ఏఏఏఐ అధ్యక్షుడిగా ప్రశాంత్‌ కుమార్‌

అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్‌ ఎం మీడియా (ఇండియా) సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు.

Published : 30 Nov 2022 02:16 IST

ముంబయి: అడ్వర్‌టైజింగ్‌ ఏజెన్సీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్‌ ఎం మీడియా (ఇండియా) సీఈఓ (దక్షిణాసియా) ప్రశాంత్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. ఇక్కడ జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో 2022-23 సంవత్సరానికి పాలకవర్గ ఎన్నిక జరిగింది. సంస్థ ఉపాధ్యక్షుడిగా హవాస్‌ గ్రూప్‌ ఇండియా సీఈఓ రాణా బారువ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బోర్డులోకి హైదరాబాద్‌కు చెందిన శ్లోకా అడ్వర్‌టైజింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌తో పాటు విశాందాస్‌, కునాల్‌ లాలని, రోహన్‌ మెహతా, చంద్రమౌళి ముత్తు, శ్రీధర్‌ రామసుబ్రమణియన్‌, శశిధర్‌ సిన్హా, వివేక్‌ శ్రీవాస్తవలను ఎన్నుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని