్తించాలని సూచించారు. కొందరు పోలీసులు హోటల్ గదులు దాటి బయటకు రాలేదని ఆరోపించారు. ఏకంగా ప్రధాని సభలోనే తోపులాటలు, రభస జరిగి సభ నిర్వహణకు అంతరాయం కలిగినా.. ఇలా ఎందుకు జరిగింది, కారణాలేంటనే సమీక్ష కూడా చేసుకోలేదంటే పోలీసు ఉన్నతాధికారులకు ఉన్న ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం