స్నేహితుడికి సాయం చేయబోయి మృత్యు ఒడికి

స్నేహితుడికి సాయం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల

Updated : 28 Sep 2022 06:09 IST

విద్యుదాఘాతంతో ఇద్దరు యువకుల మృతి

మెట్‌పల్లి, న్యూస్‌టుడే: స్నేహితుడికి సాయం చేసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన బోగ సంతోష్‌  హైవే పక్కన ఎలక్ట్రికల్‌ షాపు నిర్వహిస్తున్నారు. దుకాణాన్ని మెట్‌పల్లి అనుబంధ గ్రామం వెంకటరావుపేట శివారులోకి మార్చారు. సామగ్రిని తరలించడానికి అదేగ్రామానికి చెందిన అతని స్నేహితులు కనక వికాస్‌, బైండ్ల వినీత్‌, కనక రంజిత్‌, చొక్క ఉదయ్‌లు మంగళవారం మెట్‌పల్లికి వచ్చారు. దుకాణం పైనున్న సైన్‌బోర్డు తీస్తుండగా పైనుంచి వెళ్తున్న హైటెన్షన్‌ విద్యుత్తు తీగలకు బోర్డుకు ఉన్న ఇనుప రాడ్డు తగిలింది. దీంతో విద్యుదాఘాతానికి గురైన వికాస్‌(25), వినీత్‌(26)లు అక్కడికక్కడే మృతి చెందారు. రంజిత్‌, ఉదయ్‌లకు స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని