క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ).
25వ వసంతంలోకి ప్రతిష్ఠాత్మక సంస్థ
ఈనాడు - హైదరాబాద్
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). ఈ సంస్థ శుక్రవారానికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని, 25వ ఏటకు అడుగు పెట్టింది.
ఆవిర్భావం ఇలా
బీమా రంగాన్ని సరళీకృతం చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఐఆర్డీఏఐ. ఈ సంస్థ విధి విధానాలపై 1993లో ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆర్ఎన్ మల్హోత్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయగా, 1994లో నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఆరేళ్లకు 2000 ఏప్రిల్ 19న ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. బీమా రంగంలో ఆర్థిక భద్రతను కల్పించడం, పాలసీదారులకు సరైన సేవలను అందించడం ముఖ్యంగా, బీమా రంగంలో పోటీని ప్రోత్సహించడం ద్వారా, మరింత మందికి బీమా కల్పించడమే ఐఆర్డీఏఐ ప్రధాన లక్ష్యం.
బీమా చట్టం 1938లోని సెక్షన్ 114ఏ కింద నిబంధనలు రూపొందించే అధికారాలను ఈ సంస్థ పొందింది. బీమా సంస్థల నమోదు నుంచి, పాలసీల అనుమతులు, సలహాదారులు, పరిహారం విషయంలో పాలసీదారులకు రక్షణ ఇలా ఎన్నో నిబంధనలను కాలానుగుణంగా ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది. బీమా చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చింది. కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటికి ప్రత్యామ్నాయాలను రూపొందించింది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బీమా రంగంలో వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
కీలక సంస్కరణలతో..
గత 24 ఏళ్లలో బీమా రంగంలో ఐఆర్డీఏఐ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానంగా 2000 సంవత్సరంలో విదేశీ బీమా కంపెనీలు దేశంలో అడుగు పెట్టేందుకు వీలు కల్పించింది. 26% వాటాతో అనేక విదేశీ బీమా సంస్థలు ప్రవేశించాయి. దీంతో ప్రభుత్వ బీమా సంస్థలతో పాటు అనేక కొత్త ప్రైవేటు బీమా సంస్థలూ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు జీవిత బీమా సంస్థలు 26, సాధారణ బీమా సంస్థలు 27, ఆరోగ్య బీమా సంస్థలు 5 ఉన్నాయి. బీమా రంగంలో ఉద్యోగుల సంఖ్య 6 రెట్ల వరకూ పెరిగింది. నిర్వహణలో ఉన్న ఆస్తులు ఏడు రెట్లు పెరిగాయి. కార్పొరేట్ ఏజెంట్లు, బ్యాంకసూరెన్స్ వంటి కొత్త సలహాదారులు మార్కెట్లోకి వచ్చారు. బీమా పాలసీలను క్షణాల్లోనే ఆన్లైన్లో తీసుకునే వీలు కూడా ఐఆర్డీఏఐ చేపట్టిన చర్యల ఫలితమే. కొవిడ్ కష్ట కాలంలో సత్వరం ప్రత్యేక కరోనా పాలసీలను తీసుకురావడంతో పాటు, పాలసీదారులకు క్లెయిం చెల్లించాలని బీమా సంస్థలను ఆదేశించడం లాంటివి ఐఆర్డీఏఐ ప్రతిష్ఠను పెంచాయనడంలో సందేహం లేదు.
మార్గదర్శకంగా..
ఐఆర్డీఏఐ తీసుకున్న చర్యల వల్ల బీమా రంగంలో ఎన్నో అంకుర సంస్థలు ఉద్భవించాయి. బీమా కంపెనీలకు పాలసీలను రూపొందించడంలో సహాయం చేయడం, పాలసీల పంపిణీ, క్లెయిం ప్రాసెసింగ్.. మొదలైన సేవలను అందించేందుకు అనుబంధ సంస్థలూ వచ్చాయి. బీమా వ్యాప్తి ఇప్పుడు 4.3 శాతంగాపై ఉంది. బీమా రంగాన్ని నిబంధనలు, పర్యవేక్షణలతో నియంత్రించడం కాకుండా.. మార్గదర్శకంగా ఉంటూ.. ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఐఆర్డీఏఐ కీలక పాత్ర పోషిస్తోందని ఈ రంగంలోని నిపుణులు పేర్కొన్నారు.
2047 కల్లా అందరికీ బీమా లక్ష్యంగా
స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంగా ఐఆర్డీఏఐ లక్ష్యంగా విధించుకుంది. ఇందుకు అనుగుణంగా బీమా సంస్థలను సన్నద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ బీమా అందించేలా డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తోంది. నియంత్రణ సంస్థ ప్రస్తుత ఛైర్మన్ దేబాశిష్ పాండా ఈ విషయంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీమా నిపుణులు పేర్కొంటున్నారు. ఇ-కేవైసీ, డిజిటల్ పాలసీలు, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో కీలక మార్పులు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు. సంప్రదాయ పద్ధతుల నుంచి బీమా రంగం ఆధునిక, సాంకేతిక ఆధారిత పద్దతులకు మారడం ద్వారా ప్రపంచంలోనే భారతీయ బీమా రంగానికి ఒక ప్రత్యేక స్థానాన్ని ఐఆర్డీఏఐ తీసుకొచ్చింది.
హైదరాబాద్ కేంద్రంగా...
ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ముంబయి ఉండే రోజుల్లో.. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపిన ప్రత్యేక చొరవ వల్ల హైదరాబాద్ కేంద్రంగా ఐఆర్డీఏఐ ఏర్పాటయ్యింది. అప్పటి ప్రధాని వాజ్పేయి అంగీకరించడంతో, ఆర్థిక సేవల నియంత్రణ సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరి, ప్రజ్వలిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి