వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగుల అరెస్టు
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు బుధవారం అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది.
అందులో ఒకరు ఆ శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం నేత
నేడు శాఖాపరమైన అంశాలపై సంఘాలతో ఉన్నతాధికారుల భేటీ
ఈలోగానే అనూహ్య పరిణామాలు
ఉద్యోగుల సమస్యలపై ఉద్యమిస్తున్నందునే ప్రభుత్వ కక్షసాధింపన్న నేతలు
ఈనాడు- అమరావతి, న్యూస్టుడే - విజయవాడ (విద్యాధరపురం): ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారన్న ఫిర్యాదు మేరకు వాణిజ్య పన్నుల శాఖలోని నలుగురు ఉద్యోగులను పోలీసులు బుధవారం అరెస్టు చేయడం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వానికి, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘానికి మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ అరెస్టులు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వాణిజ్య పన్నుల శాఖలో నాలుగు జోన్లను మూడింటికి కుదించడం, శాఖాపరమైన మార్పుచేర్పులను ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన రీ ఆర్గనైజేషన్ (పునర్ వ్యవస్థీకరణ-2) అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలతో గురువారం వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్టులు చర్చనీయాంశమయ్యాయి. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తాము ఉద్యమం చేస్తుండటంతో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్టులని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆరోపించారు. అరెస్టు చేసిన వారి ఆచూకీ తెలియడం లేదని.. కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గుడివాడలో ఒకరు, విజయవాడలో ముగ్గురు
వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ సంధ్యను గుడివాడలో పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్య సమస్యలతో సెలవులో ఉన్న మెహర్కుమార్ను ఇంటి వద్ద, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ చలపతి, విజయవాడ-1 డివిజన్ కార్యాలయంలో అటెండర్ సత్యనారాయణను కార్యాలయాల్లో అరెస్టు చేశారు. ఈ పరిణామాలు సహచర ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. అరెస్టయినవారిలో మెహర్కుమార్ వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి కాగా మిగిలిన వారు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘంలో సభ్యులు. వీరిని విజయవాడలోనే అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారు..
‘నిందితులు స్వలాభం కోసం వ్యాపార సంస్థలపై తనిఖీలు చేసి, తప్పుడు రికార్డులు సృష్టించి లబ్ధి పొందారు. పంపిణీ రిజిస్టర్లలోనూ తప్పుడు లెక్కలు నమోదు చేసి, ఏపీ జీఎస్టీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారు. డీలర్లు, ఏజెన్సీలు, వ్యక్తుల ఆదాయాన్ని తక్కువగా చూపిస్తూ.. పన్నును తగ్గించి, వసూలు చేశారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి.. డీలర్లు, ఏజెన్సీల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. సంబంధిత రికార్డులను మాయం చేశారు. ఈఎస్ఐ, నీరు- చెట్టు, తదితర కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం కోసం తనిఖీ నిమిత్తం ఆడిటర్లను పిలిచి, ఆ ఫైళ్లను మూసివేయడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేశారు. పన్ను ఎగవేతదారుల నుంచి డబ్బు తీసుకుని, జరిమానా విధించకుండా వదిలేశారు. దీంతోపాటు డీలర్లు సమర్పించిన డేటాకు, పంపిణీ రిజిస్టర్లలోని వివరాలకు వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించాం’ అని కమిషనర్ కాంతిరాణా టాటా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారంలో గతంలోనే వీరు సస్పెండయ్యారు. అప్పటి నుంచి అంతర్గతంగా విచారణ సాగుతోంది. ఇటీవల ఒక్కొక్కరు విధులకు హాజరవుతున్నారు. వాణిజ్య పన్నుల శాఖలోని విజయవాడ-1 డివిజన్కు జాయింట్ కమిషనరుగా రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఓ ఐఏఎస్ అధికారిని గత నెలలో నియమించింది. ఈ డివిజన్ కేంద్రంగా కొద్దికాలం నుంచి ఉద్యోగ సంఘాలు, వాణిజ్య పన్నుల శాఖలోని పలువురు ఉన్నతాధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. దీర్ఘకాలికంగా ఇక్కడే పనిచేస్తున్నారంటూ పలువురుని ప్రభుత్వం బదిలీ చేయడంతో ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ‘స్టే’ పొందారు.
హక్కుల కోసం పోరాడుతున్నందుకే అరెస్టులు
ఒకటో తేదీన జీతాలివ్వాలని గవర్నర్ను కలిసినందుకే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఉద్యోగులను వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ ఆరోపించారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు నలుగురిని కారణం కూడా చెప్పకుండానే పోలీసులు తీసుకెళ్లిపోయారన్నారు. విజయవాడలో సూర్యనారాయణ బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఉద్యోగుల హక్కుల కోసం మేం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకే.. ఏపీజీఈఏకి చెందిన సంధ్యారాణి, మెహర్కుమార్, చలపతి, సత్యనారాయణలను వారి కార్యాలయాల్లో అరెస్టు చేశారు. రెండేళ్ల క్రితం వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఒక పత్రికలో వార్త వస్తే.. దానిని పట్టుకుని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఆ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించగా.. సస్పెన్షన్ను కొట్టేసింది. ప్రస్తుతం వారంతా విధి నిర్వహణలో ఉండగా అరెస్టు చేశారు. కనీసం ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళుతున్నారో కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడమేంటి? హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం’ అని అన్నారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కార్రావు, సంఘం నాయకులు, బాధిత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా కల.. ఇలా
జాతీయ పరీక్షల విభాగం(ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటిన విషయం తెలిసిందే. -
రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి గురువారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.165.91 కోట్ల విలువైన సొత్తు (నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. -
వైకాపా ర్యాలీ వచ్చే.. ప్రజలు హడలే!
ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి దద్దాల నారాయణ నామినేషన్ ర్యాలీతో గురువారం ప్రజలు విలవిల్లాడారు. -
అబ్బాయిగారి ‘దందా’లూరు!
కాలువల్లో మట్టి నుంచి కొల్లేరులో చెరువుల వరకు.. ఆయన దృష్టిలో కాదేదీ దోపిడీకి అనర్హం ... కనిపించిన ప్రతి వనరునూ కొల్లగొట్టేశారు. -
బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?
నంద్యాల జిల్లా డోన్ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
వెన్నెముక అన్నారు.. వెన్ను విరిచారు!
నమ్మకంగా మాటలు చెప్పడం.. అవసరం తీరాక నయవంచనకు గురిచేయడం.. ఇది జగన్ నైజం. గత ఐదేళ్లూ వెనకబడిన వర్గాలకు ఆయన చేసింది ఇదే. -
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి (స్టేటస్ కో) పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
కార్టూన్
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్ల మార్పిడికి రిజర్వు బ్యాంక్ అవకాశం కల్పించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబరు 7 నుంచి రూ.2 వేల నోట్ల మార్పిడిని నిలిపివేసిన విషయం తెలిసిందే. -
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
గులకరాయి విసిరిన ఘటనలో ఈ నెల 13న సీఎం జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు వెంటనే ఆయన ప్రచార వాహనంలోనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. -
పిచ్చి మందుతో ‘తుచ్ఛమైన దోపిడీ’
‘‘కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి’’ అని అధికారంలోకి రాకముందు జగన్ మొసలి కన్నీరు కార్చారు. -
రైతన్నకు ‘రంపపు కోత!’
ప్రభుత్వం ఏదిస్తే అది తీసుకోవాలి. లేదంటే నోరుమూసుకుని కూర్చోవాలి. కాదని ఎవరైనా ప్రశ్నించారా? వైకాపా నేతలు, అధికారులు... ఇళ్లముందు వాలిపోయి వాళ్లసలు రైతులే కాదని తేల్చేస్తారు. -
బ్యాండేజ్ తియ్యకపోతే సెప్టిక్ అవుతుంది
సీఎం జగన్ నుదుటిపైన గాయానికి బ్యాండేజ్ వేసుకోవడం మంచిది కాదని, వైద్యురాలిగా సలహా ఇస్తున్నానని ఆయన చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె, డాక్టర్ సునీత పేర్కొన్నారు. -
చిన్నాన్నను చంపినోళ్లను కాపాడటం తగునా జగన్?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ ఆవేదనతో సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. -
‘మట్టి’లో కలుస్తున్న పోలవరం కాల్వ!
మట్టి అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు కరగడమే కాకుండా.. పోలవరం కాల్వ కూడా ప్రమాదంలో పడింది. -
‘మిత్ర’ ద్రోహం!
‘కల్యాణమిత్రలు, బీమామిత్రలను కచ్చితంగా కొనసాగిస్తాం... వేతనాలూ పెంచుతాం’ అని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి రాగానే నిర్ధాక్షిణ్యంగా వారిని తొలగించేశారు. -
పచ్చటి జిల్లాకు పసుపు బొట్టు!
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎన్డీయే కూటమి అభ్యర్థుల నామినేషన్ల సందర్భంగా పార్వతీపురం, సాలూరు పట్టణాలు పసుపు మయమయ్యాయి. -
ఏయూలో ‘ఎచీవర్స్’డే రద్దు!
ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించదలచిన ‘ఎచీవర్స్ డే’ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం ఎన్నికల అధికారి(ఆర్ఓ)మయూర్ అశోక్ అనుమతి రద్దు చేశారు. -
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి
విశాఖ స్టీల్ప్లాంటు ప్రయోజనాలను పరిరక్షించడమే తమకు ముఖ్యమని హైకోర్టు వ్యాఖ్యానించింది. బొగ్గు సరఫరా లేక ప్లాంటు మూతపడే పరిస్థితి రావడం దురదృష్టకరమని పేర్కొంది. -
ఆంధ్రా పేపరుమిల్లు లాకౌట్ ఎత్తివేత
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపరు మిల్లు లాకౌట్ ఎత్తివేశారు. యాజమాన్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో గురువారం కలెక్టరేట్లో జిల్లా ఉన్నతాధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. -
ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) పది, ఇంటర్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ గురువారం విడుదల చేశారు.