Andhra News: సారూ.. మేమెక్కడ తాగాలో మీరే చెప్పండి.. ఎస్సైతో మందుబాబుల వాగ్వాదం

‘సారూ.. మద్యం దుకాణం వద్ద తాగొద్దంటిరి. సమీపంలోని ఇతర దుకాణాల వద్దా వీల్లేదంటిరి. ఇంటికిపోతే మా పెళ్లాలు ఇంట్లో తాగొద్దంటున్నారు.

Updated : 15 Feb 2023 10:09 IST

వాకాడు, న్యూస్‌టుడే: ‘సారూ.. మద్యం దుకాణం వద్ద తాగొద్దంటిరి. సమీపంలోని ఇతర దుకాణాల వద్దా వీల్లేదంటిరి. ఇంటికిపోతే మా పెళ్లాలు ఇంట్లో తాగొద్దంటున్నారు. ఇంకెక్కడ తాగాలో మీరే చెప్పండి సారూ..’ అంటూ కొందరు మందుబాబులు ఎస్సై ఎదుట నిరసన తెలిపారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి తిరుపతి జిల్లా వాకాడులో చోటుచేసుకుంది. స్థానిక అశోకస్తంభం వద్ద మద్యం దుకాణం నిర్వహిస్తుండగా సమీప శీతల పానీయాల దుకాణాల్లో, చర్చికి వెళ్లే మార్గంలో కొందరు మద్యం తాగుతున్నారు. వారితో ఎదురవుతున్న ఇబ్బందులపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై రఘునాథ్‌ స్పందించి అక్కడికి వచ్చి మందలించారు. దీంతో మందుబాబులు ఆయనతో వాదనకు దిగారు. అక్కడినుంచి వెళ్లకపోతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించి వారిని పోలీసులు పంపించేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు