సీఎం సభకు వెళ్లే బస్సుల అడ్డగింత
‘మేమంతా సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులన్నీ తరలిస్తే.. ప్రయాణికుల పరిస్థితి ఏంటని? శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డిపాలేనికి చెందిన మడపర్తి రాంప్రసాద్ శనివారం నిరసనకు దిగారు.
విడవలూరు, న్యూస్టుడే: ‘మేమంతా సిద్ధం’ సభకు ఆర్టీసీ బస్సులన్నీ తరలిస్తే.. ప్రయాణికుల పరిస్థితి ఏంటని? శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అన్నారెడ్డిపాలేనికి చెందిన మడపర్తి రాంప్రసాద్ శనివారం నిరసనకు దిగారు. కావలిలో జరిగిన సీఎం జగన్ సభకు బస్సులు పంపించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విడవలూరు మండలం ఊటుకూరు నుంచి కావలిలో జరిగే సీఎం సభకు ఆరు బస్సులు బయలుదేరి వెళ్తుండగా.. అన్నారెడ్డిపాలెం వద్ద వాటిని రాంప్రసాద్ అడ్డుకుని, అడ్డంగా పడుకున్నారు. పెళ్లిళ్ల సీజన్, ఇతర అవసరాల నేపథ్యంలో ప్రజలు బస్సుల్లేక ఇబ్బందులు పడుతుంటే రాజకీయ సభలకు ఎలా నడుపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బస్సు డ్రైవర్ విడవలూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో రాంప్రసాద్ దూషిస్తూ బస్సుపై దాడి చేశారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!