సైబర్ నేరాలకు చెక్ పెట్టనున్న పోలీసులు
ఇటీవలీ కాలంలో.. రాష్ట్రంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా కొత్తరకం సైబర్ నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి బహుమతులు, ఆఫర్లు అంటూ మోసం చేసే కేటుగాళ్ల సంగతి సరేసరి.
ఇంటర్నెట్ డెస్క్ : ఇటీవలి కాలంలో.. రాష్ట్రంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. రోజుకో తరహా కొత్తరకం సైబర్ నేరాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇక నకిలీ ఫోన్ నంబర్లను ఉపయోగించి బహుమతులు, ఆఫర్లు అంటూ మోసం చేసే కేటుగాళ్ల సంగతి సరేసరి. సైబర్ నేరాల గురించి ఎంత అవగాహన ఉన్నా చాలామంది వారి మాయలో పడుతూనే ఉంటారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, మరో కొత్త విధానంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అయితే వారికి చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు సమాయత్తమవుతున్నారు. మోసాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. నకిలీ ఫోన్ నంబర్లు ఉపయోగించి మోసాలు చేస్తున్నవారికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఆన్లైన్ మోసాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ముఖ్యంగా నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, ధ్రువపత్రాలు సరిగా లేకున్నా గంపగుత్తగా సిమ్ కార్డులను ఇస్తున్న మూడు నెట్వర్క్ కంపెనీలకు నోటీసులు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ తరహా మోసాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో 11వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు.
గత ఆరునెలల్లోనే నాలుగు రెట్లు అధికంగా...
సైబర్ నేరగాళ్లు ఎక్కువగా హరియాణా, దిల్లీ, కోల్కతాలో నకిలీ ధ్రువప్రతాలు పెట్టి సిమ్కార్డులు తీసుకుంటారు. ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకు వాహనాలు ఇతరత్రా వస్తువులు ఇస్తామంటూ, డబ్బులు పంపించాలని ఫోన్లు చేస్తుంటారు. తీరా ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించాకా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది. రాజస్థాన్కు చెందిన ఓ ముఠా ఈ విధమైన మోసాల్లో ఏకంగా సైనికాధికారుల ఫొటోలను, పేర్లను ఉపయోగిస్తోంది. మొత్తం 18 రాష్ట్రాలలో ఈ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల్లోనే ఈ తరహా నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని నేరపరిశోధన సంయుక్త కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఓఎల్ఎక్స్ కంపెనీకీ తాఖీదులు పంపుతామని పోలీసులు వివరించారు. చిరునామా వివరాలు లేకుండా ప్రకటనలు జారీ చేస్తూ, నేరస్థులకు పరోక్షంగా సహకరిస్తున్నారని ఈ కంపెనీ ప్రతినిధులకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?