వడ్డీ విధింపులో పారదర్శకత పాటించాలి
రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
వసూలు చేసిన అదనపు ఛార్జీలను తిరిగి ఇచ్చేయాలి
బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రుణాలపై వడ్డీ వసూలు విషయంలో అన్యాయమైన పద్ధతులను అనుసరిస్తున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. రుణగ్రహీతల నుంచి వసూలు చేసిన అదనపు రుసుములను తిరిగి చెల్లించాలని సోమవారం బ్యాంకులను ఆదేశించింది. 2003 నుంచి తన నియంత్రణ పరిధిలోని (ఆర్ఈ) సంస్థలకు పలు సందర్భాల్లో ఆర్బీఐ మార్గదర్శకాలను జారీ చేసింది. రుణదాతలు వడ్డీ వసూలు చేయడంలో న్యాయబద్ధత, పారదర్శకతను పాటించాల్సిన అవసరాన్ని ఇవి సూచిస్తాయి. అదే సమయంలో రుణాల వడ్డీ విధానానికి సంబంధించిన స్వేచ్ఛనూ అందిస్తాయి. 2023 మార్చి 31తో ముగిసిన కాలానికి ఆర్ఈలను పరిశీలిస్తున్న క్రమంలో, రుణదాతలు కొన్ని అన్యాయమైన పద్ధతులను పాటిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. వీటిని ప్రస్తావిస్తూ.. అన్ని ఆర్ఈలు రుణాల పంపిణీ విధానం, వడ్డీ విధింపు, ఇతర ఛార్జీలను సమీక్షించాలని తెలిపింది. ఇందుకు అనుగుణంగా వ్యవస్థలో మార్పులు చేయడంతోపాటు, దిద్దుబాటు చర్యలూ తీసుకోవాలని సూచించింది.
రుణం ఇచ్చిన తేదీ నుంచే వసూలు చేయాలి: ఆర్ఈల క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో, రుణం మంజూరు చేసిన తేదీ లేదా రుణ ఒప్పందాన్ని అమలు చేసిన తేదీ నుంచి వడ్డీ వసూలు చేయడాన్ని గమనించినట్లు తెలిపింది. వాస్తవానికి ఇది రుణం పంపిణీ చేసిన తేదీ నుంచి లెక్కించాలి. రుణం మంజూరైన చాలా రోజులకు ఆ మొత్తం అందించినా, వడ్డీని ముందే వసూలు చేస్తున్నారని ఆక్షేపించింది.
- కొన్ని ఆర్ఈలు రుణం బాకీ ఉన్న కాలానికి మాత్రమే కాకుండా, మొత్తం నెలకు వడ్డీ వసూలు చేస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది.
- కొన్ని సందర్భాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాయిదాలను ముందే వసూలు చేస్తున్నాయన్న సంగతినీ గుర్తించింది. ఇవన్నీ న్యాయమైన, పారదర్శకత స్ఫూర్తికి అనుగుణంగా లేవనీ ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి పద్ధతులను అవలంబించిన రుణ సంస్థలు వెంటనే అదనపు వడ్డీలు, ఇతర ఛార్జీలను రుణగ్రహీతలకు తిరిగి చెల్లించాలని తన సర్క్యులర్లో ఆదేశించింది. రుణ పంపిణీ కోసం చెక్కులకు బదులు ఆన్లైన్లోనే బదిలీ చేయాలనీ సూచించింది. సర్క్యులర్లో పేర్నొన్న ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయనీ ఆర్బీఐ స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
Blinkit: బ్లింకిట్లో ఇక కూరగాయలు కొంటే కొత్తిమీరను ఉచితంగా ఇస్తారట. ఓ తల్లి సూచనతో కంపెనీ సీఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. -
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న నరేశ్ గోయల్ (Naresh Goyal) సతీమణి అనితా గోయల్ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. -
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్ 386 పాయింట్లు పుంజుకొని 73,373 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 110 పాయింట్లు ఎగబాకి 22,310 దగ్గర కొనసాగుతోంది. -
విదేశీ మదుపర్లలో ఎన్నికల గుబులు
దశాబ్దకాలంలోనే తొలిసారిగా భారత స్టాక్ మార్కెట్లపై విదేశీ మదుపర్లు నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు కనిపిస్తోంది. -
బీసీజీ షేర్ల ట్రేడింగ్పై జూన్ 14 నుంచి సస్పెన్షన్
బీసీజీ (బ్రైట్కామ్ గ్రూపు) సంస్థకు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ కంపెనీ షేర్ల ట్రేడింగ్పై బీఎస్ఈ, ఎన్ఎన్సీ సస్పెన్షన్ విధించాయి. -
విదేశీ ఖనిజాలపై కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ దృష్టి
ప్రభుత్వ రంగ కంపెనీ (పీఎస్యూ)లైన కోల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్).. విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల కొనుగోలు విషయంలో చురుగ్గా ముందుకు వెళుతున్నాయని కేంద్రం బుధవారం పేర్కొంది. -
టెక్ ఉద్యోగాల్లో మహిళల వాటా తక్కువే
దేశంలోని టెక్ ఉద్యోగాల్లో లింగ అసమానత కనిపిస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) బోర్డు డైరెక్టర్, ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ బుధవారం వెల్లడించారు. -
ఒడుదొడుకుల్లో స్వల్ప నష్టాలు
రోజంతా ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్లో సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్, రిలయన్స్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. -
కేవైసీ ధ్రువీకరణ మరింత సులభం
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (కేఆర్ఏ)ల ద్వారా కేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకో) వివరాల ధ్రువీకరణ ప్రక్రియను సులభతరం చేయాలని సెబీ నిర్ణయం తీసుకుంది. -
4 నెలల గరిష్ఠానికి వాణిజ్య లోటు
మనదేశం నుంచి వస్తు ఎగుమతులు ఈ ఏడాది ఏప్రిల్లో 34.99 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2.90 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. -
ఎల్ఐసీకి మరో మూడేళ్ల సమయం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో ప్రజల కనీస వాటా 10 శాతానికి చేరేందుకు మరో మూడేళ్ల గడువు లభించింది. 2022 మే 17న ఎల్ఐసీ స్టాక్ మార్కెట్లో నమోదయ్యింది. -
సోరియాసిస్ వ్యాధికి ఔషధం
జర్మనీకి చెందిన బోహ్రింగర్ ఇంగెల్హీమ్ అనే ఔషధ సంస్థ మనదేశంలో సొరియాసిస్ (జనరలైజ్డ్ పస్టులర్ సోరియాసిస్-జీపీపీ) అనే వ్యాధి చికిత్సలో వినియోగించే స్పెవిగో (స్పెసోలిమాబ్) ఇంజెక్షన్ను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఫోన్ ఛార్జీలు పెంచాల్సిందే
ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో టెలికాం ఛార్జీలు చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విత్తల్ పేర్కొన్నారు. -
డిపాజిట్ రేట్లు పెంచిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగంలోని అతిపెద్ద బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. -
సంక్షిప్త వార్తలు
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో బెర్జర్ పెయింట్స్ రూ.222.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్క మ్యాచ్ ఫలితం.. మూడు జట్లపై ప్రభావం?
-
బ్లింకిట్లో కొత్తిమీర ఫ్రీ.. ఆ తల్లి సూచనతో సీఈవో నిర్ణయం
-
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
-
నా బ్యాంకు అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
-
నాపై అనర్హత వేటు కక్షపూరిత చర్య: జంగా కృష్ణమూర్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM