నీళ్ల కోసం గొడవ.. గాలిలో కలిసిన ప్రాణం
నీళ్ల కోసం జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. దిల్లీలోని భీకం సింగ్ కాలనీలో ఇరుగుపొరుగున నివసించే రెండు కుటుంబాలకు ఉమ్మడి కొళాయి ఉంది.
దిల్లీలో మహిళను కత్తితో పొడిచిన బాలిక
దిల్లీ: నీళ్ల కోసం జరిగిన గొడవ ఓ మహిళ ప్రాణం తీసింది. దిల్లీలోని భీకం సింగ్ కాలనీలో ఇరుగుపొరుగున నివసించే రెండు కుటుంబాలకు ఉమ్మడి కొళాయి ఉంది. శుక్రవారం సాయంత్రం నీళ్లు పట్టుకొనే విషయంలో సోని(34) అనే మహిళకు, పక్కింట్లో నివసించే 15 ఏళ్ల బాలికకు గొడవ జరిగింది. ఈ క్రమంలో బాలిక చెయ్యిని ఆమె బలంగా మెలిపెట్టింది. నొప్పితో బాధపడిన బాలిక తన తల్లితో కలసి ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకొని వచ్చింది. అనంతరం వారిద్దరూ సోనీతోమళ్లీ గొడవపడ్డారు. ఈ క్రమంలో బాలిక కత్తితో సోనీ చేతిపైన, కడుపులోనూ గాయాలు చేసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు బాలికను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దిల్లీ జల్ శాఖ మంత్రి ఆతిశీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!