రిలయన్స్ చేతికి మెట్రో ఇండియా
దేశీయంగా తన రిటైల్ రంగ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత టోకు వ్యాపార కార్యకలాపాలను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.
విలువ రూ.2850 కోట్లు
‘ చిన్న వ్యాపారులు, కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా ఒక విశిష్ట వ్యాపార నమూనాను నిర్మించాలన్న మా సరికొత్త వాణిజ్య వ్యూహంలో భాగంగానే మెట్రో ఇండియాను కొనుగోలు చేస్తున్నాం. ఈ కంపెనీకి ఉన్న ఆస్తులు, మాకున్న కిరాణా వ్యవస్థ సహాయంతో వినియోగదార్లకు మరింత మెరుగైన సేవలు అందించగలం.
ఈశా అంబానీ, డైరెక్టర్, రిలయన్స్ రిటైల్
దిల్లీ: దేశీయంగా తన రిటైల్ రంగ వ్యాపారాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరింత బలోపేతం చేసుకుంటోంది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత టోకు వ్యాపార కార్యకలాపాలను రూ.2,850 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియాలో 100 శాతం వాటా కొనుగోలు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్), కచ్చితంగా అమలయ్యే వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం రూ.2850 కోట్ల నగదు చెల్లించనుంది. తుది సర్దుబాటును అనుసరించి ఈ విలువ కాస్త మారొచ్చని ఇరు కంపెనీలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. 2023 మార్చి కల్లా ఈ లావాదేవీ పూర్తి కావొచ్చని అంచనా.
సగం స్టోర్లు దక్షిణాదిలోనే..
మెట్రో క్యాష్ అండ్ క్యారీ దేశీయ కార్యకలాపాలు 2003లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 31 పెద్ద ఫార్మేట్ స్టోర్లుంటే, ఇందులో సగం దక్షిణ భారత్లోనే ఉన్నాయి. మొత్తం 3,500 మంది ఉద్యోగులున్నారు. ఈ స్టోర్లలో పళ్లు, కూరగాయలు, నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, దుస్తులు, తోలు ఉత్పత్తులు, స్టేషనరీ, మాంసం వంటివి టోకుగా విక్రయిస్తారు. ప్రభుత్వ శాఖల వద్ద నమోదైన, ధ్రువీకరణలు కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, కంపెనీలు, కిరాణా స్టోర్లు, చిన్న రిటైలర్లకే ప్రత్యేక కార్డులు ఇచ్చి, వాటి ద్వారా మాత్రమే సరకులు విక్రయిస్తున్నారు. ‘సరైన సమయంలో మా లాభదాయక టోకు వ్యాపారాన్ని విక్రయిస్తున్నాం. రిలయన్స్ రూపంలో మాకు తగ్గ భాగస్వామి లభించింద’ని మెట్రో ఏజీ సీఈఓ స్టీఫెన్ గ్రూబెల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రిలయన్స్కు ఏమిటి ప్రయోజనం?
దేశీయంగా రిలయన్స్కు 16,600కు పైగా రిటైల్ విక్రయశాలలు; జియో మార్ట్ - అజియో వంటి డిజిటల్ వ్యాపారాలున్నాయి. వీటికి మద్దతుగా ఒక బలమైన టోకు వ్యాపార విభాగం ఉంటే.. కార్యకలాపాలను మరింత బలంగా తీసుకెళ్లొచ్చు. మెట్రోకు దేశీయంగా 30 లక్షల మంది ఖాతాదారులున్నారు. ఇందులో 10 లక్షల మంది తరచూ కొనుగోలు చేసేవారే. కిరణా స్టోర్లతో సంబంధాలను పెంచుకోవాలన్న ఆర్ఐఎల్ లక్ష్యం ఈ కొనుగోలుతో నెరవేరుతుందని మోర్గాన్ స్టాన్లీ అంటోంది. 2022 సెప్టెంబరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మెట్రో ఇండియా రూ.7,700 కోట్ల విక్రయాలను నమోదు చేసింది.
* జస్ట్ డయల్, డుంజోల కొనుగోలుతో పాటు; ‘ఇండిపెండెన్స్’ పేరిట ఎఫ్ఎమ్సీజీ బ్రాండ్ను ఇటీవల రిలయన్స్ ఆవిష్కరించడం గమనార్హం. వీటితో ఐటీసీ, టాటా, పతంజలి, అదానీ విల్మార్లతో పోటీ పడుతోంది.
అంతర్జాతీయంగా ఉపయుక్తం
దేశీయ రిటైల్ వ్యాపారం రూ.60 లక్షల కోట్ల స్థాయిలో ఉంటే, ఇందులో నిత్యావసరాల వాటాయే 60 శాతమని అంచనా. మొత్తం రిటైల్లో సంఘటిత వాటా 12%. అంతర్జాతీయంగా 56వ స్థానంలో ఉన్న రిలయన్స్ రిటైల్కు సంస్థాగత ఆహార, నిత్యావసరాల వ్యాపారంలో 20% వాటా ఉంది. తాజా పరిణామంతో అంతర్జాతీయస్థాయిలో బలోపేతం కాగలదు. సమీప పోటీదారైన మోర్ కంటే మూడింతల స్టోర్లు రిలయన్స్కు ఉన్నాయి. దేశీయంగా బెస్ట్ప్రైస్ పేరిట టోకు వ్యాపారం నిర్వహిస్తున్న వాల్మార్ట్ ఇండియాను కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ గ్రూప్నూ మరింత బలంగా ఎదుర్కోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
Bharti Airtel q4 results: ఎయిర్టెల్ లాభం 31 శాతం క్షీణించింది. రూ.3,005 కోట్ల నుంచి రూ.2,072 కోట్లకు తగ్గింది. -
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శాకాహారం ధర పెరిగింది. మాంసాహారం ధర తగ్గింది. ఎందుకిలా..? -
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
IMF Chief on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ మార్కెట్పై సునామీలా విరుచుకుపడబోతోందన్నారు. -
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 328 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్తో చేతులు కలిపింది. -
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. -
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!