గ్రనేడ్‌ దాడి: జవాన్లకు తప్పిన ప్రమాదం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. బుధవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా.........

Published : 19 Nov 2020 02:18 IST

12మంది పౌరులకు గాయాలు

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకీ  హద్దుమీరిపోతున్నాయి. బుధవారం పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఆ ముష్కరులు గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డారు. అయితే, ఆ గ్రనేడ్‌ గురి తప్పి రహదారిపై పడటంతో 12మంది సాధారణ పౌరులకు గాయాలైనట్టు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని కొందరు ఉగ్రవాదులు కాకాపొరా చౌక్‌ సమీపంలో గ్రనేడ్‌‌ విసిరారన్నారు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించామన్నారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి ఉగ్రవాదులను పట్టుకొనేందుకు సోదాలు కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని