సంక్షిప్త వార్తలు (2)
మావోయిస్టులు పాతిపెట్టిన 51 ఐఈడీలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటన ఝార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో జరిగింది.
51 ఐఈడీలను స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది
ముగ్గురికి గాయాలు, ఝార్ఖండ్లో ఘటన
చాయీబాసా: మావోయిస్టులు పాతిపెట్టిన 51 ఐఈడీలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటన ఝార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో జరిగింది. ఇక్కడి మేరాల్గారా గ్రామ సమీపంలో ఉన్న అడవిలో మావోయిస్టు సభ్యులు సమావేశమయ్యారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ జవానులు గురువారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఐఈడీ ఒకటి పేలడంతో ముగ్గురు జవానులు గాయాలపాలయ్యారు. దీంతో ఆ ప్రదేశంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన సిబ్బంది 51 ఐఈడీలను గుర్తించి అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. గాయపడిన వారిని ఎయిర్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.
దిల్లీ జైళ్లలో 348 మొబైల్ ఫోన్లు స్వాధీనం
దిల్లీ: దేశ రాజధానిలోని వివిధ జైళ్లలో గత రెండున్నర నెలల కాలంలో జరిపిన దాడుల ద్వారా 348 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నట్లు జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ గురువారం మీడియాకు వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే జైల్ నంబర్-3లో నిర్వహించిన దాడుల్లో 18 ఫోన్లు, ఛార్జర్లు, నాలుగు చాకులు, రెండు ఐరన్రాడ్లు, ఓ సర్జికల్ బ్లేడు, చేతితో తయారుచేసిన హీటర్లు రెండు, విద్యుత్తు వైర్లు పట్టుబడ్డాయన్నారు. జైళ్లలో అంతర్గత నిఘా పెంచాక, సూపరింటెండెంట్లు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఖైదీలకు ఫోన్ల చేరవేతలో సిబ్బంది హస్తముంటే కఠినచర్యలు కొనసాగిస్తామని డీజీ చెప్పారు. దీన్దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం కింద 1,020 మంది ఖైదీలకు పర్యాటక, ఆతిథ్య రంగాల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద మరో వెయ్యి మందికి అత్యాధునిక దుస్తులు కుట్టడంలో నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?