Nizamabad: చదువుకోవాలని చెప్పినందుకు.. డిగ్రీ విద్యార్థిని హత్య చేసిన ఇంటర్‌ స్టూడెంట్స్‌

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది.

Updated : 04 Mar 2024 10:21 IST

బోధన్‌ పట్టణం: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని బీసీ వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. చదువుకోవాలని సూచించిన డిగ్రీ విద్యార్థి వెంకట్‌ను ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బోధన్‌ పట్టణంలోని బీసీ వసతి గృహంలో డిగ్రీ విద్యార్థి వెంకట్‌ (19) స్టడీ అవర్‌ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నాడు. ఆదివారం రాత్రి పలువురు ఇంటర్‌ విద్యార్థులు చదువుకోకుండా మాట్లాడుతున్నారు. పరీక్షలు ఉన్నాయని.. మాట్లాడకుండా చదువుకోవాలని అతడు వారికి సూచించాడు. ఇది నచ్చని ఆరుగురు విద్యార్థులు రాత్రి గదిలో నిద్ర పోతున్న వెంకట్‌పై దాడి చేసి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. గదిలో నుంచి శబ్దాలు రావడంతో వసతి గృహంలోని మిగతా విద్యార్థులు అక్కడికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న వెంకట్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని