Crime New: స్నేహితుడి కుమార్తెపై అత్యాచార ఘటన.. ఉన్నతాధికారిపై సస్పెన్షన్ వేటు
Crime News: దిల్లీ స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్ అధికారి.. తన స్నేహితుడి కుమార్తెపై కొన్నినెలల పాటు దారుణాలకు పాల్పడ్డాడు. దీనిపై దిల్లీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
దిల్లీ: స్నేహితుడి మైనర్ కుమార్తెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన ఓ ఉన్నతాధికారిపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Delhi Chief Minister Arvind Kejriwal) ఆదేశించారు. అలాగే సాయంత్రం ఐదు గంటల్లోగా ఈ ఘటనపై ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీ నివేదిక సమర్పించనున్నారు.
దిల్లీ స్త్రీ, శిశు అభివృద్ధి శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక సీనియర్ అధికారి తన స్నేహితుడు మరణించడంతో.. అతడి కుమార్తె బాగోగులు చూస్తానంటూ ముందుకొచ్చాడు. ఆ కుటుంబంతో కొన్నేళ్లుగా స్నేహం ఉండడంతో బాలికను అతడితో పంపేందుకు తల్లి కూడా సమ్మతించింది. ఆ విధంగా ఇంటికి తీసుకెళ్లిన అధికారి బాలికపై నవంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్య అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు నిందితుడి భార్య కూడా అతడికి సహకరించింది. తన కుమారుడితో గర్భవిచ్ఛిత్తి మాత్రలు తెప్పించి బాలికతో మింగించింది.
30 కి.మీ. వెంటాడి.. వేటాడి.. పల్నాడులో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు
అయితే ఆ బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి ఆమెను ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లగా.. జరిగిన విషయమంతా బాధితురాలు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు.
‘ఆ అధికారి హీనమైన చర్యకు పాల్పడ్డారు. ఈ నేరంలో అతడి భార్య కూడా భాగమైంది. ఆ అధికారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్( Swati Maliwal) ఆదేశించారు. అలాగే సాయంత్రం ఐదు గంటల్లోగా చీఫ్ సెక్రటరీ నివేదిక సమర్పించనున్నారు. అధికారిని అరెస్టు చేయడంలో దిల్లీ పోలీసులు విఫలమవడం ఈ కేసులో అత్యంత దారుణమైన అంశం. అతడికి కఠిన శిక్ష పడాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆ అధికారిని వెంటనే అరెస్టు చేయాలని దిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతీమాలివాల్ పోలీసులకు నోటీసులు ఇచ్చారు.
బాలికకు వరుస పానిక్ అటాక్స్..
2020 నుంచి 2021 మధ్య ఐదు నెలల పాటు ఆ బాలికపై అత్యాచారం జరిగింది. దాంతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. వరుస పానిక్ అటాక్స్ను ఎదుర్కొన్నట్లు సమాచారం. వాటిని గమనించిన తల్లి ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు మానసిక చికిత్స అందించారు. వైద్యులు అందించిన సమాచారం మేరకు ఆగస్టు 13న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అధికారి, అతడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
తప్పిపోయాడనుకున్న తమ మూడేళ్ల చిన్నారి మృతదేహం పాఠశాల తరగతి గది ఆవరణలో కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
భూ తగాదాల నేపథ్యంలో జరిగిన గొడవ ఓ కుటుంబంలో విషాదం నింపింది. -
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!