క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ).
25వ వసంతంలోకి ప్రతిష్ఠాత్మక సంస్థ
ఈనాడు - హైదరాబాద్
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). ఈ సంస్థ శుక్రవారానికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని, 25వ ఏటకు అడుగు పెట్టింది.
ఆవిర్భావం ఇలా
బీమా రంగాన్ని సరళీకృతం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఐఆర్డీఏఐ. ఈ సంస్థ విధి విధానాలపై 1993లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్ఎన్ మల్హోత్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, 1994లో నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఆరేళ్లకు 2000 ఏప్రిల్ 19న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. బీమా రంగంలో ఆర్థిక భద్రతను కల్పించడం, పాలసీదారులకు సరైన సేవలను అందించడం ముఖ్యంగా, బీమా రంగంలో పోటీని ప్రోత్సహించడం ద్వారా, మరింత మందికి బీమా కల్పించడమే ఐఆర్డీఏఐ ప్రధాన లక్ష్యం.
బీమా చట్టం 1938లోని సెక్షన్ 114ఏ కింద నిబంధనలు రూపొందించే అధికారాలను ఈ సంస్థ పొందింది. బీమా సంస్థల నమోదు నుంచి, పాలసీల అనుమతులు, సలహాదారులు, పరిహారం విషయంలో పాలసీదారులకు రక్షణ ఇలా ఎన్నో నిబంధనలను కాలానుగుణంగా ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది. బీమా చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చింది. కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటికి ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీమా రంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
కీలక సంస్కరణలతో..
గత 24 ఏళ్లలో బీమా రంగంలో ఐఆర్డీఏఐ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానంగా 2000 సంవత్సరంలో విదేశీ బీమా కంపెనీలు దేశంలో అడుగు పెట్టేందుకు వీలు కల్పించింది. 26% వాటాతో అనేక విదేశీ బీమా సంస్థలు ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వ బీమా సంస్థలతో పాటు అనేక కొత్త ప్రైవేటు బీమా సంస్థలూ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జీవిత బీమా సంస్థలు 26, సాధారణ బీమా సంస్థలు 27, ఆరోగ్య బీమా సంస్థలు 5 ఉన్నాయి. బీమా రంగంలో ఉద్యోగుల సంఖ్య 6 రెట్ల వరకూ పెరిగింది. నిర్వహణలో ఉన్న ఆస్తులు ఏడు రెట్లు పెరిగాయి. కార్పొరేట్ ఏజెంట్లు, బ్యాంకసూరెన్స్ వంటి కొత్త సలహాదారులు మార్కెట్లోకి వచ్చారు. బీమా పాలసీలను క్షణాల్లోనే ఆన్లైన్లో తీసుకునే వీలు కూడా ఐఆర్డీఏఐ చేపట్టిన చర్యల ఫలితమే. కొవిడ్ కష్ట కాలంలో సత్వరం ప్రత్యేక కరోనా పాలసీలను తీసుకురావడంతో పాటు, పాలసీదారులకు క్లెయిం చెల్లించాలని బీమా సంస్థలను ఆదేశించడం లాంటివి ఐఆర్డీఏఐ ప్రతిష్ఠను పెంచాయనడంలో సందేహం లేదు.
మార్గదర్శకంగా..
ఐఆర్డీఏఐ తీసుకున్న చర్యల వల్ల బీమా రంగంలో ఎన్నో అంకుర సంస్థలు ఉద్భవించాయి. బీమా కంపెనీలకు పాలసీలను రూపొందించడంలో సహాయం చేయడం, పాలసీల పంపిణీ, క్లెయిం ప్రాసెసింగ్.. మొదలైన సేవలను అందించేందుకు అనుబంధ సంస్థలూ వచ్చాయి. బీమా వ్యాప్తి ఇప్పుడు 4.3 శాతంగాపై ఉంది. బీమా రంగాన్ని నిబంధనలు, పర్యవేక్షణలతో నియంత్రించడం కాకుండా.. మార్గదర్శకంగా ఉంటూ.. ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఐఆర్డీఏఐ కీలక పాత్ర పోషిస్తోందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.
2047 కల్లా అందరికీ బీమా లక్ష్యంగా
స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంగా ఐఆర్డీఏఐ లక్ష్యంగా విధించుకుంది. ఇందుకు అనుగుణంగా బీమా సంస్థలను సన్నద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బీమా అందించేలా డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది. నియంత్రణ సంస్థ ప్రస్తుత ఛైర్మన్ దేబాశిష్ పాండా ఈ విషయంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. ఇ-కేవైసీ, డిజిటల్ పాలసీలు, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో కీలక మార్పులు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు. సంప్రదాయ పద్ధతుల నుంచి బీమా రంగం ఆధునిక, సాంకేతిక ఆధారిత పద్దతులకు మారడం ద్వారా ప్రపంచంలోనే భారతీయ బీమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా...
ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ముంబయి ఉండే రోజుల్లో.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ప్రత్యేక చొరవ వల్ల హైదరాబాద్ కేంద్రంగా ఐఆర్డీఏఐ ఏర్పాటయ్యింది. అప్పటి ప్రధాని వాజ్పేయి అంగీకరించడంతో, ఆర్థిక సేవల నియంత్రణ సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరి, ప్రజ్వలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్