విలేకరిపై మంత్రి అనుచరుల దాడి

కర్నూలు జిల్లా ఆలూరులో ఓ పత్రికా విలేకరి (ఈనాడు కాదు) చంద్రమోహన్‌పై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు సోమవారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన ప్రకారం...

Updated : 27 Sep 2022 04:47 IST

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆలూరులో ఓ పత్రికా విలేకరి (ఈనాడు కాదు) చంద్రమోహన్‌పై కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు సోమవారం దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన ప్రకారం... ఆలూరులోని ఎల్లార్తి రహదారిలో చంద్రమోహన్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మంత్రి అనుచరులు వీరాంజి, మంజులతోపాటు మరికొందరు కలిసి ఆపారు. ‘మంత్రికి వ్యతిరేకంగా వార్తలు రాస్తావా?’ అని దుర్భాషలాడుతూ రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో చంద్రమోహన్‌ తలకు, వీపుపై బలమైన గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన మరో విలేకరీ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు