Elon Musk: టెస్లా లీక్.. ఎలాన్మస్క్ సెక్యూరిటీ నంబర్ కూడా బహిర్గతం..!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లాలో మేలో జరిగిన డేటా లీకేజీలో కీలక అంశాలు బహిర్గతమయ్యాయి. కంపెనీ వాహనాల సమస్యలు, మస్క్ సెక్యూరిటీ నంబర్ కూడా బహిర్గతమైన వాటిల్లో ఉన్నాయి.
ఇంటర్నెట్డెస్క్: కొన్ని నెలల క్రితం టెస్లా ఉద్యోగుల కారణంగా దాదాపు 75,000 మంది ఉద్యోగులు, ఇతరుల డేటా చోరికి గురైందని మైనే అటార్నీ జనరల్ కార్యాలయం ఇటీవల వెల్లడించింది. వీరిలో తొమ్మిది మంది మైనే వాసులు, ఆటోమొబైల్ కంపెనీ ఆస్టిన్కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించింది. ‘‘తాము టెస్లా అత్యంత రహస్య సమాచారం సంపాదించామని విదేశీ మీడియా సంస్థ (హాండెల్స్బ్లాట్) మే 10వ తేదీన ప్రకటించింది’’ అని టెస్లా 18వ తేదీన విడుదల చేసిన నోట్లో పేర్కొంది. ఇద్దరు మాజీ ఉద్యోగులు టెస్లా డేటా ప్రొటెక్షన్ నిబంధనలు ఉల్లంఘించి డేటాను దుర్వినియోగం చేశారని వెల్లడించింది. వీటిని సదరు మాజీ ఉద్యోగులు ఓ మీడియా సంస్థతో పంచుకొన్నారని తెలిపింది.
ఈ డేటా చౌర్యంపై టెస్లా న్యాయపోరాటం చేస్తోంది. ఈ కేసు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తుందో కచ్చితంగా తెలియలేదు. దీంతోపాటు కంపెనీ డేటా ఉన్న పరికరాలను సీజ్ చేయనుంది. దీనిపై టెస్లా డేటా ప్రైవసీ అధికారి స్టీవెన్ ఎలెన్టుక్ మాట్లాడుతూ ‘‘టెస్లా డేటాను మాజీ ఉద్యోగులు ఏ విధంగాను వాడుకోకుండా ఇప్పటికే కంపెనీ కోర్టు ఆదేశాలను పొందింది. భవిష్యత్తులో చర్యలు తీసుకొనేలా కంపెనీ లా ఎన్ఫోర్స్మెంట్, ఫోరెన్సిక్ నిపుణులతో కలిసి పనిచేస్తోంది’’ అని పేర్కొన్నారు.
జీడీపీలో హోటల్ పరిశ్రమ వాటా.. రూ.83 లక్షల కోట్లు!
టెస్లా నుంచి లీకైన డేటాలో 2,400 కస్టమర్ కంప్లైట్లు, బ్రేకింగ్ సమస్యల ఫిర్యాదులు, ఫాంటమ్ బ్రేకింగ్కు సంబంధించిన సమస్యలున్నాయి. ఎలాన్ మస్క్ సెక్యూరిటీ నంబర్ కూడా లీకైన డేటాలో ఉంది. దాదాపు 100 జీబీ డేటా లీకైనట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
యాపిల్ కంపెనీ ఐఓఎస్18తో కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్లో ఏఐ సదుపాయాన్ని జోడించాలనుకుంటోంది. అందులో భాగంగా యాపిల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా