Higher pension: అధిక పింఛనుకు షరతుల అడ్డంకి
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే వేతనజీవులు, కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛను ఆశలకు షరతులు అడ్డుగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో మెరుగైన పింఛను వస్తుందని భావించిన అర్హులైన ఉద్యోగులకు ఆ ఫలాలు అందకుండా ఈపీఎఫ్వో నిబంధనలు చేర్చింది.
పేరా 26(6) ప్రకారం ఆధారం జతచేయాలంటూ ఈపీఎఫ్ఓ నిబంధన
ఎక్కువ మంది లబ్ధి పొందకుండా అడ్డుకునే ప్రయత్నమంటున్న కార్మిక సంఘాలు
ఈనాడు, హైదరాబాద్: ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే వేతనజీవులు, కార్మికులు, ఉద్యోగుల అధిక పింఛను ఆశలకు షరతులు అడ్డుగా మారుతున్నాయి. వృద్ధాప్యంలో మెరుగైన పింఛను వస్తుందని భావించిన అర్హులైన ఉద్యోగులకు ఆ ఫలాలు అందకుండా ఈపీఎఫ్వో నిబంధనలు చేర్చింది. అధిక పింఛను పొందేందుకు సుప్రీంకోర్టు అవకాశమిస్తే కఠిన షరతుల పేరిట ఎవరూ అర్హులు కాకుండా ప్రయత్నాలు చేస్తోంది. ఈపీఎఫ్వో గరిష్ఠ పరిమితికి (మూలవేతనం+డీఏ) మించి వేతనం పొందుతూ ఆ మేరకు వాస్తవిక వేతనంపై ఏళ్ల తరబడి ఉద్యోగి, యజమాని చెరో 12 శాతం చందా చెల్లిస్తున్నప్పుడు అనుమతించిన ఈపీఎఫ్వో, అధికవేతనంపై చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26(6) కింద ఉద్యోగి, యజమాని సంయుక్తంగా ఈపీఎఫ్వో నుంచి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తోంది. అధిక పింఛను కోరుకుంటున్న అర్హులైన ఉద్యోగులు యాజమాన్యాలతో కలిసి చట్టంలోని పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ కోసం ఆన్లైన్ దరఖాస్తుతో ఈ పత్రాన్ని తప్పనిసరి జతచేయాలని షరతు పెట్టింది. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తూ అధిక వేతనంపై చందా కడుతున్న లక్షల మంది కార్మికులు అధిక పింఛను అవకాశం కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.
ఏమిటీ పేరా 26 (6)?
ఈపీఎఫ్వో చట్టం ప్రకారం గరిష్ఠ వేతన పరిమితి 2014 సెప్టెంబరు 1కి ముందు రూ.6500, ఆ తరువాత రూ.15 వేలుగా ఉంది. చట్టంలోని నిబంధనల ప్రకారం గరిష్ఠ వేతన పరిమితికి మించి పొందుతున్న ఉద్యోగులు, ఇస్తున్న యజమాన్యాలు వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లించేందుకు ఈపీఎఫ్ చట్టంలోని పేరా 26 (6) కింద ఈపీఎఫ్వో నుంచి అనుమతి పత్రం తీసుకోవాలి. ఉద్యోగి, యజమాని కలిసి అధికవేతనంపై చందా చెల్లించడానికి అంగీకరిస్తున్నామని, ఈ మేరకు అవసరమైన ఫీజులు చెల్లిస్తామంటూ సహాయ పీఎఫ్ కమిషనర్కు దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవాలి.
ప్రస్తుత పరిస్థితి..?
అధికవేతనంపై చందాకోసం 26(6) కింద చాలా మంది ఉద్యోగులు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేదు.కానీ ఉద్యోగులు, యాజమానులూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చందా చెల్లిస్తూ వచ్చారు. చందా చెల్లించినప్పుడు ఈపీఎఫ్వో అనుమతించింది. ఆ నగదుపై వడ్డీని జమ చేసింది. కానీ అధిక పింఛనుకు సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో చాలా మంది ఉద్యోగులను దూరంచేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తులో పేరా 26 (6) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టు ఆధారాన్ని జతచేయాలని ఆదేశించింది. ఈ ఆధారం లేకుంటే దరఖాస్తు ముందుకు వెళ్లడం లేదు. కొందరు ఉద్యోగులు, పింఛనుదారులు ఈపీఎఫ్వో కార్యాలయాల్లో సిబ్బందిని సంప్రదిస్తే పేరా 26(6) ఇవ్వకుంటే అధిక పింఛను వచ్చే అర్హత ఉండదని చెబుతున్నారు. అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులను దూరం చేసేందుకు పేరా 26(6) కింద ఆధారాన్ని సాకుగా చూపిస్తూ ప్రయత్నాలు చేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అప్పుడలా... ఇప్పుడిలా...
అధిక పింఛనుపై సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చినపుడు ఈపీఎఫ్వో పేరా 26(6) కింద అధిక వేతనంపై చందా చెల్లించేందుకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది. తాజాగా అధిక పింఛను సదుపాయం కోసం ఆన్లైన్ దరఖాస్తు చేయడానికి ఆప్షన్ ఇవ్వాలని కచ్చితంగా పేర్కొంది. గతంలో ఆదేశాలు ఇలా ఉన్నాయి.- అధిక పింఛనుపై సుప్రీంకోర్టు 2015లో ఇచ్చిన తీర్పుతో ఈపీఎఫ్వో 2017 మార్చి 23న ప్రాంతీయ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో ‘‘చందాదారులు ఈపీఎఫ్వో గరిష్ఠ వేతన పరిమితికి మించిన వేతనంపై 12 శాతం చందా చెల్లిస్తున్నపుడు ఆ వేతనంపై 8.33 శాతం పింఛను నిధికి నిధి జమచేయడాన్ని తిరస్కరించడానికి వీల్లేదు’’ అని తెలిపింది. అధిక వేతనంపై చందా చెల్లిస్తున్న సభ్యులు ఆ పూర్తి వేతనంపై పింఛను నిధికి 8.33 శాతం వాటా చెల్లించేందుకు అనుమతించాలని ఈపీఎఫ్వో లేఖ రాయగా కార్మికశాఖ సమ్మతించింది.
* 2019 జనవరి 22న ఇచ్చిన ఆదేశాల్లో.. ‘‘గరిష్ఠ వేతన పరిమితికి మించి యజమాని, ఉద్యోగి పేరా 26(6) కింద అధిక వేతనంపై చందాకు ఉమ్మడి ఆప్షన్ ఇవ్వకుండా చందా చెల్లించినప్పుడు ఆ వివరాలు ఈపీఎఫ్వో వద్ద అప్డేట్ అయితే ఆ ఉద్యోగి నుంచి పేరా 26(6) కింద ఉమ్మడి ఆప్షన్ అడగడానికి వీల్లేదు’’
హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి 30 ఏళ్లుగా ఈపీఎఫ్ చందాదారుడిగా ఉన్నారు. మరో ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. ఉద్యోగికి వేతనం (బేసిక్, డీఏ కలిపి) రూ.50 వేలు ఉంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఉద్యోగి, యజమాని ఇద్దరూ వాస్తవిక వేతనంపై 12 శాతం చొప్పున చెల్లిస్తూ వస్తున్నారు. సుప్రీంకోర్టు అధికవేతనం పొందుతున్న ఉద్యోగులకు అధిక పింఛనుకు అవకాశమివ్వడంతో పేరా 11(3) కింద యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు ఆన్లైన్లో దరఖాస్తుకు ప్రయత్నించారు. అధికవేతనంపై చందా చెల్లిస్తున్నప్పటికీ, ఆ చెల్లింపునకు 26(6) కింద అనుమతి పత్రాన్ని జత చేయాలనే నిబంధన చేర్చింది. ఇన్నేళ్లు వాస్తవిక వేతనంపై చందా స్వీకరించిన ఈపీఎఫ్వో ఇప్పుడు ఆప్షన్ ఆధారాన్ని అడగడంతో ఆ ఉద్యోగి ఆందోళన చెందుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలమందిది ఇదే పరిస్థితి.
పేరా 26(6) కింద అనుమతించినట్టుగా భావించాలి
పేరా 26(6) కింద అనుమతి జతచేయడం ఇప్పుడు సాధ్యం కాదు. దాదాపు 25-30 ఏళ్లుగా యజమానులు, కార్మికులు గరిష్ఠ వేతన పరిమితికి మించి చందా చెల్లించారు. చందా కట్టినప్పుడు ఈపీఎఫ్వో అనుమతించింది. వడ్డీ కూడా చెల్లించారు. యాజమాన్యాలు వాస్తవిక వేతనంపై 1 శాతం పరిపాలన ఛార్జీలు చెల్లించాయి. ఇన్నిరోజులు ఫీజులు, చందా తీసుకుని ఇప్పుడు కార్మికులకు ప్రయోజనాలు ఎగ్గొట్టేందుకు ఈపీఎఫ్వో ప్రయత్నాలు చేయడం సరికాదు. ఈపీఎఫ్ మినహాయింపు సంస్థల్లోని ఉద్యోగుల చందా చెల్లింపులపై తరచూ తనిఖీలు చేసి, తనిఖీ ఛార్జీలు వసూలు చేశారు. అధికవేతనంపై చందా చెల్లించిన ఉద్యోగులు, యజమాన్యాలు 26(6) కింద ఆప్షన్ ఇచ్చినట్టుగా భావించి, అందరినీ అనుమతించాలి. ఈ విషయమై వెంటనే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) మీటింగ్ పెట్టాలని కోరుతూ ఈపీఎఫ్వోకు లేఖ రాశాను.
సుంకరి మల్లేశం, సెంట్రల్ ట్రస్టీ బోర్డు సభ్యుడు, ఈపీఎఫ్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..