డిజిటల్ చెల్లింపుల్లో సంస్థలకు సాయం చేస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది.
ఈనాడు - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది. డిజిటల్ చెల్లింపులు అధికంగా ఉన్న ఈ రోజుల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ డిజిటల్ చెల్లింపులకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో పుట్టిన అంకురమే ఎన్పే. బిల్లుల వసూలులో పారదర్శకంగా ఉండటంతో పాటు, ఖర్చులను తగ్గించుకునేందుకు మేము సహాయం చేస్తామంటున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ భరత్ గుత్తా. తమ అంకురం గురించి ఇలా వివరిస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో చాలా సంస్థలకు బిల్లులను వసూలు చేయడం కష్టతరమయ్యింది. వినియోగదారులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా తీసుకోలేని పరిస్థితి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వ్యత్యాసం ఎంతో ఉంది. ప్రత్యేకించి, సేవలను అందిస్తున్న సంస్థలకు సులభంగా డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యవస్థ అందుబాటులో లేదు. విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నాకు ఈ విషయం అర్థమయ్యింది. దీనికి పరిష్కారం కోసం నాకున్న ఆలోచనలను నా చిన్ననాటి మిత్రులైన ఆకాశ్ చోడే, రామకృష్ణలతో పంచుకున్నాను. ఆ తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ను సంప్రదించాం. ఇలా మా సంస్థ ఎన్పే (ఎన్పేయాప్.కామ్) ఆవిర్భవించింది.
ఏం చేస్తామంటే..
విద్యుత్ సంస్థలు, బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా 25కు పైగా రకాల సంస్థలు నెలవారీ బిల్లులను డిజిటల్గా వసూలు చేయడంలో మేము సహాయం చేస్తాం. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, క్రెడ్, బ్యాంక్ మొబైల్ యాప్లు తదితర వాటిల్లో ఆయా సంస్థలు కనిపిస్తాయి. అంతేకాదు.. ఇ-సేవ, సీఎస్సీ కేంద్రాల్లోనూ బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్పే ఆయా సంస్థలు డిజిటల్ చెల్లింపులు స్వీకరించేలా ప్రత్యేకంగా ఒక లింక్ను అందిస్తుంది. వినియోగదారులు డెబిడ్, క్రెడిట్ కార్డులతోపాటు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సంస్థలు ప్రత్యేకంగా వసూళ్ల కోసం సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చెల్లించిన తర్వాత ప్రతిసారీ వివరాలను నమోదు చేయక్కర్లేదు. బిల్లు చెల్లింపుల విషయం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. సమస్య ఉంటే ఎప్పుడైనా సరే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించే వీలుంటుంది. చెల్లింపు గేట్వేలు అధికంగా రుసుములు విధిస్తాయి. మేము అందులో సగం కన్నా తక్కువే వసూలు చేస్తున్నాం.
గ్రాంటులు అందుకున్నాం..
మా ఆలోచనను మెచ్చి పలు సంస్థలు గ్రాంటులను అందించాయి. ఇందులో టి-హబ్, ఐఐటీ కాన్పూర్, సిటీ బ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నుంచి రూ.10 లక్షల వరకూ గ్రాంటు లభించింది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నుంచి రూ.2 లక్షలు అందుకున్నాం. ఎన్పీసీఐ, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ నుంచి రూ.లక్ష బహుమతినీ గెలుచుకున్నాం. ఇప్పటి వరకూ 100కు పైగా పలు సేవలను అందిస్తున్న సంస్థలు మా సేవలను వినియోగిస్తున్నాయి. నెలకు 6 లక్షల లావాదేవీలు, రూ.1.5 కోట్ల టర్నోవర్ నమోదవుతోంది. 17 రాష్ట్రాలు, 60కి పైగా నగరాల్లో ఎన్పే సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్న వారు, విద్యా సంస్థలు మా ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు.
దేశమంతా..
బీ2బీ రిటైల్, డిస్ట్రిబ్యూషన్ వసూళ్లను మరింత వేగంగా, తక్కువ ధరకు అందించేలా సేవలను విస్తృతం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ రుణాలు అందుబాటులో ఉండేలా ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేయబోతున్నాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎన్పే సేవలను విస్తరించడం ద్వారా నెలకు రూ.10 కోట్ల టర్నోవర్ సాధించాలనేది లక్ష్యం. ఓఎన్డీసీని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ఆసుపత్రులకు దగ్గర చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని, ఆన్లైన్లోనే బిల్లు చెల్లించే వెసులుబాటును తీసుకొచ్చాం. ఈ ఏడాది చివరి నాటికి మా బృందంలో 15 మందికి పైగా ఉద్యోగులు ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది. -
అసమానతలు ఇంతలంతలు
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోనుపోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలబడుతున్నాయి. -
అమెరికాలో రేట్లు తగ్గితే.. మన మార్కెట్లకేంటి?
అమెరికా మార్కెట్లకు జలుబు చేస్తే.. మన స్టాక్ మార్కెట్లకు తుమ్ములొస్తాయని మార్కెట్ వర్గాలు అంటుంటాయి. -
Electric Vehicles: భలే మంచి ఈవీ బేరం
విద్యుత్తు వాహనం వైపు మనసు లాగినా.. రేటు ఎక్కువ ఉందని వెనకాడినవారే ఎక్కువ. అయితే ఇపుడు పరిస్థితి మారుతోంది. ఇటీవలి దాకా విద్యుత్తు ద్విచక్ర వాహన ధరను రూ.1-1.5 లక్షల వరకు విక్రయించాయి. -
7 ఏళ్ల తర్వాత వివాహ బంధంలోకి.. అనంత్ - రాధిక గురించి ఈ విషయాలు తెలుసా?
Anant Ambani - Radhika Merchant: అనంత్, రాధికా మర్చంట్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. జులైలో వీరి వివాహం జరగనుంది. -
ఏఐ ఉంటే.. ఔషధం ఇట్టే ఆవిష్కారం
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), డేటా అనలిటిక్స్... కేవలం ఐటీ సేవల్లోనే కాదు.. ఔషధ రంగంలోనూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. -
Investment: సంపన్నుల పెట్టుబడులూ స్థిరాస్తిపైనే
సంపాదించే ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టడం అందరూ చేసేదే. మధ్య తరగతి వారు స్థిరాస్తి, పసిడి వంటి వాటిల్లో పెట్టుబడి పెడుతుంటారు. కోట్ల రూపాయల నికర విలువ కలిగిన సంపన్నులూ అందుకు భిన్నమేమీ కాదు. -
కొత్త విధానం.. కోత ఖాయం!
ఈపీఎఫ్వో అధిక పింఛనుకు అర్హత కలిగిన ఉద్యోగులు, పింఛనుదారుల దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన దాదాపు ఏడాది తరువాత ఖరారైన పింఛను చెల్లింపు పత్రాలు (పీపీవో) జారీ అవుతున్నాయి. -
అంతరిక్షంలో అంకురాల దూకుడే
అంతరిక్ష రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను సడలించడం వల్ల శాటిలైట్ల తయారీ, రాకెట్లు, అసెంబ్లింగ్ విభాగంలో అంకుర సంస్థలకు ఊతమిచ్చినట్లయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
అణు విద్యుత్లోకి రూ.2.20 లక్షల కోట్లు!
అణు విద్యుత్ రంగంలో 26.50 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.20 లక్షల కోట్ల) పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
వియత్నాంతో ఎలా?
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్దే. గతేడాది ఇక్కడ తయారీ 16% వృద్ధితో 44 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎర్ర సముద్రంలో ఎదురుగాలి
మన దేశం నుంచి ఐరోపా, ఆఫ్రికా దేశాలకు, ఆపై ఉత్తర అమెరికా దేశాలకు సరకు తీసుకువెళ్లటానికి ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం మీదుగానే నౌకలు వెళ్లాలి. అదే విధంగా ఆయా దేశాల నుంచి ముడిపదార్థాలు మన దేశానికి వచ్చే దారి కూడా ఇదే. -
AI Smartphone ఏఐ స్మార్ట్ఫోన్.. ఆహా అనిపిస్తుందా?
స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన కొత్తలో కెమేరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లు ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వైపు వినియోగదారులను ఆకర్షించేవి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. -
డిజిటల్ మెదడు.. ఉంటుంది తోడు
గూగుల్ ఒక ఉచిత కృత్రిమ మేధ(ఏఐ) యాప్ను గురువారం ఆవిష్కరించింది. దీనిని స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.. మీరు ఒక డిజిటల్ మెదడుకు అనుసంధానం అయినట్లే. ఇది మీ కోసం రాస్తుంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం