Crime News: రూ.50 ఇచ్చి బాలికపై అత్యాచారం

కూతురు వయసున్న బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(11) గతనెల 31న పాఠశాల నుంచి

Updated : 06 Apr 2022 07:39 IST

మేడ్చల్‌, న్యూస్‌టుడే: కూతురు వయసున్న బాలికపై ఆటోడ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి వివరాల ప్రకారం.. మండంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(11) గతనెల 31న పాఠశాల నుంచి మధ్యాహ్నం నడుచుకొంటూ ఇంటికెళ్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నాసారపు వెంకటేష్‌ (51) బాలికకు రూ.50 ఇచ్చి తన ఆటోలో తీసుకెళ్లి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబికులు సోమవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని