వైకాపా నాయకుడి బార్‌లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్‌ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.

Published : 26 Apr 2024 03:18 IST

అల్లూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్‌ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. వైకాపా నాయకుడు, అల్లూరు మండల పరిషత్తు ఉపాధ్యక్షుడు సురేంద్ర స్థానికంగా లవీ డమీ పేరుతో బార్‌ నిర్వహిస్తున్నారు. అందులో మద్యం నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో సెబ్‌ అధికారులు నాగమల్లేశ్వర్‌రెడ్డి, బాబుశ్రీధర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది గురువారం వేకువజామున దాడులు చేశారు. రూ.1.30 కోట్ల విలువైన 78 వేల మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు బార్‌ సమీపంలో మరో 272 సీసాలు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని