సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది.
అదానీ పోర్ట్స్కు ఏఏఏ రేటింగ్
దిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. ‘కంపెనీకున్న అనుసంధాన వ్యాపార విధానం, పరిశ్రమలో బలమైన స్థానం, మర్కెట్ వాటా వృద్ధిలో స్థిరత్వం, మెరుగైన లాభదాయకత, అధిక ద్రవ్యలభ్యత, తక్కువ రుణ భారం లాంటివి ఏపీఎస్ఈజెడ్ ఈ రేటింగ్ను పొందేందుకు కారణం అయ్యాయ’ని వెల్లడించింది.
వాణిజ్య గ్యాస్ సిలిండరు ధర రూ.19 తగ్గింది
హైదరాబాద్: వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల గ్యాస్ సిలిండరు ధరను ఈనెల 1 నుంచి రూ.19 మేర తగ్గించినట్లు చమురు మార్కెటింగ్ సంస్థలు తెలిపాయి. ఇప్పటివరకు రూ.1994.50 గా ఉన్న ఈ సిలిండరు ధర ప్రస్తుతం రూ.1,975.50కు చేరింది.
- విమాన ఇంధన (ఏటీఎఫ్) ధర స్వల్పంగా పెరిగింది. దిల్లీలో 0.7% (రూ.749.25) పెరగడంతో కిలోలీటరు ధర రూ.1,01,642.88కు చేరింది.
- దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై అదాటు లాభాల పన్ను (విండ్ఫాల్ టాక్స్)ను టన్నుకు రూ.9,600 నుంచి రూ.8,400కు తగ్గించారు.
అమెరికా వడ్డీ రేట్లు మారలేదు
వాషింగ్టన్: వరుసగా ఆరో సమీక్షలోనూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. మార్కెట్ వర్గాల అంచనాలకు తగ్గట్లుగానే 23 ఏళ్ల గరిష్ఠ స్థాయి అయిన 5.25-5.50 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణ తాజా గణాంకాలు అంచనాలకు మించి 3.7 శాతంగా నమోదు కావడమే ఇందుకు నేపథ్యం. 2022 మార్చి తర్వాత విధాన రేటును 11 సార్లు పెంచుతూ 5.25 శాతానికి చేర్చిన ఫెడ్, 2023 జులై నుంచి యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2% లోపునకు తీసుకురావాలన్నది ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎమ్సీ) లక్ష్యం. ఆర్థిక భవిష్యత్ అంచనాలు అనిశ్చితిగా ఉన్నందున, రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే కమిటీ మొగ్గు చూపింది.
నేటి బోర్డు సమావేశాలు: అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, కోల్ ఇండియా, డాబర్, ఫెడరల్ బ్యాంక్, కోఫోర్జ్, బ్లూస్టార్, అజంతా ఫార్మా
టాటా మోటార్స్కు రూ.25 కోట్ల పన్ను నోటీసు
దిల్లీ: జరిమానా, వడ్డీతో కలిపి సుమారు రూ.25 కోట్లు చెల్లించాలంటూ టాటా మోటార్స్కు పన్ను నోటీసు వచ్చింది. పన్ను మొత్తంలో కొంత తగ్గించి చెల్లించడం, పరిమితికి మించి రుణం పొందడాన్ని పరిగణనలోకి తీసుకుని సీజీఎస్టీ/ ఎస్జీఎస్టీ చట్టం- 2017లోని సెక్షన్ 73 కింద పన్ను అధికారులు ఈ నోటీసులు పంపినట్లు టాటా మోటార్స్ ధ్రువీకరించింది. ఇందులో పన్ను మొత్తం రూ.14,25,68,173 కాగా.. వడ్డీ రూ.9,14,15,704, జరిమానా రూ.1,42,56,815. ‘పన్ను నోటీసును కంపెనీ పరిశీలిస్తోంది. దీనిపై అప్పీల్ చేసుకునే హక్కును ఉపయోగించుకుంటామ’ని ఎక్స్ఛేంజీలకు టాటా మోటార్స్ తెలిపింది. ఈ నోటీసుల వల్ల కంపెనీ ఆర్థిక, నిర్వహణ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం పడదని స్పష్టం చేసింది.
ప్రతి నెలా ఒక కొత్త హోటల్
ఫార్చూన్ హోటల్స్ ప్రణాళిక
దిల్లీ: ఐటీసీ హోటల్ గ్రూప్నకు చెందిన ఫార్చూన్ హోటల్స్ బ్రాండ్పై ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో ప్రతి నెలా ఒక కొత్త హోటల్ తెరవాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు కంపెనీ ఎండీ సమీర్ ఎంసీ బుధవారం వెల్లడించారు. నేపాల్లోని భక్తాపుర్లో తొలి అంతర్జాతీయ హోటల్ - ఫార్చూన్ రిసార్ట్ అండ్ వెల్నెస్ స్పాను ప్రారంభించిన సమీర్ ఈ విషయాన్ని తెలిపారు. దక్షిణాసియా, సన్నిహిత విపణుల్లో తమ హోటళ్లను విస్తరిస్తామని పేర్కొన్నారు. కేవడియా (ఏక్తా నగర్, గుజరాత్), క్యాండోలిమ్ (గోవా), పాలంపుర్ (హిమాచల్ ప్రదేశ్), బీచ్ రిసార్ట్ (చెన్నై) తదితర ప్రత్యేక గమ్యస్థానాల్లో కనీసం 4-6 హోటళ్లను ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో తెరుస్తామని వెల్లడించారు. అక్టోబరు - మార్చి మధ్య ఇదే సంఖ్యలో కొత్త హోటళ్లను ప్రారంభిస్తామని సమీర్ తెలిపారు.
అంబుజా సిమెంట్స్ లాభం రెట్టింపు
దిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ అంబుజా సిమెంట్స్, మార్చి త్రైమాసికంలో రూ.1,525.78 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.763.30 కోట్లతో పోలిస్తే, ఇది రెట్టింపు. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.7,965.98 కోట్ల నుంచి రూ.8,893.99 కోట్లకు పెరిగింది. గత త్రైమాసికంలో కొనుగోలు చేసిన సంఘీ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాలు ఇందులో కలిశాయని, దీంతో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చిచూడలేమని కంపెనీ తెలిపింది. మార్చి త్రైమాసికంలో అంబుజా మొత్తం వ్యయాలు రూ.7,741.31 కోట్లుగా, మొత్తం ఆదాయం రూ.9,127.45 కోట్లుగా నమోదయ్యాయి. స్టాండలోన్ ప్రాతిపదికన కంపెనీ లాభం రూ.502.40 కోట్ల నుంచి రూ.532.29 కోట్లకు పెరిగింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.4,780.32 కోట్లుగా ఉంది. మొత్తం విక్రయాలు 16.6 మిలియన్ టన్నులకు చేరాయి.
రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.2 డివిడెండ్ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.
13% తగ్గిన అదానీ ఎనర్జీ లాభం
దిల్లీ: అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.381.29 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.439.60 కోట్లతో పోలిస్తే ఇది 13.26% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.3,494.84 కోట్ల నుంచి రూ.4,855.18 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు కూడా రూ.3,200.50 కోట్ల నుంచి రూ.4,358.83 కోట్లకు చేరాయి. పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ లాభం రూ.1,195.61 కోట్లకు పరిమితమైంది. 2022-23లో లాభం రూ.1,280.60 కోట్లు కావడం గమనార్హం. అయితే మొత్తం ఆదాయం రూ.13,840.46 కోట్ల నుంచి రూ.17,218.31 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.13,164.32 కోట్ల నుంచి రూ.14,978.74 కోట్లకు చేరాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 117, నిఫ్టీ 17 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. -
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
SBI hikes FD rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చాయి. -
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Go Digit IPO: రూ.2,615 కోట్ల సమీకరణ లక్ష్యంతో గో డిజిట్ ఐపీఓకి వచ్చింది. మదుపర్లు రూ.14,960తో కనీసం 55 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పుంజుకొని 73,202 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు ఎగబాకి 22,262 దగ్గర కొనసాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. -
2023-24లో పీఎస్బీల లాభం రూ.1,41,203 కోట్లు
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. -
వాహన, లోహ షేర్లకు కొనుగోళ్లు
వరుసగా మూడో రోజూ సూచీల లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించడం, సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
భారతీ ఎయిర్టెల్ లాభంలో 31% క్షీణత
భారతీ ఎయిర్టెల్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. -
13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతానికి చేరింది. ఆహార వస్తువులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
వార్షిక ఖర్చులో 6-7% సాంకేతికపైనే
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటా తన వార్షిక నిర్వహణ ఖర్చులో 6-7% సాంకేతికత సంబంధిత అంశాలపైనే ఖర్చు చేస్తోంది. -
భారత్లో లీప్ మోటార్ ఈవీల తయారీ
చైనాకు చెందిన తన భాగస్వామ్య సంస్థ లీప్మోటర్ విద్యుత్ వాహనాలను భారత్లో తయారు చేసి, విక్రయించేందుకు భారత్లోని తన తయారీ కేంద్రాన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ ఉపయోగించుకోనుంది. -
ఎఫ్అండ్ఓ పై పర్యవేక్షణ పెరగాలి
అధిక నష్టభయం ఉండే ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంపై పర్యవేక్షణ లేమి వల,్ల వాటిల్లో ట్రేడ్ చేసే చిన్న మదుపర్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లు
టీవీఎస్ మోటార్ తన విద్యుత్తు స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న టేబుల్ స్పేస్
కార్యాలయ స్థలానికి కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 13.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు టేబుల్ స్పేస్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో భావిస్తోంది. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
-
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు