కామారెడ్డిలో తల్లీ కుమారుడి ఆత్మహత్య ఘటన.. మున్సిపల్ ఛైర్మన్ సహా ఏడుగురిపై కేసు
కామారెడ్డిలో తల్లీ కుమారుడి ఆత్మహత్య ఘటనపై అక్కడి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
కామారెడ్డి: కామారెడ్డిలో తల్లి గంగం పద్మ, కుమారుడు గంగం సంతోష్ ఆత్మాహుతి ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణకు ప్రత్యేక విచారణాధికారిగా బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. మృతుల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో, ఆడియో ఆధారంగా ఏడుగురిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలపై ఏ1గా పల్లె జితేందర్గౌడ్, ఏ2 సరాబ్ యాదగిరి, ఏ3 పృథ్వీగౌడ్ ఐరేని, ఏ4 తోట కిరణ్, ఏ5 కన్నాపురం కృష్ణా గౌడ్, ఏ6 సరాబ్ స్వరాజ్, ఏ7 సీఐ నాగార్జున గౌడ్పై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లా పోలీసుల సమన్వయంతో కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రధానంగా రామాయంపేట మున్సిపల్ ఛైర్మన్ జితేందర్గౌడ్, మార్కెట్ ఛైర్మన్ యాదగిరి, సీఐ నాగార్జున గౌడ్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఏం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జిలో శనివారం తెల్లవారుజామున మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి గంగం సంతోష్(41), ఆయన తల్లి పద్మ(68) ఆత్మాహుతి చేసుకున్నారు. తమ చావుకు రామాయంపేట పట్టణానికి చెందిన పల్లె జితేందర్గౌడ్ (పురపాలక సంఘం అధ్యక్షుడు), ఐరేని పృథ్వీరాజ్ అలియాస్ బాలు, సరాబ్ యాదగిరి (మార్కెట్ కమిటీ ఛైర్మన్), తోట కిరణ్, కన్నాపురం కృష్ణాగౌడ్, సరాబ్ స్వరాజ్ (యాదగిరి కుమారుడు), తాండూరి నాగార్జునగౌడ్ (ప్రస్తుతం తుంగతుర్తి సీఐ) కారణమంటూ ఫేస్బుక్లో వేర్వేరుగా సందేశాలు పెట్టి ప్రాణాలొదిలారు. ‘మా చావుకు కారణమైన వారిని అందరూ చూస్తుండగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి శిక్షించాలి’ అని వేడుకున్నారు.
బాధిత కుటుంబానికి రేవంత్ పరామర్శ
తల్లీకుమారుడు గంధం పద్మ, సంతోష్ ఆత్మాహుతిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులను ఫోన్లో ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రామాయంపేటలోని సంతోష్ కుటుంబసభ్యులతో మాట్లాడించారు. సంతోష్ తండ్రి అంజయ్, సోదరుడు శ్రీధర్తో రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. ధైర్యంగా ఉండాలని చెప్పారు. దోషులకు కఠిన శిక్ష పడేలా పోరాడతామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?