జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి.
వాటికి కేంద్రంగా మారుతున్న భారతదేశం
అగ్ర స్థానంలో బెంగళూరు, హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండటం, బలమైన అంకుర సంస్థల వ్యవస్థ, ప్రభుత్వ మద్దతు.. అత్యంత సానుకూలమైన అంశాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బహుళ జాతి సంస్థలు నూతన జీసీసీలను భారతదేశంలో అధికంగా స్థాపిస్తున్నాయని ఏఎన్ఎస్ఆర్ అనే కన్సల్టెన్సీ సేవల సంస్థ తన త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జీసీసీ కేంద్రాల వ్యాపారం విలువ ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి ఇది 110 బిలియన్ డాలర్లకు(రూ.9లక్షల కోట్లకు పైగా) పెరగగలదని అంచనా. దాదాపు 2400 జీసీసీల్లో 45 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఏఐ/ ఎంఎల్ ప్రాజెక్టుల కోసం..
జీసీసీ కేంద్రాలను ఆకర్షించటంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో బెంగళూరు వాటా 30 శాతం కాగా, 19 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలకు పోటీగా అహ్మదాబాద్లోని గిఫ్ట్ సిటీ, జీసీసీ కేంద్రస్థానంగా గుర్తింపు సాధిస్తోంది. గిఫ్ట్ సిటీలో ఎస్ఈజడ్ సదుపాయాలు, పన్ను రాయితీలు, తక్కువ వ్యయాలు, లావాదేవీల నిర్వహణ సరళతరంగా ఉండటంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు గిఫ్ట్ సిటీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికే అధిక సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), డేటా అనలిటిక్స్ ప్రాజెక్టులు చేపట్టగల సత్తా ఉన్న కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో ఏడీఎం (అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్) అవసరాల కోసం ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఐ/ ఎంఎల్, బిజినెస్ అనలిటిక్స్ సత్తా కల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకే మెజార్టీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సేవలు, హై ఎండ్ టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, ఉత్పత్తి, రిటైల్ విభాగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఏఐ/ ఎంఎల్ ప్రాజెక్టులకు అధికంగా ఇస్తున్నాయి. దానికి అనువుగా జీసీసీ లను ఏర్పాటు చేస్తున్నారు.
సత్తానే ప్రామాణికం...
గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా వాటిని స్థాపించే కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచి లేదా ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారిని నియమించటం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తన, మన అనే ప్రామాణికం కాకుండా, సత్తా ఎవరికి ఉంటే వారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. జెనరేటివ్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్ద పీట వేస్తున్నారు.
రియల్ ఎస్టేట్కు గిరాకీ
జీసీసీల ఏర్పాటుతో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగవంతమైన వృద్ధి నమోదు చేసే అవకాశం ఏర్పడుతోంది. మనదేశంలో దాదాపు 15 నగరాల్లో జీసీసీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీల కోసం 2025 నాటికి దాదాపు 6 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కల ఆఫీసు స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలైన అహ్మదాబాద్, కోయంబత్తూరు, భువనేశ్వర్, వడోదర.. జీసీసీలను అధికంగా ఆకర్షిస్తున్నాయి. జీసీసీల ఏర్పాటులో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసే సంస్థల ప్రాధామ్యాలు కూడా మారుతున్నట్లు ఏఎన్ఎస్ఆర్ సహ వ్యవస్థాపకుడు, టాలెంట్500 సీఈఓ విక్రమ్ అహుజా అన్నారు. డిజిటల్ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికి ఆయా సంస్థలు ఇష్టపడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశీయంగా ఐటీలో కొత్త ఉద్యోగాల లభ్యత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా మనదేశానికి ఉన్న ఐటీ సామర్థ్యాన్ని ఇతరదేశాలు గుర్తించేందుకు ఈ మార్పు వీలు కల్పిస్తున్నట్లు విశ్లేషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి