Byjus: బైజూస్ విలువ 1 బిలియన్ డాలర్లే.. బ్లాక్రాక్ అంచనా!
Byjus: బైజూస్లో తమకున్న వాటాల విలువను లెక్కగడుతూ ఆ సంస్థ విలువను బ్లాక్రాక్ పెద్ద ఎత్తున కుదించింది.
బెంగళూరు: దేశీయ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ (Byju's) విలువను ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ బ్లాక్రాక్ గణనీయంగా తగ్గించి 1 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. బైజూస్లో తమకున్న వాటాలను లెక్కగడుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘టెక్క్రంచ్’ అనే వెబ్సైట్ పేర్కొంది.
బైజూస్ (Byju's) అంచనా విలువను బ్లాక్రాక్ కుదించడం ఇది తొలిసారేమీ కాదు. గత ఏడాది మార్చి త్రైమాసికంలో సంస్థ విలువను 8.4 బిలియన్ డాలర్లకు కుదిస్తున్నట్లు అమెరికా ఎస్ఈసీకి ఇచ్చిన ఫైలింగ్లో పేర్కొంది. అంతకుముందు 2022 డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్లకు తగ్గించింది. బైజూస్ ఒక్కో షేరు విలువను బ్లాక్రాక్ 2022 ఏప్రిల్లో 4,660 డాలర్లుగా అంచనా వేసింది. అదే ఏడాది డిసెంబర్ నాటికి దాన్ని 2,400 డాలర్లకు.. తాజాగా 210 డాలర్లకు కుదించింది. ఈ విషయంపై ఇప్పటి వరకు బ్లాక్రాక్గానీ, బైజూస్గానీ స్పందించలేదు.
బైజూస్ అంచనా విలువను బ్లాక్రాక్తో పాటు ఇతర ప్రముఖ సంస్థలు సైతం తగ్గిస్తూ వస్తున్నాయి. 2023 నవంబర్లో నెదర్లాండ్స్కు చెందిన ‘ప్రోసస్ ఎన్వీ’ ఈ ఎడ్టెక్ సంస్థ విలువను మూడు బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. బైజూస్లో ఈ కంపెనీకి 9.7 శాతం వాటాలున్నాయి. అంతకుముందు అమెరికాకు చెందిన బారన్ క్యాపిటల్ సైతం కంపెనీ విలువను 2023 జూన్ నాటికి 11.7 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.
బైజూస్ (Byju's) 2022 మార్చిలో 800 మిలియన్ డాలర్లు సమీకరించింది. ఆ సమయంలో కంపెనీ విలువను 22 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీంతో ఇది దేశంలోనే అత్యంత విలువైన స్టార్టప్గా నిలిచింది. క్రమంగా ఆన్లైన్ పాఠాలకు ఆదరణ తగ్గడంతో కంపెనీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. లాభాలు వచ్చే పరిస్థితి కనిపించకపోవటంతో ఆయా సంస్థలు కంపెనీ విలువను క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూనియన్ బ్యాంక్ లాభం రూ.3,328 కోట్లు
గత ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ రూ.3,328 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభంతో పోలిస్తే ఇది 18.36 శాతం ఎక్కువ. -
మన ల్యాబ్ తయారీ వజ్రాలు విదేశాల్లో మెరుస్తున్నాయ్
ల్యాబ్ తయారీ వజ్రాల (ఎల్జీడీ) ఎగుమతులు 2024-25లో 7-9 శాతం వృద్ధి చెంది 1500-1530 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,450-12,700 కోట్ల)కు చేరొచ్చని కేర్ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికితీసే వజ్రాలకు గిరాకీ మందకొడిగా ఉండటం ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. -
భారత కంపెనీల ఆదాయాల్లో వృద్ధి నెమ్మదించొచ్చు
గత ఆర్థిక సంవత్సరం(2023-24) జనవరి-మార్చి త్రైమాసికంలో భారత కంపెనీల ఆదాయాలు 4-6 శాతమే పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ నివేదిక వెల్లడించింది. కొవిడ్-19 పరిణామాల ప్రభావం నుంచి కంపెనీలు పుంజుకోవడం ప్రారంభమైన 2021 సెప్టెంబరు తర్వాత ఒక త్రైమాసికంలో ఇదే అత్యంత తక్కువ ఆదాయ వృద్ధి అని తెలిపింది. -
తొలి 100 రోజుల్లో ఇండియా ఏఐ మిషన్ ఆవిష్కరణ!
అధికారం చేపట్టిన ‘తొలి 100 రోజుల ప్రణాళిక’లో భాగంగా ‘ఇండియా ఏఐ మిషన్’ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆవిష్కరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని కింద 2024-25 ఏడాదికి రూ.1,000 కోట్లు కేటాయించొచ్చని ఒక అధికారిని ఉటంకిస్తూ ‘ఇన్ఫామిస్ట్’ తన కథనంలో పేర్కొంది. -
2024-25లో భారత వృద్ధి 7 శాతానికి పైనే
అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల్లో సానుకూలతలు, సాధారణానికి మించి వర్షపాతం అంచనాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైనే వృద్ధిని నమోదు చేయొచ్చని ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ ఎన్సీఏఈఆర్ అంచనా వేసింది. -
గ్రామ పంచాయతీల్లోకి ‘బీమా’ సేవలు
గ్రామ పంచాయతీలకు జీవిత, సాధారణ బీమా కంపెనీలు తమ సేవలను విస్తరించడం తప్పనిసరి చేస్తున్నట్లు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రకటించింది. ‘2047 కల్లా అందరికీ బీమా’ లక్ష్యాన్ని చేరడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. -
ఒమేగా హాస్పిటల్స్లో మోర్గాన్ స్టాన్లీకి వాటా
క్యాన్సర్ ఆసుపత్రులను నిర్వహిస్తున్న ఒమేగా హాస్పిటల్స్లో విదేశీ పెట్టుబడుల సంస్థ మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ దాదాపు రూ.600 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఈ సంస్థకు ఒమేగా హాస్పిటల్స్లో 15 శాతం వరకూ వాటా లభిస్తుంది. -
సీసీఎల్ ప్రోడక్ట్స్కు తగ్గిన లాభాలు
ఇన్స్టెంట్ కాఫీ తయారీ సంస్థ అయిన సీసీఎల్ ప్రోడక్ట్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.730 కోట్ల ఆదాయాన్ని, రూ.65.22 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.4.90గా నమోదైంది. -
ఏఐ ప్రాజెక్టులపై బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ దృష్టి
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బ్లూక్లౌడ్ సాఫ్ట్టెక్ సొల్యూషన్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.213.34 కోట్ల ఆదాయాన్ని, రూ.8.41 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
క్యాప్స్టన్ సర్వీసెస్ ఆకర్షణీయ ఫలితాలు
మ్యాన్ పవర్, స్టాఫింగ్ సేవల సంస్థ అయిన క్యాప్స్టన్ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి, నాలుగో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో ఈ సంస్థ రూ.521 కోట్ల ఆదాయాన్ని, రూ.12.57 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. -
కూల్ నుంచి అధునాతన కూలర్
కూల్ స్టైలిష్ ఫ్యాన్స్ సరికొత్త ‘డెజర్ట్ కూలర్ ఎక్సెల్ హెచ్1’ కూలర్ను తీసుకొచ్చింది. అధునాతన బీఎల్డీసీ మోటార్, రిమోట్ కంట్రోల్తో పనిచేసే ఫ్యాన్ విద్యుత్ను 65% వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇంటికి సరికొత్త స్టైల్, అందాన్ని తీసుకొస్తుందని వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(5)
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఐషర్ మోటార్స్ ఏకీకృత నికర లాభం రూ.1,070 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో లాభం రూ.906 కోట్లతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. అధిక విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. -
భారతీయ విలువలు చూసి ఆశ్చర్యపోయా.. జపాన్ కంపెనీ సీఈఓ
గత నెల రోజులుగా బెంగళూరులో ఉంటున్న టెక్ జపాన్ వ్యవస్థాపకుడు భారతీయ నాయకత్వం గురించి కొనియాడారు.