డిజిటల్ చెల్లింపుల్లో సంస్థలకు సాయం చేస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది.
ఈనాడు - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించే కేబుల్, బ్రాడ్బ్యాండ్ సేవలకు; పాఠశాలలు, ఆసుపత్రులకు బిల్లుల చెల్లింపు అంతా నగదు రూపంలోనే జరుగుతుంటుంది. డిజిటల్ చెల్లింపులు అధికంగా ఉన్న ఈ రోజుల్లోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ డిజిటల్ చెల్లింపులకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్న ఆలోచనతో పుట్టిన అంకురమే ఎన్పే. బిల్లుల వసూలులో పారదర్శకంగా ఉండటంతో పాటు, ఖర్చులను తగ్గించుకునేందుకు మేము సహాయం చేస్తామంటున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకులు, సీఈఓ భరత్ గుత్తా. తమ అంకురం గురించి ఇలా వివరిస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో చాలా సంస్థలకు బిల్లులను వసూలు చేయడం కష్టతరమయ్యింది. వినియోగదారులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా తీసుకోలేని పరిస్థితి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ వ్యత్యాసం ఎంతో ఉంది. ప్రత్యేకించి, సేవలను అందిస్తున్న సంస్థలకు సులభంగా డిజిటల్ చెల్లింపులను స్వీకరించే వ్యవస్థ అందుబాటులో లేదు. విధుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నాకు ఈ విషయం అర్థమయ్యింది. దీనికి పరిష్కారం కోసం నాకున్న ఆలోచనలను నా చిన్ననాటి మిత్రులైన ఆకాశ్ చోడే, రామకృష్ణలతో పంచుకున్నాను. ఆ తర్వాత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ను సంప్రదించాం. ఇలా మా సంస్థ ఎన్పే (ఎన్పేయాప్.కామ్) ఆవిర్భవించింది.
ఏం చేస్తామంటే..
విద్యుత్ సంస్థలు, బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ ఆపరేటర్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఇలా 25కు పైగా రకాల సంస్థలు నెలవారీ బిల్లులను డిజిటల్గా వసూలు చేయడంలో మేము సహాయం చేస్తాం. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, క్రెడ్, బ్యాంక్ మొబైల్ యాప్లు తదితర వాటిల్లో ఆయా సంస్థలు కనిపిస్తాయి. అంతేకాదు.. ఇ-సేవ, సీఎస్సీ కేంద్రాల్లోనూ బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్పే ఆయా సంస్థలు డిజిటల్ చెల్లింపులు స్వీకరించేలా ప్రత్యేకంగా ఒక లింక్ను అందిస్తుంది. వినియోగదారులు డెబిడ్, క్రెడిట్ కార్డులతోపాటు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వాలెట్ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సంస్థలు ప్రత్యేకంగా వసూళ్ల కోసం సిబ్బందిని నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చెల్లించిన తర్వాత ప్రతిసారీ వివరాలను నమోదు చేయక్కర్లేదు. బిల్లు చెల్లింపుల విషయం ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. సమస్య ఉంటే ఎప్పుడైనా సరే వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించే వీలుంటుంది. చెల్లింపు గేట్వేలు అధికంగా రుసుములు విధిస్తాయి. మేము అందులో సగం కన్నా తక్కువే వసూలు చేస్తున్నాం.
గ్రాంటులు అందుకున్నాం..
మా ఆలోచనను మెచ్చి పలు సంస్థలు గ్రాంటులను అందించాయి. ఇందులో టి-హబ్, ఐఐటీ కాన్పూర్, సిటీ బ్యాంక్ సోషల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ నుంచి రూ.10 లక్షల వరకూ గ్రాంటు లభించింది. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ నుంచి రూ.2 లక్షలు అందుకున్నాం. ఎన్పీసీఐ, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్స్ నుంచి రూ.లక్ష బహుమతినీ గెలుచుకున్నాం. ఇప్పటి వరకూ 100కు పైగా పలు సేవలను అందిస్తున్న సంస్థలు మా సేవలను వినియోగిస్తున్నాయి. నెలకు 6 లక్షల లావాదేవీలు, రూ.1.5 కోట్ల టర్నోవర్ నమోదవుతోంది. 17 రాష్ట్రాలు, 60కి పైగా నగరాల్లో ఎన్పే సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కేబుల్ ఆపరేటర్లు, బ్రాడ్బ్యాండ్ సేవలను అందిస్తున్న వారు, విద్యా సంస్థలు మా ద్వారా డిజిటల్ చెల్లింపులను స్వీకరిస్తున్నారు.
దేశమంతా..
బీ2బీ రిటైల్, డిస్ట్రిబ్యూషన్ వసూళ్లను మరింత వేగంగా, తక్కువ ధరకు అందించేలా సేవలను విస్తృతం చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లోనూ రుణాలు అందుబాటులో ఉండేలా ఎన్బీఎఫ్సీలతో కలిసి పనిచేయబోతున్నాం. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఎన్పే సేవలను విస్తరించడం ద్వారా నెలకు రూ.10 కోట్ల టర్నోవర్ సాధించాలనేది లక్ష్యం. ఓఎన్డీసీని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు, ఆసుపత్రులకు దగ్గర చేయడం ద్వారా ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్నాం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాల్లో గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకొని, ఆన్లైన్లోనే బిల్లు చెల్లించే వెసులుబాటును తీసుకొచ్చాం. ఈ ఏడాది చివరి నాటికి మా బృందంలో 15 మందికి పైగా ఉద్యోగులు ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు