గుర్రపు పందేల్లో అపశ్రుతి

విజయనగరం జిల్లా వేపాడలో జాతర సందర్భంగా నిర్వహించిన గుర్రపు పందేల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మరిడిమాంబ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుర్రపు పందెం పోటీలు నిర్వహించారు.

Published : 29 Jan 2020 00:40 IST

విజయనగరం: విజయనగరం జిల్లా వేపాడలో జాతర సందర్భంగా నిర్వహించిన గుర్రపు పందేల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మరిడిమాంబ జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గుర్రపు పందెం పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటీలు ప్రారంభం కాగానే జోరందుకున్న ఓ గుర్రం జనసందోహం పైకి దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో జనం అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో స్థానికులు ఒకరిమీద ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో శ్రీరాములు, వెంకినాయుడు గాయపడ్డారు. శ్రీరాములుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శృంగవరపుకోట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తలకి బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావంతో శ్రీరాములు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని