Stock Market: నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు.
అప్పుడే మెరుగైన ప్రతిఫలం
స్వల్పకాల పెట్టుబడుల ఆలోచన వద్దు
ఆర్థిక వ్యవస్థలో పటిష్ఠ మూలాల వల్లే మార్కెట్ ర్యాలీ
విశ్లేషకులు
దిల్లీ: స్టాక్ మార్కెట్లో (Stock Market) లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. స్వల్పకాల పెట్టుబడుల ఆలోచన మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ పటిష్ఠ మూలాలు, కార్పొరేట్ కంపెనీల ఆకర్షణీయ ఫలితాలే ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల దూకుడుకు కారణమని వివరిస్తున్నారు. అయిదేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు చాలా మెరుగయ్యాయని, దీని వల్ల చాలా కంపెనీల సామర్థ్య విస్తరణకు అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది కూడా మార్కెట్లలో సానుకూలతను తీసుకొచ్చిందని విశ్లేషిస్తున్నారు. వివిధ సంస్థల నిపుణులు ఏమంటున్నారంటే..
స్పెక్యులేషన్ వద్దు
‘విభిన్న రంగాల షేర్లలో పెట్టుబడులు, బలమైన మూలాలతో కూడిన నాణ్యమైన షేర్ల ఎంపిక, స్పెక్యులేటివ్ ట్రేడింగ్కు దూరంగా ఉండటం లాంటివి పాటిస్తే నష్టముప్పును తగ్గించుకోవచ్చ’ని వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ ద ఇన్ఫినిటీ గ్రూపు వ్యవస్థాపకుడు, డైరెక్టరు వినాయక్ మెహతా సూచించారు. స్వల్పకాలిక పెట్టుబడుల ఆలోచనను దూరం పెట్టి.. కనీసం రెండు, మూడేళ్ల వరకు వేచిఉండేలా దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ తేదీ అయిన జూన్ 1 వరకు మార్కెట్లకు ఒడుదొడుకులు కొనసాగొచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
మీ లక్ష్యంపై స్పష్టత కావాలి
ఆర్థిక లక్ష్యాలు, మూలధన లభ్యత, నష్టాన్ని భరించే స్థోమత ఆధారంగా మదుపర్లు పెట్టుబడులు పెట్టాలని ఫైయర్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు తేజాస్ ఖోడే సూచించారు. అదృష్టంపై ఆధారపడకుండా దీర్ఘకాల పెట్టుబడుల వూహాన్ని అనుసరించాలని తెలిపారు. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (సిప్)ల్లో పెట్టుబడులు పెట్టడాన్ని పరిశీలించాలని సలహా ఇచ్చారు.
విలువలు ఇంకా పెరుగుతాయ్
‘ప్రస్తుతం ఈక్విటీల్లో చిన్న మదుపర్ల ప్రాతినిధ్యం పరిమితంగానే ఉంది. ఇది పెరగాలంటే చాలానే సమయం పట్టొచ్చు. అయితే స్టాక్ మార్కెట్లు మరింతగా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయని నేను భావిస్తున్నాన’ని కోటక్ మహీంద్రా బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త ఉపాసనా భరద్వాజ్ తెలిపారు.
భారత ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం సమంజస స్థాయిలోనే ఉన్నాయి. మధ్య, దీర్ఘకాలంలో ఈ విలువలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఆనంద్ రాఠీ గ్రూపు వైస్ ఛైర్మన్ ప్రదీప్ గుప్తా అంచనా వేస్తున్నారు.
డిసెంబరు కల్లా 24,500కు నిఫ్టీ
ఈ ఏడాది డిసెంబరు కల్లా నిఫ్టీ 50 సూచీ 24,500 పాయింట్లను చేరే అవకాశం ఉందని ఎమ్కీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో 15% వృద్ధి ఉండొచ్చని భావించి, ఈ అంచనాను వెల్లడించింది. 2025 డిసెంబరు నాటికి నిఫ్టీ 26,500 పాయింట్లను అధిగమిస్తుందన్న అంచనాను వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటం, విధానపరమైన సంస్కరణలు కొనసాగనుండటం లాంటివి సానుకూలాంశాలుగా పేర్కొంది. భౌగోళిక రాజకీయ పరిణామాలు, బ్రిటన్, అమెరికాలలో ఎన్నికలు, ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు రానున్న కాలంలో మార్కెట్లపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషించింది.
ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకున్నా..
విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకున్నప్పటికీ.. సూచీలు రాణిస్తుండటం గమనార్హం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విదేశీ పోర్టుఫోలియో మదుపర్లు (ఎఫ్పీఐ) రూ.20,700 కోట్ల వరకు పెట్టుబడులను దేశీయ ఈక్విటీల నుంచి ఉపసంహరించుకున్నారు. సెన్సెక్స్ సోమవారం తొలిసారి 76000 పాయింట్లను తాకగా.. నిఫ్టీ 23,110.80 పాయింట్ల వద్ద జీవనకాల కొత్త గరిష్ఠాన్ని నమోదుచేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి