Gudivada: ఆలయ శిఖరం పైనుంచి కిలో బరువున్న బంగారు కలశం అదృశ్యం

కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైంది.

Updated : 27 Aug 2023 08:03 IST

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైంది. ఆలయ గోపురాలపై ఉన్న రెండు శిఖరాలకు ధర్మకర్తలు 12 ఏళ్ల క్రితం బంగారు కలశాలను ఏర్పాటు చేశారు. ఈ కలశాలు ఒక్కొక్కటి కిలోకుపైగా బరువు ఉంటాయని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆలయాన్ని పర్యవేక్షించే వ్యక్తి అమ్మవారి గోపుర శిఖరంపై ఉండాల్సిన బంగారు కలశం కనిపించకపోవడాన్ని గుర్తించి ధర్మకర్తలకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్సై సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆలయం పైవరకు మర్రి చెట్టు విస్తరించి ఉండటంతో ఈదురు గాలులకు కొమ్మలు కలశానికి తగులుతున్నట్లు ఇటీవల ఆలయ నిర్వాహకులు గుర్తించారు. ఒకవేళ గాలులకు కలశం విరిగిపోతేే కోతులు పడేసి ఉంటాయని.. దాన్ని ఎవరైనా పట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని