YSRCP: 30 కి.మీ. వెంటాడి.. వేటాడి.. పల్నాడులో రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు
మాపై డీఎస్పీకి ఫిర్యాదు చేసేంతటి వాడివా అంటూ పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు.
తెదేపా నేత కారు అద్దాలు ధ్వంసం
ఈనాడు డిజిటల్, నరసరావుపేట, రెంటచింతల, గురజాల, న్యూస్టుడే: మాపై డీఎస్పీకి ఫిర్యాదు చేసేంతటి వాడివా అంటూ పల్నాడు జిల్లా మాచర్లలో వైకాపా నాయకులు రెచ్చిపోయారు. గురజాల నడిబొడ్డున డీఎస్పీ కార్యాలయం పక్కనే రెంటచింతల మండలం రెంటాలకు చెందిన తెదేపా నాయకుడు పేరం సర్వారెడ్డిపై దాడికి పాల్పడి, కారు అద్దాలు పగలగొట్టారు. ఏం జరిగిందో తెలియక ఆదివారం సాయంత్రం 10 నిమిషాల పాటు స్థానికుల్లో భయాందోళన నెలకొంది. సర్వారెడ్డి సోదరుడు జగ్గారెడ్డి ఇటీవల చనిపోగా, కుటుంబసభ్యులను పరామర్శించేందుకు మాచర్ల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆదివారం రెంటాలకు వచ్చారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో నివాసముంటున్న సర్వారెడ్డి కూడా బ్రహ్మారెడ్డి వెంట వచ్చి గ్రామంలో పర్యటించారు. దీనిపై వైకాపా నాయకులు సర్వారెడ్డితో వాగ్వాదానికి దిగారు. బ్రహ్మారెడ్డిని రెంటాలకు తీసుకువచ్చేంతటి వాడివా అంటూ దాడికి యత్నించారు.
డీఎస్పీ కార్యాలయం సమీపంలోనే..
దాడి భయంతో సర్వారెడ్డి రెంటచింతలకు కారులో వెళ్తుండగా, వైకాపా నాయకులు ఓ కారులో కర్రలు వేసుకొని 5 కి.మీ. దూరం వెంబడించారు. రెంటచింతలకు రాగానే సర్వారెడ్డి కారును ఆపి, అద్దాలు పగలగొట్టారు. బాధితుడు అక్కడి నుంచి తప్పించుకొని అద్దాలు పగిలిపోయిన కారులోనే మరో 10 కి.మీ దూరంలోని గురజాలకు బయల్దేరారు. అక్కడ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేద్దామని, కారును కార్యాయలం పక్కనే ఆపి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. అతడిని వెంబడించిన వైకాపా ముఠా మరోసారి దాడికి దిగింది. సర్వారెడ్డిని బలవంతంగా కారులో ఎక్కించుకొని రెంటచింతల వైపు తీసుకెళ్లారు. గురజాల పోలీసులు ఆపే ప్రయత్నం చేసినా ఆగలేదు. వారు రెంటచింతల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ మాటువేసిన పోలీసులు సర్వారెడ్డిని, అతడిని వెంబడించిన వైకాపా శ్రేణులను పోలీసుస్టేషన్కు తరలించారు. రెంటాల నుంచి రెంటచింతల, అక్కడి నుంచి గురజాల, గురజాల నుంచి రెంటచింతల వరకు సుమారు 30 కి.మీ. దూరం మూకలు వెంటాడాయి. రెంటచింతలలో పోలీసు పహారా పెంచారు. దుకాణాలు మూయించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడులో నర్సరీలో మొక్కలు చనిపోవడానికి సర్వారెడ్డి కారణమని వైకాపా నేత సీతారామరెడ్డి జులైలో ఠాణాలో ఫిర్యాదు చేశారు. నర్సరీలో భాగస్వామిగా ఉన్న సర్వారెడ్డి గడ్డిమందు చల్లి మొక్కలు చనిపోయేలా చేశారన్న ఆరోపణపై అతడిని జైలుకు పంపారు. ఇటీవలే బెయిల్పై బయటకు రాగా, తాజాగా దాడిని ఎదుర్కొన్నారు.
ఆరుగురిపై ఫిర్యాదు
తనపై రెంటాలకు చెందిన నవులూరి చెన్నారెడ్డి, నవులూరి అశోక్రెడ్డి, జక్కిరెడ్డి రాజశేఖరరెడ్డి, పోట్లూరి శ్రీనివాసరెడ్డి, పోట్లూరి వెంకటరెడ్డి, చిన్నపరెడ్డి వంశీరెడ్డి కలిసి దాడి చేసి, చంపడానికి ప్రయత్నించారని రెంటచింతల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెదేపా నాయకుడు సర్వారెడ్డి చెప్పారు. గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన రాత్రి 10 గంటల సమయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. -
లంచం డబ్బు వదిలి.. పరుగో పరుగు..!
దొంగలు పరుగెత్తడం.. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెంటాడడం సాధారణమే. లంచం తీసుకున్న ఒక పోలీసు ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులను చూసి.. నడిరోడ్డుపై పరిగెత్తగా వారు వెంటాడి పట్టుకున్న సంఘటన గురువారం హైదరాబాద్లో చోటుచేసుకుంది. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద హైవేపై లారీ, కంటైనర్ ఢీకొన్నాయి. -
అర్ధరాత్రి రెండు రైళ్లలో దోపిడీ
మచిలీపట్నం నుంచి బీదర్ వెళ్తున్న బీదర్ ఎక్స్ప్రెస్, తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న పద్మావతి ఎక్స్ప్రెస్ రైళ్లలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దోపిడీలు జరిగాయి. -
సినీనటుడు పృథ్వీరాజ్పై అరెస్టు వారెంట్
భార్యకు మనోవర్తి చెల్లింపు కేసులో న్యాయస్థానం ఎదుట గైర్హాజరైన సినీ నటుడు పృథ్వీరాజ్పై విజయవాడ ప్రిన్సిపల్ ఫ్యామిలీ కోర్టు నాన్బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. -
‘కూలి’న బతుకులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందడం విషాదం నింపింది. -
ఏపీ, ఒడిశా నుంచి తరలిస్తున్న 930 కిలోల గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తీసుకువచ్చిన 930 కిలోల గంజాయిని నొయిడా, గ్రేటర్ నొయిడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో రూ.4 కోట్లు విలువ చేసే ఈ సరకుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. -
పోలీసుల అదుపులో ఆరుగురు మావోయిస్టులు..!
ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. -
బాణసంచా తయారీ పరిశ్రమలో పేలుడు
బాణసంచా తయారీ కర్మాగారంలో సంభవించిన పేలుడులో ఆరుగురు దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్ ‘సూపర్-8’ పోరు.. భారత్ను ఢీకొట్టే జట్లు ఇవే..!
-
లైంగిక వేధింపుల కేసు.. యడియూరప్పకు ఊరట
-
కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత.. ఈపీఎఫ్ఓ నిర్ణయం
-
వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం: చంద్రబాబు
-
‘జమిలి’పై కోవింద్ కమిటీ నివేదిక.. త్వరలో క్యాబినెట్ ముందుకు!
-
జీ7 సదస్సు వేళ.. మోదీ-జెలెన్స్కీ భేటీ