Tirumala : టికెట్లు లేకుండా శ్రీవారి దర్శనం.. పట్టుబడ్డ కానిస్టేబుల్‌

భక్తులను అక్రమంగా శ్రీవారిని దర్శనానికి పంపుతున్న ఎస్పీఎఫ్‌  కానిస్టేబుల్‌ను తితిదే విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు బుధవారం పట్టుకున్నారు.

Published : 16 Nov 2022 12:53 IST

తిరుమల : భక్తులను అక్రమంగా శ్రీవారిని దర్శనానికి పంపుతున్న ఎస్పీఎఫ్‌  కానిస్టేబుల్‌ను తితిదే విజిలెన్స్‌ వింగ్‌ అధికారులు బుధవారం పట్టుకున్నారు. గత కొన్ని రోజులుగా ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కొంతమందితో కలిసి  భక్తుల నుంచి నగదు తీసుకుని టికెట్లు లేకుండా శ్రీవారి దర్శనానికి పంపుతున్నాడు. ఈ విషయాన్ని నిఘా అధికారులు గుర్తించి భక్తుల నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని