జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి.
వాటికి కేంద్రంగా మారుతున్న భారతదేశం
అగ్ర స్థానంలో బెంగళూరు, హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. సాంకేతిక నైపుణ్యం గల మానవ వనరుల లభ్యత అధికంగా ఉండటం, బలమైన అంకుర సంస్థల వ్యవస్థ, ప్రభుత్వ మద్దతు.. అత్యంత సానుకూలమైన అంశాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బహుళ జాతి సంస్థలు నూతన జీసీసీలను భారతదేశంలో అధికంగా స్థాపిస్తున్నాయని ఏఎన్ఎస్ఆర్ అనే కన్సల్టెన్సీ సేవల సంస్థ తన త్రైమాసిక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం జీసీసీ కేంద్రాల వ్యాపారం విలువ ప్రస్తుతం 46 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి ఇది 110 బిలియన్ డాలర్లకు(రూ.9లక్షల కోట్లకు పైగా) పెరగగలదని అంచనా. దాదాపు 2400 జీసీసీల్లో 45 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా.
ఏఐ/ ఎంఎల్ ప్రాజెక్టుల కోసం..
జీసీసీ కేంద్రాలను ఆకర్షించటంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాలు అగ్రగామిగా ఉన్నాయి. ఈ విభాగంలో బెంగళూరు వాటా 30 శాతం కాగా, 19 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. దిల్లీ, ముంబయి, పుణె, చెన్నై నగరాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ నగరాలకు పోటీగా అహ్మదాబాద్లోని గిఫ్ట్ సిటీ, జీసీసీ కేంద్రస్థానంగా గుర్తింపు సాధిస్తోంది. గిఫ్ట్ సిటీలో ఎస్ఈజడ్ సదుపాయాలు, పన్ను రాయితీలు, తక్కువ వ్యయాలు, లావాదేవీల నిర్వహణ సరళతరంగా ఉండటంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు గిఫ్ట్ సిటీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికే అధిక సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్), డేటా అనలిటిక్స్ ప్రాజెక్టులు చేపట్టగల సత్తా ఉన్న కేంద్రాలను అధికంగా ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో ఏడీఎం (అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్) అవసరాల కోసం ఇటువంటి కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఏఐ/ ఎంఎల్, బిజినెస్ అనలిటిక్స్ సత్తా కల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకే మెజార్టీ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సేవలు, హై ఎండ్ టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ, ఉత్పత్తి, రిటైల్ విభాగాలకు చెందిన వ్యాపార సంస్థలు ఏఐ/ ఎంఎల్ ప్రాజెక్టులకు అధికంగా ఇస్తున్నాయి. దానికి అనువుగా జీసీసీ లను ఏర్పాటు చేస్తున్నారు.
సత్తానే ప్రామాణికం...
గతంలో జీసీసీ కేంద్రాలకు సీఈఓ, సీఐఓలుగా వాటిని స్థాపించే కంపెనీల కేంద్ర కార్యాలయాల నుంచి లేదా ఆ కంపెనీల సొంత దేశాలకు చెందిన వారిని నియమించటం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తన, మన అనే ప్రామాణికం కాకుండా, సత్తా ఎవరికి ఉంటే వారినే జీసీసీల్లో ఉన్నత స్థానాలకు ఎంపిక చేసే సంప్రదాయం మొదలైంది. జెనరేటివ్ ఏఐ, ఏఐ/ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ నైపుణ్యాలు ఉన్నవారికి పెద్ద పీట వేస్తున్నారు.
రియల్ ఎస్టేట్కు గిరాకీ
జీసీసీల ఏర్పాటుతో ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం వేగవంతమైన వృద్ధి నమోదు చేసే అవకాశం ఏర్పడుతోంది. మనదేశంలో దాదాపు 15 నగరాల్లో జీసీసీ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ, ముంబయి, పుణె నగరాల్లో కొత్తగా ఏర్పాటయ్యే జీసీసీల కోసం 2025 నాటికి దాదాపు 6 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం కల ఆఫీసు స్థలం అవసరమని అంచనా వేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలైన అహ్మదాబాద్, కోయంబత్తూరు, భువనేశ్వర్, వడోదర.. జీసీసీలను అధికంగా ఆకర్షిస్తున్నాయి. జీసీసీల ఏర్పాటులో వినూత్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నట్లు, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసే సంస్థల ప్రాధామ్యాలు కూడా మారుతున్నట్లు ఏఎన్ఎస్ఆర్ సహ వ్యవస్థాపకుడు, టాలెంట్500 సీఈఓ విక్రమ్ అహుజా అన్నారు. డిజిటల్ సామర్థ్యాలు గల జీసీసీలను ఏర్పాటు చేయటానికి ఆయా సంస్థలు ఇష్టపడుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల దేశీయంగా ఐటీలో కొత్త ఉద్యోగాల లభ్యత పెరుగుతుందని వివరించారు. అదేవిధంగా మనదేశానికి ఉన్న ఐటీ సామర్థ్యాన్ని ఇతరదేశాలు గుర్తించేందుకు ఈ మార్పు వీలు కల్పిస్తున్నట్లు విశ్లేషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే.