జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 03 Jan 2020 00:52 IST

ఏడుగురు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో పూంచ్‌లోని సురాన్‌కోట్‌ నుంచి జమ్మూకు బయలు దేరిన బస్సు రాజౌరీలోని లంబేరీ వద్ద అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 7గురు మరణించగా.. 24 మంది గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని వారు భావిస్తున్నారు. విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలం జమ్మూకు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు