గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు

గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.

Published : 26 Apr 2024 03:17 IST

ఈనాడు, అమరావతి: గులకరాయి కేసులో నిందితుడు సతీష్‌కుమార్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. మూడు రోజుల పోలీసు కస్టడీకి విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు గురువారం ఉదయం విజయవాడలోని జిల్లా కారాగారానికి వెళ్లి నిందితుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం నిందితుడిని సింగ్‌నగర్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ తండ్రి చిన్న దుర్గారావు, న్యాయవాది సలీం సమక్షంలో సాయంత్రం వరకు విచారణ జరిగింది. తొలి రోజు విచారణలో.. రాయి విసిరిన ఘటన వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? ఎవరు చెబితే చేశావు వంటి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని