Hyderabad: హైదరాబాద్లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్లో ఈ ఏడాది జనవరి-జూన్లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2011 తర్వాత అంతకుమించి ఇళ్ల విక్రయాలు జరిగింది ఇప్పుడే. 2013 నుంచి ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
జనవరి-జూన్పై నైట్ ఫ్రాంక్ ఇండియా
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్లో ఈ ఏడాది జనవరి-జూన్లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2011 తర్వాత అంతకుమించి ఇళ్ల విక్రయాలు జరిగింది ఇప్పుడే. 2013 నుంచి ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆరునెలల్లో 4 శాతం ప్రియమయ్యాయి. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో రికార్డుస్థాయిలో ఇళ్ల విక్రయాల్లో 60 శాతం వృద్ధి నమోదైంది. తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయిలో విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఐటీ రంగంపై కొవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో హైదరాబాద్లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోందని విశ్లేషించింది. ఇటీవల వరకు గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొంది. మున్ముందు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
* హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో గృహనిర్మాణ రంగ వాటా 62 శాతంగా ఉంది. కొత్తగా 21,356 ఇళ్లు నిర్మితమవుతున్నాయి. వార్షిక వృద్ధి 28 శాతంగా ఉంది.
కార్యాలయాల లీజింగ్..
2021 తొలి అర్ధభాగంలో 16 లక్షల చ.అ. మేర కార్యాలయ భవనాల లీజింగ్ జరగ్గా.. 2022 ఇదే సమయంలో 32 లక్షల చ.అడుగులకు పెరిగింది. పూర్తైన నిర్మాణాలు 53 లక్షల చ.అ.కు చేరాయి. వార్షిక వృద్ధి 62 శాతంగా ఉంది. అద్దెలు 3 శాతం పెరిగాయి.
దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో..
* గృహనిర్మాణంలో దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో తొలి ఆర్నెల్లలో 1,58,705 ఇళ్ల విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో వృద్ధిరేటు 60 శాతంగా నమోదైంది.
* దిల్లీలో 154 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్(95%), బెంగళూరు 80 శాతం, ముంబయి(55%), కోల్కతా(39%), పుణె(25%) చెన్నై (21%) నిలిచాయి.
* కార్యాలయ భవనాల లావాదేవీలు 2.53 కోట్ల చ.అ. విస్తీర్ణం మేర జరిగాయి. 107 శాతం వృద్ధి కన్పించింది.
మున్ముందు సవాళ్లు...
‘ఈ ఏడాది తొలి ఆరునెలలు మార్కెట్ బాగున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం, గృహ రుణ వడ్డీరేట్లు మున్ముందు మార్కెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడటం చాలా కీలకం. పెరిగిన జీవన వ్యయం, పెరుగుతున్న ఇళ్ల ధరలు, గృహరుణాల వడ్డీరేట్లు కొనుగోలుదారుల స్థోమతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది’ అని నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్ శిశిర్ బైజల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
గోద్రేజ్ విభజన.. షేర్ల బదిలీతోనే
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. -
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడాలనుకునే వారి కోసం గూగుల్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దీంతో ఇంగ్లిష్లో స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు.