Crime News: ట్రీట్మెంట్ చేస్తుంటే.. వైద్యురాలిని చంపిన రోగి: కేరళలో దారుణం
కేరళలో బుధవారం దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. చికిత్స చేస్తోన్న వైద్యురాలు రోగి చేతిలో హత్యకు గురయ్యారు. (Doctor Stabbed to Death)
తిరువనంతపురం: చికిత్స చేస్తూ రోగి చేతిలో ఓ యువ వైద్యురాలు దారుణహత్యకు గురయ్యారు. డ్రెస్సింగ్ చేస్తోన్న వైద్యురాలిపై ఆ వ్యక్తి ఒక్కసారిగా దాడిచేసి పొడిచి చంపేశాడు. కేరళ(Kerala)లోని కొట్టరక్కర ప్రాంతంలోని తాలుకా ఆసుప్రతిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..(Doctor Stabbed to Death)
కొట్టరక్కరలోని ఆసుపత్రిలో వైద్యురాలు వందనాదాస్(22) హౌస్ సర్జన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం మెడికల్ చెకప్లు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా కాలి గాయంతో ఉన్న నిందితుడికి డ్రెస్సింగ్ చేస్తున్నారు. ట్రీట్మెంట్ సమయంలో అతడు ఉన్నట్టుండి ఆగ్రహానికి గురయ్యాడు. రెచ్చిపోయి అక్కడున్న వైద్య పరికరాలతో అందరిని భయభ్రాంతులకు గురిచేశాడు. దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో యువ వైద్యురాలిని పొడవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనకు ముందు నిందితుడు తన కుటుంబసభ్యులతో ఘర్షణపడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాంతో ఈ దాడిలో ఓ పోలీసు కూడా గాయపడ్డాడు. మరోపక్క దీనిపై భారత వైద్య మండలి(IMA) ఆందోళన వ్యక్తం చేసింది. 24 గంటలపాటు రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం అంతరాయం ఉండదని తన ప్రకటనలో పేర్కొంది.
హైకోర్టు దిగ్భ్రాంతి.. ప్రభుత్వ వైఫల్యమంటూ ఆగ్రహం
వైద్యురాలి హత్యపై కేరళ హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేసి ఈ కేసును అత్యవసరంగా విచారించింది. ‘ఇది పూర్తిగా వ్యవస్థ లోపం. ఒక వ్యక్తి అసాధారణంగా ప్రవర్తిస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు అతడిని అదుపులో ఉంచాలి. అనూహ్య ఘటనలు మీరు ఊహించగలగాలి. అలా లేనప్పుడు పోలీసుల అవసరం ఏముంది..? ఈ ఘటన వైద్యులు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఒక భయాన్ని సృష్టించింది. ఇప్పుడు వైద్యులు సమ్మెకు దిగారు. దీనివల్ల ఏ రోగికైనా ఏదైనా జరిగితే డాక్టర్లను నిందించగలమా..?’ అని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు విభాగాన్ని గట్టిగా మందలించింది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ప్రస్తుతం అతడు సస్పెండ్ అయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేగింది. కళాశాల విద్యార్థుల నుంచి రూ.5లక్షల విలువైన 80 గ్రాముల మాదక ద్రవ్యాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కేపీహెచ్బీలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని కేపీహెచ్బీ వద్ద చోటు చేసుకుంది. -
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
తమ చెల్లెలు ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని సోదరులు (పెదనాన్న కుమారులు) పగతో రగిలిపోయారు. పెద్ద మనుషులు విధించిన జరిమానా చెల్లించలేదన్న సాకుతో బావను కర్కశంగా కడతేర్చారు. -
మంటల్లో చిక్కుకుని రైతు మృతి
పొలంలోని వరి కొయ్యలు కాల్చేందుకు నిప్పుపెట్టిన రైతు ప్రమాదవశాత్తు ఆ మంటల్లోనే చిక్కుకుని మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పోత్నూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. -
వాణిజ్య పన్నులశాఖలో ఐదుగురు అధికారుల అరెస్టు
జీఎస్టీ ఎగవేతలకు సహకరిస్తూ అవినీతికి పాల్పడిన ఐదుగురు అధికారులను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేయడం వాణిజ్య పన్నులశాఖలో సంచలనం సృష్టించింది. -
43,200 సీసాల గోవా మద్యం పట్టివేత
గోవా నుంచి రాష్ట్రానికి భారీగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్లో రూ.25 కోట్ల ఆభరణాల స్వాధీనం
ముంబయి నుంచి హైదరాబాద్కు అక్రమంగా తరలిస్తున్న 34.78 కిలోల బంగారు, 43.60 కిలోల వెండి ఆభరణాలను శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పట్టుకుంది. -
మార్ఫింగ్ కేసులో ఐదుగురికి బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యల మార్ఫింగ్ వీడియో కేసులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన సభ్యులు ఐదుగురిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు ప్రకటించారు. -
ప్రియురాలి ఇంటికి పార్సిల్బాంబు.. ఆమె భర్త, కుమార్తె మృతి
గుజరాత్లోని వడాలిలో ఓ వివాహిత ఇంటికి ఆమె ప్రియుడు పార్సిల్ బాంబు పంపాడు. అది పేలడంతో ఆమె భర్త, కుమార్తె మరణించారు. జీతూభాయ్ హీరాభాయ్ వంజారా(32) అనే వ్యక్తి కుటుంబం వడాలిలో ఉంటోంది.
తాజా వార్తలు (Latest News)
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్భూషణ్ హడావుడి
-
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్