బీరువాలో నగలు.. నగదు.. ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు చోరీ..

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో తాళం వేసిన ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. నగదు, ఆభరణాలతోపాటు ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.

Updated : 12 Jul 2023 06:08 IST

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలో తాళం వేసిన ఇంట్లో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. నగదు, ఆభరణాలతోపాటు ఫ్రిడ్జ్‌లోని కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోవడం అందరిని విస్మయానికి గురి చేసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని గౌడ్స్‌కాలనీకి చెందిన మున్సిపల్‌ ఉద్యోగి రఫీ కుటుంబం సోమవారం సాయంత్రం ఇంటికి తాళం వేసి సిద్దిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున తిరిగొచ్చి చూసేసరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఉంది. లోనికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.1.28 లక్షల నగదు, 12 తులాల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఫ్రిడ్జ్‌ తెరిచి ఉండటంతో అందులో పరిశీలించగా కిలో టమాటాలు కూడా ఎత్తుకుపోయినట్లు గుర్తించారు. బాధితుడు రఫీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పీటర్‌, క్లూస్‌ టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని