కామారెడ్డి జిల్లాలో దారుణం.. బాలికను మంటల్లోకి విసిరేసిన తండ్రి
ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములో విసిరేసిన ఘటన బీర్కూర్ మండలంలోని బరంగెడ్గిలో ఆదివారం చోటుచేసుకుంది.
బీర్కూర్: ఓ వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తెను కాలుతున్న గడ్డివాములో విసిరేసిన ఘటన బీర్కూర్ మండలంలోని బరంగెడ్గిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరంగెడ్గి గ్రామానికి చెందిన దేశాయిపేట్ సాయిలుకు ఇద్దరు కుమార్తెలున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో చిన్నారులు ఇంటి పక్కనే ఆడుకుంటున్నారు. అదే సమయంలో వీరి ఇంటి పక్కనే ఉన్న గొట్టల గంగాధర్కు చెందిన గడ్డివాముకు నిప్పంటుకుని దగ్ధమైంది. ‘మీ కుమార్తె అంకిత మా గడ్డివాముకు నిప్పటించింది’ అంటూ గంగాధర్.. సాయిలుతో గొడవ పడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయిలు కోపంతో తన కుమార్తె అంకితను కాలుతున్న గడ్డి వాములోకి విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన గంగాధర్ గడ్డివాములోకి దూకి పాపను రక్షించాడు. రెండు కాళ్లు, చెయ్యి కాలడంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?