ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం
ఓ ఎస్యూవీ అతి వేగంగా దూసుకెళ్లి ఆటో, బైక్ను ఢీకొట్టగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. ఆటోలో ఉన్న నలుగురు,
గుజరాత్లో ఆరుగురి దుర్మరణం
గాంధీనగర్: ఓ ఎస్యూవీ అతి వేగంగా దూసుకెళ్లి ఆటో, బైక్ను ఢీకొట్టగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన గుజరాత్ ఆనంద్ జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది. ఆటోలో ఉన్న నలుగురు, బైక్పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారును వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. చికిత్స కోసమని ఓ ఆస్పత్రిలో చేరాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. గుజరాత్లో కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే అల్లుడైన కేతన్ పదియార్.. ఎస్యూవీని వేగంగా నడిపి ఈ ప్రమాదానికి కారణమయ్యాడని ప్రాథమికంగా తేల్చారు. కాసేపటికే కేతన్ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా