కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం.

Published : 15 Apr 2024 05:32 IST

ఒట్టావా: కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు వెల్లడించారు. ‘కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈ నెల 12న రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా.. కారులో చిరాగ్‌ విగత జీవిగా పడి ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదు’ అని వాంకోవర్‌ పోలీసులు ఆదివారం ప్రకటించారు. చిరాగ్‌ హరియాణాకు చెందిన వ్యక్తి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని