మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది.
లీజుల ఈ-వేలం సెక్యూరిటీ డిపాజిట్ను ఓ ఖాతాలోకి మళ్లించి.. వాడేసుకున్నారు
నలుగురి అరెస్ట్... పరారీలో మరొకరు
అత్యంత గోప్యంగా ఉంచిన విజయవాడ నగర పోలీసులు
ఈనాడు, అమరావతి: గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. కొన్ని నెలలుగా ఈ దందా సాగినా గనులశాఖ సంచాలకుని కార్యాలయ అధికారులు గుర్తించలేక పోయారు. ఈ-వేలం డిపాజిట్ను వెనక్కి ఎందుకు ఇవ్వలేదని ఓ లీజుదారుడు అడగడంతో బాగోతం వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా దీనిపై విజయవాడ పోలీసులు విచారణ సాగిస్తున్నా, ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసినా.. ఎటువంటి సమాచారమూ బయటకు రాకుండా రహస్యంగా ఉంచడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మైనింగ్ లీజులకు ఈ-వేలం నిర్వహించినప్పుడు.. అందులో పాల్గొనేవారు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఈ-వేలంలో ఎల్-1గా నిలిచిన గుత్తేదారుకు లీజును ఖరారుచేసి, ఎల్వోఏ జారీచేశాక.. అతడు వేలంలో కోట్ చేసిన మొత్తాన్ని చెల్లించాలి. తర్వాత ఆ లీజుదారుడితోపాటు, వేలంలో పాల్గొన్న వారు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇచ్చేస్తారు. ఇలా కొందరికి వెనక్కి ఇవ్వాల్సిన రూ.5 కోట్లను.. గనులశాఖ ఖాతా నుంచి గుంటూరుకు చెందిన ఓ ఇసుకు గుత్తేదారు ఖాతాలోకి మళ్లించినట్లు సమాచారం. గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో ఈ-వేలం విభాగం, ఐటీ విభాగాల పొరుగుసేవల ఉద్యోగులే ఇదంతా చేసినట్లు తెలిసింది. ఇసుక గుత్తేదారు ఖాతాలోకి వెళ్లిన సొమ్మును, మరో బ్యాంక్ ఖాతా తెరిచి అందులోకి మళ్లించి వాడేసుకున్నారని సమాచారం.
లీజుదారుడి ఫిర్యాదుతో వెలుగులోకి
ఈ-వేలంలో పాల్గొన్న విజయనగరానికి చెందిన ఒకరికి.. లీజు దక్కలేదు. సెక్యూరిటీ డిపాజిట్గా చెల్లించిన సొమ్మును సిబ్బంది ఎంత కాలమైనా వెనక్కి ఇవ్వలేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని గనులశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం జరిగిందా... అని అధికారులు ఆరా తీశారు. కంప్యూటర్ ఆపరేటర్లు సొమ్మును దారి మళ్లించినట్లు గుర్తించారు. దీనిపై ఇబ్రహీంపట్నంలోని పోలీసులకు వారం కిందట ఫిర్యాదు అందింది. విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఈ కేసు విచారణ చేయిస్తున్నట్లు తెలిసింది. సొమ్ము స్వాహాకు గురైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితుల బ్యాంకు ఖాతాల్ని పరిశీలించి.. వారు ఖర్చుచేయని కొంత సొమ్మును ఫ్రీజ్ చేయించారు. బాధ్యులైన ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిని అరెస్ట్చేశారు. గుంటూరుకు చెందిన ఇసుక గుత్తేదారును, అతనికి సహకరించిన మరొకరిని అరెస్ట్చేసి... నలుగురినీ రిమాండ్కు పంపారు.
అవినాష్రెడ్డి సిఫారసుతో చేరి..
ఈ బాగోతంలో కీలక పాత్ర పోషించిన ప్రొద్దుటూరుకు చెందిన మరో పొరుగు సేవల ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతను కడప ఎంపీ అవినాష్రెడ్డి సిఫారసుతో గతంలో ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో చేరాడు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల సిఫారసులతో గతంలో అవసరం లేకపోయినా వందల సంఖ్యలో పొరుగుసేవలు, కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగుల్ని నియమించారు. ఇప్పుడు రూ.5 కోట్లు స్వాహాచేసిన వారు అలా నియమితులైనవారే. వీరంతా ఏపీఎండీసీ నుంచి డిప్యుటేషన్పై వచ్చి గనులశాఖ సంచాలకుని కార్యాలయంలో పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
జిల్లాలోని కర్నూలు మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు ట్రాన్స్జెండర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. -
సీఎం సభకు జనసమీకరణ పేరిట ఎమ్మెల్యేకు టోకరా
పథకాల పేరు చెప్పి ప్రజాప్రతినిధులను మోసగిస్తున్న ఒక నిందితుడిని హైదరాబాద్ సైబర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత తెలిపిన వివరాల ప్రకారం.. -
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
రద్దీ కారణంగా ఆర్టీసీ బస్సు ఫుట్బోర్డుపై నిల్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తు వెనక టైరు కిందపడి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. -
పెళ్లింట తీవ్ర విషాదం
పెళ్లి ముహూర్తం దగ్గర పడటంతో దుస్తులు కొనుగోలు చేయడానికి కుటుంబ సభ్యులందరూ అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లారు. రోజంతా షాపింగ్ చేసి రాత్రికి తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే అలసిపోవడంతో అందరూ నిద్రపోయారు. -
మానవ అక్రమ రవాణా.. ఆపై సైబర్ నేరాలు
విదేశాల్లో ఉద్యోగాలు.. లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. -
దివ్యాంగురాలైన తల్లి.. ఇద్దరు కూతుళ్లను కడతేర్చిన కిరాతకుడు
భార్య చనిపోయిన కొద్దిరోజులకే మరో వివాహం చేసుకొని ఊరి నుంచి వెళ్లిపోవడంతో పాక్షిక అంధురాలైన తల్లే అతని ఇద్దరు కూతుళ్లను చేరదీశారు. వారిని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిస్తూ తనకొచ్చే పింఛను, రైతుబంధుతో జీవితం సాగించేవారు. -
బస్సులో 9 మంది సజీవ దహనం
హరియాణాలోని నూహ్ జిల్లా ధులావత్ గ్రామం సమీపంలో కుండ్లి-మనేసర్- పల్వాల్(కేఎంపీ) ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. -
ఫోన్లోనే ట్రిపుల్ తలాక్.. నిందితుడిపై కేసు నమోదు
తన మొదటి భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పిన నిందితుడిపై ఆదిలాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో శనివారం కేసు నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్