Narayana Murthy: ఆమెను ఇన్ఫోసిస్కు దూరంగా ఉంచి తప్పుచేశా: నారాయణ మూర్తి
Narayana Murthy: తన భార్య సుధామూర్తిని ఇన్ఫోసిస్ కంపెనీకి దూరంగా ఉంచి పొరబాటు చేశానని సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అన్నారు. ఆ రోజుల్లో తాను తప్పుగా ఆలోచించానని తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నారాయణ మూర్తి (Narayana Murthy).. మరో ఆరుగురు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్తో కలిసి ‘ఇన్ఫోసిస్ (Infosys)’ను ప్రారంభించారు. అయితే ఈ కంపెనీలో తన భార్య సుధామూర్తి (Sudha Murty)ని ఎందుకు చేర్చుకోలేదో తాజాగా ఆయన బయటపెట్టారు. ఆ రోజుల్లో తాను చాలా తప్పుగా ఆలోచించానని అన్నారు. కంపెనీలో చేరేందుకు తమకంటే ఆమెకే ఎక్కువ అర్హతలున్నాయని తెలిపారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణ మూర్తి ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
‘‘కుటుంబాన్ని కంపెనీలోకి తీసుకురాకుంటేనే మంచి కార్పొరేట్ పాలన చేయగలమని నేను భావించా. ఎందుకంటే ఆ రోజుల్లో కంపెనీలోకి వారసులు వచ్చి యాజమాన్య బాధ్యతలు చేపట్టేవారు. దీంతో చట్టాల ఉల్లంఘన ఎక్కువగా జరిగేదని అనుకున్నా. కానీ, కొన్నేళ్ల క్రితం కొంతమంది ఫిలాసఫీ ప్రొఫెసర్స్తో నేను మాట్లాడినప్పుడు నా ఆలోచన తప్పని అర్థమైంది. ఓ వ్యక్తికి సరైన అర్హతలున్నప్పుడు.. అది మన భార్య లేదా పిల్లలు అయినా సరే వారిని కంపెనీలోకి తీసుకోకుండా అడ్డుకునే హక్కు మనకు లేదని తెలిసొచ్చింది. అలా చేస్తే వారి హక్కులను లాగేసుకోవడమే అవుతుందని వారు చెప్పారు’’ అని నారాయణమూర్తి అన్నారు. అప్పటి పరిస్థితులకు ప్రభావితమై తాను సుధామూర్తిని ఇన్ఫోసిస్కు దూరంగా ఉంచాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. తాను చేసింది తప్పేనని అంగీకరించారు.
ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధామూర్తి ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ‘‘కంపెనీలో చేరొద్దని నా భర్త కోరారు. కుటుంబం మంచి కోసం నేను వెనక్కి తగ్గా. అప్పుడు దానికి నా మెదడు అంగీకరించినా.. మనసు మాత్రం ఒప్పుకోలేదు’’ అని తెలిపారు. ఇన్ఫోసిస్ ప్రారంభించేందుకు తన భార్యే రూ.10వేల పెట్టుబడి పెట్టారని నారాయణమూర్తి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
70 గంటల పని విధానంపై..
ఈ సందర్భంగా వారానికి 70 పనిగంటలపై తాను చేసిన వ్యాఖ్యలను నారాయణమూర్తి మరోసారి సమర్థించుకున్నారు. ‘రైతులు, కార్మికులు ఎంతో కష్టపడతారు. వారితో పాటు మనం కూడా చాలా శ్రమించాలి. సబ్సిడీ ద్వారా విద్యను అందిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. మనలాంటి వారు భారీ రాయితీతో విద్యను పొందుతున్నారు కాబట్టి అందరూ చాలా కష్టపడి పనిచేయాలి. చైనా లాంటి ప్రపంచ ఆర్థిక శక్తులతో పోటీ పడాలంటే భారత్కు ఇలాంటి అంకితభావం అవసరం’ అని ఆయన అన్నారు. వారానికి 70 పనిగంటలపై తాను చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినప్పటికీ.. చాలా మంది తనతో ఏకీభవించారని నారాయణమూర్తి ఈ సందర్భంగా తెలిపారు. ‘‘పాశ్చాత్య దేశాల్లో ఉండే నా స్నేహితులు, చాలా మంది ఎన్ఆర్ఐలు నాకు ఫోన్ చేసి.. నా వ్యాఖ్యలపై సంతోషం వ్యక్తం చేశారు’’ అని ఆయన అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
గోద్రేజ్ విభజన.. షేర్ల బదిలీతోనే
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.