IPOs in 2022: అదరగొట్టిన అదానీ.. నిరాశపర్చిన ఎల్ఐసీ.. 2022లో తగ్గిన ఐపీఓల జోరు!
IPOs in 2022: 2022లో ఐపీఓల జోరు తగ్గింది. సమీకరణ మొత్తం 2021తో పోలిస్తే సగానికి తగ్గింది. ప్రధానంతా అంతర్జాతీయ కారణాలే ప్రైమరీ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది.
IPOs in 2022: క్రితం ఏడాదితో పోలిస్తే 2022లో ఐపీఓ (IPO)ల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. కానీ, పబ్లిక్ ఇష్యూ (IPO)లో షేర్లు దక్కించుకున్న వారికి మాత్రం సగటున 32 శాతం వరకు ప్రతిఫలం అందడం విశేషం. ఈ ఏడాది ఇప్పటి వరకు 38 కంపెనీలు ఐపీఓ (IPO)కు వచ్చాయి. క్రితం సంవత్సరం ఈ సంఖ్య 65గా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూకి వచ్చిన కంపెనీలు దాదాపు రూ.59,000 కోట్లు సమీకరించాయి. 2021లో ఈ మొత్తం రికార్డు స్థాయిలో 1.31 లక్షల కోట్లుగా నమోదైంది. సగటు ఐపీఓ పరిమాణం సైతం క్రితం సంవత్సరంతో పోలిస్తే రూ.2,022 కోట్ల నుంచి రూ.1,844 కోట్లకు పడిపోయింది.
2022లో ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో దాదాపు 80 శాతం కంపెనీలు లాభాల్లో ఉండడం విశేషం. అదానీ విల్మర్ 2022లో మదుపర్ల పంట పండించిందనే చెప్పాలి. ఇది దాదాపు 183 శాతం రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత హరిఓం పైప్స్ 137 శాతం రాబడితో మదుపర్లకు లాభాలు కురిపించింది. మొత్తంగా ఈ ఏడాది ఐపీఓకి వచ్చిన వాటిలో నాలుగు కంపెనీలు మదుపర్ల సంపదను రెట్టింపు చేశాయి. మరో 18 కంపెనీలు రెండంకెల రాబడినివ్వడం విశేషం.
(ప్రస్తుత ధరలు డిసెంబరు 24 మార్కెట్లు ముగిసినప్పటివి)
ఈ ఏడాది మదుపర్ల సంపదను హరించేసిన ఐపీఓలూ ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ కూడా ఉండడం గమనార్హం. రూ.21,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఐపీఓకి వచ్చిన ఈ కంపెనీ షేర్లు 8.1 శాతం నష్టంతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం 20 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి.
(ప్రస్తుత ధరలు డిసెంబరు 24 మార్కెట్లు ముగిసినప్పటివి)
ప్రభావం చూపిన అంశాలివే..
☛ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని కఠినతం చేశాయి. దీంతో వడ్డీరేట్లు పెరిగి ప్రజల వద్ద ద్రవ్యలభ్యత తగ్గింది. మదుపు చేసేందుకు డబ్బు లేక ఐపీఓలో పాల్గొనడానికి మదుపర్లు వెనుకాడారు.
☛ భౌగోళిక రాజకీయాలు సైతం స్టాక్ మార్కెట్ తద్వారా ప్రైమరీ మార్కెట్పై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం మార్కెట్లను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న ఈక్విటీ మార్కెట్లకు 2022 ఆదిలోనే ఇది పెనుశాపంగా పరిణమించింది.
☛ ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పేటీఎం, జొమాటో, నైకా వంటి నవతరం టెక్ కంపెనీలు ఈ ఏడాది మదుపర్లను బోల్తా కొట్టించాయి. భారీ దిద్దుబాటుకు గురై మదుపర్లకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఐపీఓలో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేసిన సంస్థాగత మదుపర్లు లాకిన్ గడువు ముగియడంతో వాటిని మార్కెట్లోకి వదిలేశారు. దీంతో వీటి ధరలు పతనమయ్యాయి. ఈ నేపథ్యంలోనే చాలా న్యూఏజ్ టెక్ కంపెనీలు ఐపీఓకి రావడానికి వెనుకడుగు వేశాయి.
గత ఏడాది మార్కెట్లో లిస్టై 2022లో భారీ పతనాన్ని చూసిన టెక్ కంపెనీలివే..
నైకా..
- ఇష్యూ ధర: రూ.2,018 (తర్వాత ఈ స్టాక్ను 6:1 నిష్ఫత్తిలో విభజించారు)
- గరిష్ఠ ధర: రూ.429
- కనిష్ఠ ధర: రూ.139.40
- ప్రస్తుత ధర: రూ.145.80
- ఇష్యూ ధరతో పోలిస్తే 57 శాతం పతనమైంది.
ఈజ్మైట్రిప్..
- ఇష్యూ ధర: రూ.187
- గరిష్ఠ ధర: రూ.476.50
- కనిష్ఠ ధర: రూ.44.95
- ప్రస్తుత ధర: రూ.48.70
- ఇష్యూ ధరతో పోలిస్తే 73 శాతం పతనమైంది.
జొమాటో..
- ఇష్యూ ధర: రూ.76
- గరిష్ఠ ధర: రూ.169.10
- కనిష్ఠ ధర: రూ.40.60
- ప్రస్తుత ధర: రూ.57.90
- ఇష్యూ ధరతో పోలిస్తే 54 శాతం పతనమైంది.
పేటీఎం..
- ఇష్యూ ధర: రూ.
- గరిష్ఠ ధర: రూ.2150
- కనిష్ఠ ధర: రూ.441.10
- ప్రస్తుత ధర: రూ.496.55
- ఇష్యూ ధరతో పోలిస్తే 76 శాతం పతనమైంది.
(పై స్టాక్స్లో ప్రస్తుత ధరలు డిసెంబరు 26 ఉదయం 10 గంటల సమయానికి ఉన్నవి)
ఈ ఏడాది ఐపీఓల్లో మరిన్ని విశేషాలు..
★ దేశంలోనే అతి పెద్ద ఐపీఓగా ఎల్ఐసీ నిలిచింది. రూ.20,557 కోట్లతో అగ్రస్థానం దక్కించుకోగా తర్వాత స్థానాల్లో డెలివరీ (రూ.5,235 కోట్లు), అదానీ విల్మర్ (రూ.3,600 కోట్లు), వేదాంతా ఫ్యాషన్ (రూ.3,149 కోట్లు), గ్లోబల్ హెల్త్ (రూ.2,205 కోట్లు) ఉన్నాయి.
★ 38 ఐపీఓల్లో కేవలం రెండు (డెలివరీ, ట్రాక్షన్ టెక్నాలజీస్) మాత్రమే కొత్త తరం టెక్నాలజీ కంపెనీలు. గత ఏడాది ఐపీఓకు వచ్చిన పేటీఎం, కొన్ని సాంకేతిక సంస్థల షేర్లు పేలవ ప్రదర్శన చేయడం వల్ల, ఈ ఏడాది ఇలాంటివి 2 మాత్రమే ఐపీఓకు వచ్చాయి.
★ హర్ష ఇంజినీర్స్ ఐపీఓకు 75 రెట్ల ఆదరణ దక్కింది. ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా (72 రెట్లు), డీసీఎక్స్ సిస్టమ్స్ (70 రెట్లు) తర్వాత స్థానాల్లో నిలిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జీఎస్టీ సమస్యలకేదీ పరిష్కారం?
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుతీరిన తరవాత ఇటీవల జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు కౌన్సిల్ ముందుకు వచ్చాయి. పన్ను మదింపు, చెల్లింపుల్లో అనవసర వ్యాజ్యాలను నివారించడం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ముఖ్యమైన సమస్యలకు మాత్రం ఇంకా పరిష్కారం లభించలేదు. -
ఎఫ్అండ్ఓ ట్రేడ్లకు అధిక పన్ను!
అధిక నష్టముప్పుతో కూడిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో చిన్న మదుపర్లు దూకుడుగా పాల్గొనడాన్ని తగ్గించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
డాలర్ ఆధిపత్యానికి గండి
చమురును కేవలం డాలర్లలోనే విక్రయించాలని సౌదీ అరేబియా, అమెరికా మధ్య 1974 జూన్ 8న ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది జూన్ 9తో ఆ ఒప్పందానికి గడువు తీరిపోయింది. ఒప్పందాన్ని కొనసాగించకూడదని సౌదీ నిర్ణయించింది. ఇది ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనుంది. -
ఈవీలు జోరందుకునే వీలు
అభివృద్ధికి చోదకశక్తి వంటిది- రవాణా రంగం. మానవ వనరులు, సరకులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరనిదే అభివృద్ధి సాధ్యపడదు. అంతటి ప్రాముఖ్యం కలిగిన రవాణా రంగంలో విద్యుత్ వాహనాలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయి. కానీ, భారత్లో తగినన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడం వినియోగదారులను నిరుత్సాహపరుస్తోంది. -
రియల్ ఎస్టేట్ మోసాలకు సెలబ్రిటీలూ బాధితులే.. రెరా నిబంధనలు ఏం చెప్తున్నాయ్?
RERA act: స్థిరాస్తి మోసాలకు సామాన్యులే కాదు ప్రముఖులూ మోసపోతున్నారు. కాబట్టి రెరా నిబంధనలు తెలుసుకోవడం ముఖ్యం. -
నాణ్యమైన షేర్లు కొని.. కనీసం 2-3 ఏళ్లయినా వేచి చూడండి
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసుకుని, కనీసం 2-3 ఏళ్లయినా ఎదురు చూడాలని చిన్న మదుపర్లకు విశ్లేషకులు సలహా ఇస్తున్నారు. -
ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ లేనట్లేనా?!
ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రచారం జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవిష్యత్ ప్రణాకలపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందని తెలుస్తోంది. -
Artificial Intelligence: ఎటు చూసినా ఏఐ...
మనదేశంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం శరవేగంగా పెరుగుతోంది. కార్యాలయాల్లో అధిక శాతం ఉద్యోగులు ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సమర్థంగా సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మన సమాచారం సురక్షితమేనా?
దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో సైబర్ నేరాల సంఖ్యా అధికమవుతోంది. వీటిని నివారించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఎప్పటికప్పుడు తమ వివరాల్లో మార్పులేమైనా ఉంటే సమర్పించాలని ఖాతాదారులను కోరుతున్నాయి. -
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
Confidential IPO filing: కొన్ని కంపెనీలు ఇటీవల ఐపీఓకి రహస్యంగా సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించాయి. ఈ కొత్త మార్గాన్ని సంస్థలు ఎందుకు ఎంచుకుంటున్నాయి? దీని వెనకున్న వ్యూహమేంటో చూద్దాం.. -
మొన్న విస్తారా.. నేడు ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. టాటాలకు ఎందుకీ సెగ..?
టాటా గ్రూప్నకు చెందిన విమానయాన సంస్థల ఉద్యోగులు తరచూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎందుకీ పరిస్థితి నెలకొంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
తాళాల నుంచి అంతరిక్షం వరకు.. భారతీయుల జీవితాల్లో గోద్రెజ్ ఎలా ‘కీ’లకమైంది?
godrej journey: తాళాలు తయారుచేసే ఓ కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది. గోద్రెజ్ గురించి ‘కీ’ పాయింట్స్.. -
క్వైట్ ఫైరింగ్.. పొమ్మనలేక పొగబెట్టడం..!
Quiet Firing: కార్పొరేట్ రంగంలో పుట్టుకొచ్చిన అనేక కొత్త ట్రెండ్లలో క్వైట్ ఫైరింగ్ ఒకటి. ఇదేంటి? కంపెనీలు ఎందుకు అనుసరిస్తున్నాయి? దీన్ని ఎలా గుర్తించాలో చూద్దాం..! -
జీసీసీలు... అన్నీ ఇటే వస్తున్నాయ్
అగ్రశ్రేణి బహుళ జాతి వ్యాపార సంస్థలు తమ కొత్త గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ) స్థాపనకు మన దేశం వైపు చూస్తున్నాయి. -
క్షణాల్లో బీమా.. ఐఆర్డీఏఐ కల్పించిన ధీమా
దేశంలో బీమాను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ.. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ). -
డ్రై ప్రమోషన్.. జాబ్ మార్కెట్లో ఇదో కొత్త ట్రెండ్
Dry Promotion: వర్క్ ఫ్రమ్ హోమ్, మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన విషయం తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. -
ఇదీ.. ఇండిగో సత్తా
దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మరో ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా అమెరికా విమానయాన సంస్థను అధిగమించి, ప్రపంచంలోనే మూడో స్థానానికి చేరుకుంది. -
విప్రో కొత్త సీఈఓ ఏం చేస్తారో?
విప్రో కొత్త సీఈఓ శ్రీనివాస్ పల్లియాకు కంపెనీలో సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. కంపెనీ ఆర్థిక గణాంకాలను పుంజుకునేలా చేయడంతో పాటు.. కీలక బాధ్యతల్లోని నిపుణులను అట్టేపెట్టి ఉంచుకోవడమూ చేయాల్సి ఉంది. -
అప్పుడు సెల్ఫోన్లలో.. ఇప్పుడు వాహనాల్లో
సెల్ఫోన్లకు అవసరమైన చిప్సెట్లు సమకూర్చడంలో నువ్వా.. నేనా అంటూ పోటీపడే క్వాల్కామ్, మీడియాటెక్ సంస్థలు దేశీయ వాహన రంగంలోనూ తమ పోటీ కొనసాగించనున్నాయి. -
రూపాయి అంతర్జాతీయ కరెన్సీ అవుతుందా?
డాలర్ విలువలో హెచ్చుతగ్గులు వివిధ దేశాల కరెన్సీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీలైనంత వరకు ఇతర దేశాలతో వర్తకాన్ని రూపాయల్లో నిర్వహించడం భారత్కు లాభదాయకం. రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా దక్కితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా పలుకుబడి మరింత పెరుగుతుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్