సంక్షిప్త వార్తలు(7)
టాటా పవర్ డిసెంబరు త్రైమాసికంలో రూ.1,052.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.551.89 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు.
టాటా పవర్ లాభం రెట్టింపు
దిల్లీ: టాటా పవర్ డిసెంబరు త్రైమాసికంలో రూ.1,052.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2021-22 ఇదే కాల లాభం రూ.551.89 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. మొత్తం ఆదాయంరూ.11,018.73 కోట్ల నుంచి రూ.14,401.95 కోట్లకు పెరిగింది. ఏప్రిల్-డిసెంబరులో నికర లాభం రూ.2,871 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే కాల లాభం రూ.1,523 కోట్లతో పోలిస్తే ఇది 88 శాతం ఎక్కువ. ఆదాయం కూడా రూ.30,491 కోట్ల నుంచి 42 శాతం వృద్ధితో రూ.43,278 కోట్లకు చేరింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభంలో 75% వృద్ధి
ముంబయి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) ఏకీకృత నికర లాభం 74.76 శాతం వృద్ధితో రూ.4,305.66 కోట్లకు చేరుకుంది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడానికి తోడు, అధిక వడ్డీ ఆదాయం ఇందుకు దోహదం చేశాయి. స్టాండలోన్ పద్ధతిలోనూ నికర లాభం 75.4 శాతం వృద్ధితో రూ.3,853 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 26.5 శాతం పెరిగి రూ.10,818 కోట్లకు చేరింది. రుణాల్లో 20% వృద్ధి లభించడం, నికర వడ్డీ మార్జిన్ 0.24% పెరిగి 3.37 శాతానికి చేరడంతో ఇది సాధ్యమైంది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు(ఎన్పీఏలు) 7.25 శాతం నుంచి 4.53 శాతానికి పరిమితమయ్యాయి.
రూ.392 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టం
దిల్లీ: డిసెంబరు త్రైమాసికంలో పేటీఎం ఏకీకృత ప్రాతిపదికన రూ.392 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల నష్టం రూ.778.4 కోటతో పోలిస్తే ఈ సారి బాగా తగ్గింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.1,456.1 కోట్ల నుంచి రూ.2,062.2 కోట్లకు పెరిగింది. సమీక్షిస్తున్న త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ లాభం లక్ష్యాన్ని అందుకుందని, ఈసాప్ వ్యయాలు ఇందులో లేవని సంస్థ సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు.
ఇండిగోకు భారీ లాభం
దిల్లీ: విమాన ప్రయాణాలకు గిరాకీ పెరగడంతో ఇండిగో మాతృసంస్థ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ రాణించింది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.1,422.6 కోట్లకు చేరుకుంది. 2021-22 ఇదే కాల లాభం రూ.129.8 కోట్లు మాత్రమే. ఇదే సమయంలో ఆదాయం సైతం రూ.9,480.1 కోట్ల నుంచి రూ.15,410.2 కోట్లకు పెరిగింది. విదేశీ మారక నష్టాన్ని మినహాయిస్తే కంపెనీ లాభం రూ.125.2 కోట్ల నుంచి రూ.2,009.1 కోట్లకు చేరుకున్నట్లయింది. సంస్థ విమానాల్లో ప్రయాణించిన వారి సంఖ్య 1.78 కోట్ల నుంచి 26 శాతం అధికమై 2.23 కోట్లకు చేరింది. త్రైమాసికం వారీ అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసినట్లు కంపెనీ సీఈఓ పీటర్ ఎల్బర్స్ తెలిపారు.
దివీస్ లేబొరేటరీస్ లాభాల్లో క్షీణత
ఈనాడు, హైదరాబాద్: దివీస్ లేబొరేటరీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.1,822 కోట్ల ఆదాయంపై రూ.307 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.2,510 కోట్లు, నికరలాభం రూ.902 కోట్లు ఉండటం గమనార్హం. ఉత్పత్తుల్లో మార్పుల వల్ల, ముడిపదార్థాల వ్యయం ఆదాయంలో 43 శాతానికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 9 నెలలకు దివీస్ ఆదాయం రూ.6,099 కోట్లు, నికరలాభం రూ.1,502 కోట్లు ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.6,503 కోట్లు కాగా, నికరలాభం రూ.2,066 కోట్లుగా ఉంది.
జనవరిలో కాస్త నెమ్మదించిన సేవల రంగం
దిల్లీ: జనవరిలో దేశ సేవల రంగం వృద్ధి నెమ్మదించింది. భవిష్యత్తుపై సర్వీస్ ప్రొవైడర్ల విశ్వాసం స్తబ్దుగా ఉండటం, ఉద్యోగాల సృష్టిపై ఇది ప్రభావం చూపడం ఇందుకు నేపథ్యం. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సేవల పీఎంఐ వ్యాపార కార్యకలాపాల సూచీ జనవరిలో 57.2 పాయింట్లుగా నమోదైంది. డిసెంబరులో ఇది 58.5గా ఉంది. డిసెంబరుతో పోలిస్తే వృద్ధి తగ్గినప్పటికీ.. దీర్ఘకాల సగటు (53.5) ఎగువనే తాజా గణాంకాలు నిలిచాయి. సానుకూల గిరాకీ పరిస్థితులు, ప్రస్తుత పనులు పుంజుకోవడం కలిసొచ్చాయి. వరుసగా 18వ నెలా సేవల రంగం కీలకమైన 50 పాయింట్ల స్థాయి ఎగువనే ఉంది. ఈ సూచీ 50కి కింద క్షీణతగా.. 50కి పైన వృద్ధిగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. కొత్త ఏడాది ప్రారంభంలో సేవల రంగ వృద్ధి కొంత జోరు కోల్పోయిందని ఎస్ అండ్ పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పాలీనా డి లిమా పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లో కొత్త వ్యాపారాలు పెరిగాయని, అంతర్జాతీయ ఆర్డర్లు తగ్గాయని తెలిపారు.
త్వరలో బీఎస్ఎన్ఎల్ నుంచి దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సేవలు
నాగ్పుర్: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ వ్యవస్థను బీఎస్ఎన్ఎల్ త్వరలోనే ఆవిష్కరించనుందని కంపెనీ డైరెక్డర్(హెచ్ఆర్) అరవింద్ వడ్నేర్కర్ పేర్కొన్నారు. చాలా తక్కువ సమయంలోనే 5జీ సేవలనూ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద 28,000 గ్రామాల్లో సేవలందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటిదాకా మొబైల్ కవరేజీ లేని గ్రామాలూ వీటిల్లో ఉంటాయన్నారు. నిధులు, ఇతర వనరులతో బీఎస్ఎన్ఎల్కు ప్రభుత్వం చేయూతనిస్తోందని వివరించారు. 2026-27 కల్లా బీఎస్ఎన్ఎల్ నికర లాభాలను నమోదు చేయగలదని ఆయన పేర్కొన్నారు.
ఇమామి లాభం రూ.983 కోట్లు
దిల్లీ: దేశీయ ఎఫ్ఎంసీజీ సంస్థ ఇమామీ, డిసెంబరు త్రైమాసికంలో రూ.232.97 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.219.52 కోట్లతో పోలిస్తే, ఇది 6.12% అధికం. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల వల్ల స్థూల మార్జిన్లు తగ్గడం వల్లే, లాభం పరిమితమైందని సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో కార్యకలాపాలపై ఆదాయం రూ.971.06 కోట్ల నుంచి 1.2 శాతమే పెరిగి రూ.982.72 కోట్లకు చేరింది. వ్యయాలు రూ.629.52 కోట్ల నుంచి 9.36 శాతం పెరిగి రూ. 688.47 కోట్లకు చేరింది. సమీక్షా త్రైమాసికంలో స్థూల మార్జిన్లు 150 బేసిస్ పాయింట్లు తగ్గి, 65.9 శాతానికి పరిమితమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ తక్కువగానే నమోదైందని సంస్థ తెలిపింది. పట్టణాల్లో షాపింగ్మాల్స్ ద్వారా వ్యాపారం 20%, ఇ కామర్స్ విభాగం 45% పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.
* బహిరంగ మార్కెట్ లావాదేవీ ద్వారా రూ.330 కోట్ల విలువైన జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లను సీ/డీ ఇన్వెస్టర్స్ ఫండ్ ఎల్పీ, హెచ్/డీ ఇన్వెస్టర్స్ ఫండ్ ఎల్పీలు విక్రయించాయి. ఒక్కో షేరును సగటున రూ.37.2 చొప్పున 8,86,58,600 షేర్లను ఈ రెండు సంస్థలు విక్రయించాయి. కంపెనీలో ఇవి 1.5 శాతం వాటాకు సమానం. ఈ షేర్లను వేదా ఇన్వెస్టర్స్ ఫండ్ ఎల్పీ, డీవీజీ 1740 ఫండ్ ఎల్పీ, డెక్కన్ వ్యాల్యూ ఇన్వెస్టర్స్ ఫండ్ ఎల్పీ కొనుగోలు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
Bharti Airtel q4 results: ఎయిర్టెల్ లాభం 31 శాతం క్షీణించింది. రూ.3,005 కోట్ల నుంచి రూ.2,072 కోట్లకు తగ్గింది. -
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శాకాహారం ధర పెరిగింది. మాంసాహారం ధర తగ్గింది. ఎందుకిలా..? -
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
IMF Chief on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ మార్కెట్పై సునామీలా విరుచుకుపడబోతోందన్నారు. -
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 328 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్తో చేతులు కలిపింది. -
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. -
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు